
📌 Key Points
- హైదరాబాద్లోని హైటెక్ సిటీలో టెస్లా సరికొత్త ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం.
- ఇది భారతదేశంలో టెస్లాకు చెందిన ఐదో కేంద్రం, జూన్ 17, 2026 నుండి అందుబాటులో.
- 2026 మోడల్ వై ప్రీమియం RWD, మోడల్ వై ఎల్ ఎలక్ట్రిక్ ఎస్యూవీలు ప్రదర్శనకు.
- బొల్లారంలో డెలివరీ, ఆఫ్టర్-సేల్స్ సేవలు; కస్టమర్లకు సౌకర్యవంతమైన అనుభవం.
తెలంగాణ రాష్ట్రం పెట్టుబడులకు స్వర్గధామంగా మారుతున్న వేళ, గ్లోబల్ ఈవీ దిగ్గజం టెస్లా హైదరాబాద్లో తన సరికొత్త ఎక్స్పీరియన్స్ సెంటర్ను ప్రారంభించింది. ఇది రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహం, ఈవీ విధానాల విజయానికి నిదర్శనం. ఈ కేంద్రం స్థానిక ఆర్థిక వ్యవస్థకు, ఉపాధి అవకాశాలకు ఊతమివ్వనుంది.
హైదరాబాద్లో టెస్లా ఐదో కేంద్రం
భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు రోజురోజుకూ ఆదరణ పెరుగుతున్న వేళ, గ్లోబల్ ఈవీ దిగ్గజం ‘టెస్లా’.. దేశంలో తన నెట్వర్క్ను మరింత విస్తరిస్తోంది. ఇందులో భాగంగానే తెలంగాణ రాజధాని, ప్రముఖ ఐటీ హబ్ అయిన హైదరాబాద్లో టెస్లా ఇండియా తన సరికొత్త ‘ఎక్స్పీరియన్స్ సెంటర్’ని గ్రాండ్గా ప్రారంభించింది. మాదాపూర్ హైటెక్ సిటీలోని నాలెడ్జ్ సిటీలో ఈ సరికొత్త కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇది భారతదేశంలో టెస్లాకు చెందిన ఐదో ఎక్స్పీరియన్స్ సెంటర్ కావడం విశేషం. జూన్ 17, 2026 నుంచి ఈ సెంటర్ అధికారికంగా ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ఈ షోరూమ్లో కంపెనీ తన లేటెస్ట్ మోడళ్లు అయిన 2026 మోడల్ వై ప్రీమియం రియర్-వీల్ డ్రైవ్ (ఆర్డబ్ల్యూడీ), మోడల్ వై ఎల్ ఎలక్ట్రిక్ ఎస్యూవీలను ప్రదర్శనకు ఉంచింది.
హైదరాబాద్లో కొత్త ఎక్స్పీరియన్స్ సెంటర్ను ప్రారంభించడం ద్వారా వినియోగదారులకు మరింత అందుబాటులో ఉండేలా, సౌకర్యవంతమైన ఈవీ కొనుగోలు అనుభవాన్ని అందించేలా చూడటమే తమ లక్ష్యమని టెస్లా ఇండియా తెలిపింది. ఇక్కడికి వచ్చే సందర్శకులు టెస్లా నిపుణుల సమక్షంలో కార్లను క్షుణ్ణంగా పరిశీలించవచ్చు. వారు ఇచ్చే ప్రొడక్ట్ డెమోల ద్వారా కారు ఫీచర్లను లైవ్గా తెలుసుకోవచ్చు.
టెస్లాకు చెందిన అత్యాధునిక ఎలక్ట్రిక్ వెహికల్ టెక్నాలజీ, అధునాతన సేఫ్టీ సిస్టమ్స్, పవర్ఫుల్ పర్ఫార్మెన్స్, కారు డిజైన్ ఫిలాసఫీని ఇక్కడి నిపుణులు కస్టమర్లకు వివరంగా వివరిస్తారు. ఈ ఫెసిలిటీని హైటెక్ సిటీ లాంటి ప్రధాన ప్రాంతంలో ఏర్పాటు చేయడం వల్ల హైదరాబాద్ సహా తెలంగాణవ్యాప్తంగా ఉన్న కస్టమర్లకు ఇది ఎంతో అనుకూలంగా మారనుంది.
