
📌 Key Points
- అమెరికా, ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్లో యుద్ధ వాతావరణం నెలకొంది.
- టాలీవుడ్ హీరోయిన్ సోనాల్ చౌహాన్ దుబాయ్లో చిక్కుకుపోయారు.
- విమానాలు రద్దు కావడంతో ఆమె దుబాయ్ విమానాశ్రయంలోనే ఉండిపోయారు.
- ప్రధాని మోదీకి సోషల్ మీడియా ద్వారా సహాయం కోసం విజ్ఞప్తి చేశారు.
అమెరికా, ఇజ్రాయెల్ దాడుల కారణంగా ఇరాన్లో యుద్ధ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో టాలీవుడ్ హీరోయిన్ సోనాల్ చౌహాన్ దుబాయ్లో చిక్కుకుపోయారు. విమానాలు రద్దు కావడంతో ఆమె ప్రధాని మోదీకి సహాయం కోసం విజ్ఞప్తి చేశారు.
ఇరాన్లో యుద్ధ వాతావరణం
US-Israel Attacks Iran: అమెరికాలో భీకర యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే.. అణు ఒప్పందం విషయం పై చర్చలు జరిగిన అనంతరం అక్కడ ఆశించినంత ఫలితాలు లేకపోవడంపై డోనాల్డ్ మాట్లాడిన తర్వాత రోజు యుద్ధం మొదలైన విషయం తెలిసిందే.. గత కొద్ది రోజులుగా హెచ్చరికలు చేస్తోన్న అమెరికా అధ్యక్షుడు.. తాజాగా ఇజ్రాయెల్ జరిపిన క్షిపణి దాడులకు సహాకారం అందించారు. అణు చర్చల్లో ప్రతిష్టంభన నెలకుంది.. ఎలాగైనా సరే వాళ్ళని తమ దారిలోకి తెచ్చుకోవాలని ట్రంప్ ఎన్నిసార్లు ప్రయత్నించినా కూడా మాట వినకపోవడంతో యుద్ధం మొదలైంది.. ఇజ్రాయెల్ ‘లయన్స్ రోర్’ పేరుతో ఈ ఆపరేషన్ చేపట్టింది. టెహ్రాన్, ఇస్ఫహాన్ సహా కీలక నగరాల్లో దాడులు కొనసాగుతున్నాయి. 30 ఏజెన్సీ ప్రాంతాలతో పాటుగా పలు ప్రాంతాలలో యుద్ధ వాతావరణం కనిపిస్తుంది. అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ దాడులకు దిగడంతో గల్ఫ్ దేశాలు వణుకుతున్నాయి.. పలువురు విదేశీయులు కూడా అక్కడ చిక్కుకుపోయారు.. ఈ క్రమంలో ఆ యుద్ధంలో టాలీవుడ్ హీరోయిన్ చిక్కుకుపోయినట్టు తెలుస్తుంది. తాజాగా ఆమె మోదీకి తనని కాపాడుమని రిక్వెస్ట్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు అన్నది ఇప్పుడు మనం కాస్త వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం…
ప్రస్తుతం యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో విమానాలను రద్దు చేశారు.. దీంతో విదేశాలకు వెళ్లిన పలువురు విదేశీయులతో పాటుగా, సెలబ్రిటీలు సైతం అక్కడ చిక్కుకున్న విషయం తెలిసిందే.. ప్రముఖ బ్యాడ్మింటన్ సింధు విమానాల రద్దు కారణంగా దుబాయ్లో చిక్కుకుపోయారు.. అదేవిధంగా టాలీవుడ్ హీరో మంచు విష్ణు కూడా దుబాయ్ లోనే చిక్కుకున్నారు.. ఈ క్రమంలో తాజాగా మరో హీరోయిన్ కూడా చిక్కుకుపోయినట్లు తెలుస్తుంది.. ఆమె ఎవరో కాదు టాలీవుడ్ యంగ్ హీరోయిన్ సోనాల్ చౌహన్.. దుబాయ్ వెళ్లిన టాలీవుడ్ నటి సోనాల్ చౌహాన్ కూడా ఇరాన్ యుద్ధం కారణంగా నగరంలో చిక్కుకుపోయారు. దుబాయ్ విమానాశ్రాయంలోనే ఉండిపోయారు. ఆమె బిక్కుబిక్కుమంటూ కాపాడాల్సిందిగా ప్రధాని మోడీకి సోషల్ మీడియా ద్వారా విజ్ఞప్తి చేశారు.. తన సోషల్ మీడియా ద్వారా మోడీకి విజ్ఞప్తి చేస్తూ తనని కాపాడాలి అంటూ పోస్ట్ షేర్ చేసింది.. అది కాస్త వైరల్ అవ్వడంతో ఆమెను కాపాడాలి అంటూ నెటిజన్లు కూడా కామెంట్లు పెడుతున్నారు.. మరి దీనిపై మోడీ ప్రభుత్వం స్పందించి హీరోయిన్ ని కాపాడతారేమో చూడాలి..
దుబాయ్లో చిక్కుకున్న సోనాల్ చౌహాన్
మోదీకి హీరోయిన్ విజ్ఞప్తి
అణు ఒప్పందం విషయంలో ట్రంప్ వ్యతిరేకత వల్లే యుద్ధం జరుగుతుంది.. అమెరికా, ఇజ్రాయిల్ దాడుల పై ఇరాన్ కౌంటర్ ఇచ్చింది. యుద్ధ రంగంలోకి ఇరాన్ దిగేసింది. పశ్చిమాసియాలో ఉన్న అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ దాడులకు దిగడంతో గల్ఫ్ దేశాలు వణుకుతున్నాయి.. శనివారం ఉదయం అమెరికా పై ఇరాన్ దాడులు మొదలుపెట్టింది. బహ్రెయిన్, కువైట్, ఖతార్, యూఏఈతో పాటు 7 దేశాల్లోని అమెరికా స్థావరాలపై దాడులు చేసింది.. అమెరికా సంబంధిత రాష్ట్రాలతో పాటుగా ఇరాన్ సంబంధిత రాష్ట్రాలలో కూడా ఈ యుద్ధం తీవ్ర వాతావరణకి దారితీసింది.. మొత్తానికి ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఈ యుద్ధం భయంకరమైన పరిస్థితులను క్రియేట్ చేసింది.. దీనిపై ఆ దేశ అధినేతలు స్పందించి యుద్ధాన్ని అదుపులోకి తీసుకొస్తారా? లేదా ఇంకాస్త కఠిన తరంగా మారుస్తారా అన్నది తెలియాల్సి ఉంది..
యుద్ధం కారణంగా విదేశాల్లో చిక్కుకున్న భారతీయుల పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది. సోనాల్ చౌహాన్కు ప్రభుత్వం ఎలా సహాయం చేస్తుందో చూడాలి. ఆమె సురక్షితంగా తిరిగి రావాలని ఆశిద్దాం.


