
📌 Key Points
- తెలంగాణలో భూసమస్యలు, భూవివాదాలకు శాశ్వత పరిష్కారం లక్ష్యం.
- వచ్చే నెల నుంచే దశల వారీగా సమగ్ర భూ రీసర్వే ప్రారంభం.
- తొలి దశలో హైదరాబాద్ మినహా 32 జిల్లాల నుంచి 2,240 గ్రామాలు ఎంపిక.
- మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి సమీక్ష.
తెలంగాణలో భూవివాదాలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల నుంచే రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర భూముల రీసర్వే ప్రారంభం కానుంది. తొలి దశలో 2240 గ్రామాల్లో ఈ పనులు చేపట్టనున్నారు. ఇది భూ రికార్డుల ప్రక్షాళనకు మార్గం సుగమం చేస్తుంది.
భూ రీసర్వే లక్ష్యాలు, ప్రయోజనాలు
Telangana Land Resurvey 2026 : రాష్ట్రంలో భూసమస్యలు, భూవివాదాలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. భూవివాదాలు లేని తెలంగాణను నిర్మించడమే లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర భూ రీసర్వే నిర్వహించాలని కీలక నిర్ణయం తీసుకుంది. ఈ చారిత్రాత్మక కార్యక్రమాన్ని వచ్చే నెల నుంచి దశల వారీగా ప్రారంభించబోతున్నట్లు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు.
తొలి దశలో ఎంపికైన గ్రామాలు
శుక్రవారం రెవెన్యూ ఉన్నతాధికారులతో నిర్వహించిన ఉన్నత స్థాయి టెలికాన్ఫరెన్స్లో మంత్రి ఈ ప్రాజెక్టు పురోగతిపై సుదీర్ఘంగా సమీక్షించారు. రాష్ట్రంలో మొత్తం 10,954 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఇందులో భాగంగా తొలి దశలో హైదరాబాద్ మినహా మిగిలిన 32 జిల్లాల నుంచి జిల్లాకు 70 గ్రామాల చొప్పున మొత్తం 2,240 గ్రామాలను ఎంపిక చేసి రీసర్వే పనులు ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించిన అన్ని రకాల ఏర్పాట్లను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
మంత్రి పొంగులేటి ఆదేశాలు
మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 – 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన ‘లాంగ్వేజేస్ జర్నో’ అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు. Read More
ఈ సమగ్ర భూ రీసర్వే తెలంగాణలో భూసమస్యలను గణనీయంగా తగ్గిస్తుందని ప్రభుత్వం ఆశిస్తోంది. పారదర్శకమైన భూ రికార్డుల నిర్వహణ ద్వారా ప్రజలకు మేలు జరుగుతుందని, భూవివాదాలు లేని తెలంగాణ లక్ష్యం నెరవేరుతుందని భావిస్తున్నారు.