కేవలం షోరూమ్ మాత్రమే కాకుండా, కస్టమర్లకు మెరుగైన సర్వీస్ సపోర్ట్ అందించేందుకు బొల్లారం ఇండస్ట్రియల్ ఏరియాలో టెస్లా ఇండియా తన డెలివరీ, ఆఫ్టర్-సేల్స్ (సర్వీసింగ్) కార్యకలాపాలను కూడా ప్రారంభించింది. దీనివల్ల ఈ ప్రాంతంలోని టెస్లా కారు యజమానులకు అమ్మకాల తర్వాత సేవల పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు.
మోడల్ వై కార్ల ప్రదర్శన, ప్రత్యేకతలు
హైదరాబాద్ కొత్త ఎక్స్పీరియన్స్ సెంటర్లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది ఈ 2026 టెస్లా మోడల్ వై ప్రీమియం రియర్-వీల్ డ్రైవ్. ఈ ఎలక్ట్రిక్ ఎస్యూవీలో ఐదుగురు ప్రయాణికులు చాలా సౌకర్యవంతంగా కూర్చోవచ్చు, అలాగే ఇందులో ఏకంగా 2,138 లీటర్ల భారీ కార్గో స్పేస్ (లగేజ్ స్థలం) లభిస్తుంది.
ఈ మోడల్ వై ప్రీమియం రియర్-వీల్ డ్రైవ్ కారు కేవలం 5.9 సెకన్లలోనే 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుందని టెస్లా ఇండియా ప్రకటించింది. అంతేకాదు, ఇది ఒకే ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే గరిష్టంగా 500 కిలోమీటర్ల దూరం (డబ్ల్యూఎల్టీపీ రేంజ్) ప్రయాణిస్తుంది. భారత మార్కెట్లో ఈ లగ్జరీ ఎస్యూవీ ఎక్స్-షోరూమ్ ధరను రూ. 50.89 లక్షలుగా నిర్ణయించారు. దీనికి సంబంధించిన డెలివరీలు జులై 2026 నుంచి ప్రారంభం కానున్నాయి.
పెద్ద కుటుంబాల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన సరికొత్త ‘మోడల్ వై ఎల్ ‘ ఎలక్ట్రిక్ ఎస్యూవీని కూడా టెస్లా తన హైదరాబాద్ సెంటర్లో ప్రదర్శిస్తోంది. ఫ్యామిలీ-ఫోకస్డ్ ఎస్యూవీగా వచ్చిన ఇందులో మూడు వరుసల సీటింగ్ ఉంటుంది. అంటే ఇందులో ఆరుగురు ప్రయాణికులు చాలా విశాలంగా కూర్చోవడానికి వీలవుతుంది.
అమ్మకాల తర్వాత సేవలు, భవిష్యత్ ప్రణాళికలు
ఈ టెస్లా మోడల్ వై ఎల్ కారు డబ్ల్యూఎల్టీపీ సర్టిఫైడ్ ప్రకారం ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 681 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఇది కేవలం 5.0 సెకన్లలోనే 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. ఇందులో లగేజ్ పెట్టుకోవడానికి 2,539 లీటర్ల భారీ కార్గో కెపాసిటీని ఇచ్చారు. ఈ మోడల్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 61.99 లక్షలుగా ఉంది.
ప్రస్తుతం ఈ రెండు టెస్లా మోడల్స్ బుకింగ్స్ కోసం అందుబాటులో ఉన్నాయి. కస్టమర్లు టెస్లా ఇండియా అధికారిక వెబ్సైట్ ద్వారా వీటిని బుక్ చేసుకోవచ్చు. జూన్ 30, 2026 లోపు ఆర్డర్ పెట్టుకునే కస్టమర్లకు కంపెనీ తరపున ఉచితంగా ‘వాల్ కనెక్టర్’ హోమ్ ఛార్జర్ను కాంప్లిమెంటరీగా అందించనున్నారు.
శరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్పీరియెన్స్తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్లో కంటెంట్ రైటర్గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు. Read More
టెస్లా రాకతో హైదరాబాద్ ఈవీ రంగంలో కీలక కేంద్రంగా మారనుంది. ఇది తెలంగాణ ప్రభుత్వ దూరదృష్టి, పారిశ్రామిక విధానాలకు నిదర్శనం. భవిష్యత్తులో మరిన్ని అంతర్జాతీయ కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఇది మార్గం సుగమం చేస్తుంది.


