|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

తెలంగాణ ఇంటర్ ఫలితాలపై ఉత్కంఠ వీడనుందా? విడుదల ఎప్పుడంటే..!

Published: 30-03-2026, 3:35 AM
తెలంగాణ ఇంటర్ ఫలితాలపై ఉత్కంఠ వీడనుందా? విడుదల ఎప్పుడంటే..!
  • తెలంగాణ ఇంటర్ పరీక్షల మూల్యాంకనం పూర్తి, ఫలితాల వెల్లడికి సిద్ధం.
  • 9 లక్షల మంది విద్యార్థులు ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు.
  • ఏప్రిల్ రెండో వారంలో ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది.
  • ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలు ఒకేరోజు విడుదల కానున్నాయి.

తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షలు ముగిశాయి. దాదాపు 9 లక్షల మంది విద్యార్థులు ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అధికారులు ఫలితాల విడుదలకు సంబంధించిన ప్రక్రియను వేగవంతం చేశారు. ఏప్రిల్ రెండో వారంలో ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది.

ఫలితాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులు

రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షలు ముగిసిన సంగతి తెలిసిందే. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ విద్యార్థులు కలిపి 9 లక్షలకుపైగా విద్యార్థులు ఎగ్జామ్స్ కు హాజరయ్యారు. మొదటి సంవత్సరానికి సంబంధించి 4 లక్షల మంది, రెండో సంవత్సరానికి సంబంధించి 5 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. వీరంతా ప్రస్తుతం ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు.

ఓవైపు పరీక్షలు జరుగుతుండగానే… మరోవైపు అధికారులు ఇంటర్ స్పాట్ వాల్యూయేషన్ చేపట్టారు. మూడు విడతల్లో చేపట్టిన ఈ ప్రక్రియ తాజాగా పూర్తి అయింది. ప్రస్తుతం క్రోడీకరణ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ప్రక్రియ కూడా పూర్తి అయితే సాంకేతిక అంశాలను పరిశీలిస్తారు. సీజీజీ(సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్) ట్రయల్స్ నిర్వహిస్తారు. అంతా ఒకే అనుకుంటే ఫలితాల విడుదలకు ఓ తేదీని ప్రకటిస్తారు.

ఏప్రిల్ లో ఫలితాలు విడుదల చేసేందుకు సన్నాహాలు

ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తి అయిన నేపథ్యంలో ఫలితాల విడుదలకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. నిజానికి ఏప్రిల్ 5 లేదా 6వ తేదీన ఫలితాలను ప్రకటించే దిశగా కసరత్తు చేశారు. కానీ పలు కారణాల రీత్యా…. ఏప్రిల్ రెండో వారంలో ఫలితాలను ప్రకటించే అవకాశం ఉంది.

ప్రభుత్వ అనుమతి తీసుకొని ఫలితాల విడుదల కోసం ఓ తేదీని ఖరారు చేస్తారు. ఒకే రోజు ఫస్ట్ ఇయర్ తో పాటు సెకండియర్ ఫలితాలు అందుబాటులోకి వస్తాయి. గతేడాదిలో చూస్తే… తెలంగాణలో ఇంటర్ పరీక్షల ఫలితాలు ఏప్రిల్ 22వ తేదీన విడుదలయ్యాయి. అయితే ఈసారి మాత్రం త్వరగానే ఫలితాలు అందుబాటులోకి వస్తాయి.

ఫలితాల విడుదల తేదీ ఖరారుకు కసరత్తులు

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 – 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన ‘లాంగ్వేజేస్ జర్నో’ అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు. Read More

తెలంగాణ ఇంటర్ ఫలితాలు త్వరలోనే విడుదల కానున్నాయి. విద్యార్థులు తమ ఫలితాల కోసం వేచి చూడాల్సిందిగా విజ్ఞప్తి. ఫలితాల విడుదల తేదీని అధికారికంగా ప్రకటిస్తారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.