
📌 Key Points
- తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది.
- ‘సెషన్ ఆఫ్ సినిమా రైజింగ్’లో అల్లు అరవింద్, సురేష్ బాబు, అర్జున్ కపూర్, రాహుల్ రవీంద్రన్ పాల్గొన్నారు.
- రాహుల్ రవీంద్రన్, అర్జున్ కపూర్ సినీ పరిశ్రమ అభివృద్ధికి సమ్మిట్లు అవసరమన్నారు.
- సమ్మిట్కు 44 దేశాల నుంచి 154 మంది ప్రతినిధులు హాజరయ్యారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025లో ‘సెషన్ ఆఫ్ సినిమా రైజింగ్’ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు అల్లు అరవింద్, అర్జున్ కపూర్ తదితరులు పాల్గొని, సినిమా అభివృద్ధిపై తమ విలువైన అభిప్రాయాలు పంచుకున్నారు. ఇది పరిశ్రమ భవిష్యత్తుకు మార్గదర్శకం.
సమ్మిట్కు హాజరైన ప్రముఖులు
Telangana Rising Global Summit 2025: ‘ తెలంగాణ రైజింగ్ ‘ పేరుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గ్లోబల్ సమ్మిట్ లో ఘనంగా జరిగింది . సోమవారం జరిగిన ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క , పలువురు మంత్రులు , ఎమ్మెల్యేలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ వ్యాపార సంస్థ ప్రతినిథులు , సినీ సెలబ్రిటీలు పాల్గొన్నారు .
రెండు రోజులు ( సోమవారం , మంగళవారం ) జరిగిన ఈ సమ్మిట్ లో రెండు రోజు సమ్మిట్ లో నిన్న జరిగిన కార్యక్రమంలో 44 దేశాల నుంచి 154 మంది ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరయ్యారు. ఇందులో భాగంగా దేశంలో పెట్టుబడులు , వ్యాపార సంస్థలపై సమావేశం నిర్వహించారు . ఇక రెండో రోజు సమ్మిట్ లో భాగంగా సెషన్ ఆఫ్ సినిమా రైజింగ్ పేరుతో సమావేశం నిర్వహించారు . దీనికి తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి ప్యానెల్ స్పీకర్స్ అల్లు అరవింద్, సురేష్ బాబు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి వ్యవహరించగా .. దిల్ రాజు,అర్జున్ కపూర్, అమల, దామోదర్ ప్రసాద్, బలగం వేణు, సుప్రియ , రాహుల్ రవింద్రన్ వంటి తదితరులు పాల్గొని తమ అభిప్రాయాలను పంచుకున్నారు .
‘సినిమా రైజింగ్’లో సినీ ప్రముఖుల అభిప్రాయాలు
ఈ సందర్భంగా యాక్టర్ అండ్ డైరెక్టర్ రాహుల్ రవీంద్ర మాట్లాడుతూ .. గ్లోబల్ సమ్మి పానెల్ చర్చలో పాల్గొనడం ఎక్సయిటెడ్ గా ఉందని , సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం ఇలాంటి చర్చలు సమ్మిట్స్ అవసరమన్నారు . అలాగే పానెల్ చర్చల ద్వారా తాను మరింత నేర్చుకునే అవకాశం ఉందని , సినీ పరిశ్రమ అభివృద్ధి మరింతగా జరగాలని అందరం కోరుకుంటున్నామన్నారు . ప్రభుత్వం సినీ పరిశ్రమ కలిస్తే ఎన్నో అద్భుతాలు , విజయాలు సాధించోచ్చని ఆయన అభిప్రాయపడ్డారు .
సినీ పరిశ్రమ అభివృద్ధికి చర్చలు
అదే విధంగా బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్ మాట్లాడుతూ .. ఈ గ్లోబల్ సమ్మిట్ లో పాల్గొనటం సంతోషం గా ఉందన్నారు . విద్యార్తిగా సమ్మిట్ నుంచి కొత్త విషయాలు నేర్చుకుంటానని , ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అభివృద్ధి కోసం అందరం కలిపి పనిచేయాలన్నారు . కొత్త ఫిల్మ్ సిటీ రావడం సినిమా పరిశ్రమ మరింత అభివృద్ధి చెందుతుందని , సినిమా పరిశ్రమ నుంచి చాలా మంది ప్రముఖులు వస్తున్నారని పేర్కొన్నారు .
ఈ సమ్మిట్ సినీ పరిశ్రమకు ప్రభుత్వ సహకారం, పెట్టుబడుల ఆవశ్యకతను నొక్కి చెప్పింది. ప్రముఖుల అభిప్రాయాలు భవిష్యత్తులో తెలుగు సినిమా పరిశ్రమ మరింత వృద్ధి చెందడానికి బలమైన పునాదిగా నిలుస్తాయని ఆశిస్తున్నారు. ఇలాంటి సదస్సులు పరిశ్రమకు ఎంతో ప్రయోజనకరం.


