
📌 Key Points
- తెలంగాణలోని 14 జిల్లాలకు IMD ఉరుములతో కూడిన వర్షం హెచ్చరిక జారీ చేసింది.
- మార్చి 16 నుండి 21 వరకు ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది.
- ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది.
- రాబోయే 6 రోజుల్లో ఉష్ణోగ్రతలు 2 నుండి 4 డిగ్రీల సెల్సియస్ వరకు తగ్గుతాయని IMD అంచనా వేసింది.
తెలంగాణ రాష్ట్రంలో రాబోయే ఆరు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా 14 జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని IMD తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
తెలంగాణలో వర్ష సూచన జారీ చేసిన IMD
భారత వాతావరణ శాఖ(IMD) సోమవారం (మార్చి 16, 2026) తెలంగాణ 14 జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షం హెచ్చరిక జారీ చేసింది. IMD బులెటిన్ ప్రకారం.. ఆదిలాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులు పడే అవకాశం ఉంది.
ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు ఈ నెల 16 నుంచి 21వ తేదీ వరకు కురుస్తాయని ఐఎండీ వాతావరణ శాఖ హెచ్చరించింది. మంగళ, బుధవారాల్లో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వర్షాలు పడనున్నాయి. రాష్ట్రంలో ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ.
జిల్లాల వారీగా వర్షాల ప్రభావం
తెలంగాణ జిల్లాలలోని ప్రజలు మార్చి 21 వరకు ఉరుములతో కూడిన వర్షాలు, క్రమంగా ఉష్ణోగ్రత తగ్గుదలను చూస్తారు. ఎండల నుంచి ఉపశమనం పొందనున్నారు. ఐఎండీ, హైదరాబాద్ వాతావరణ సూచన ప్రకారం..’రాబోయే 6 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుండి 4 డిగ్రీల సెల్సియస్ వరకు క్రమక్రమంగా తగ్గుతాయి. ఆదివారం నుండి తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది.’ అని ఐఎండీ హైదరాబాద్ అంచనా వేసింది.
మార్చి 16 సోమవారం నుండి మార్చి 21 వరకు హైదరాబాద్, తెలంగాణలోని పలు జిల్లాల్లో అనేక ప్రదేశాలలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు గంటకు 30-40 కి.మీ వేగంతో వీస్తాయని IMD తెలిపింది.
ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరికలు
రాబోయే 24 గంటలు హైదరాబాద్ , దాని పరిసర ప్రాంతాలలో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా 36 మరియు 23 డిగ్రీల వరకు ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
IMD ప్రకారం, కొన్ని జిల్లాల్లో ముఖ్యంగా మధ్యాహ్నం లేదా సాయంత్రం వేళల్లో బలమైన గాలులతో పాటు భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది. మార్చి 21 వరకు వర్షాలు కొనసాగే అవకాశం ఉన్నందున, అనేక జిల్లాల్లో ఉరుములు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. చెట్ల కింద, బహిరంగ ప్రదేశాల్లో నిల్చోకూడదని ఐఎండీ హెచ్చరించింది.
IMD హెచ్చరికల ప్రకారం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షాలు, ఈదురుగాలుల సమయంలో సురక్షితంగా ఉండాలని, చెట్ల కింద నిల్చోకూడదని అధికారులు సూచిస్తున్నారు.


