
మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘విశ్వంభర’ సినిమాకు సంబంధించి కొత్త అప్డేట్ వచ్చింది. ఈ సినిమాలో మౌని రాయ్ ఐటెం సాంగ్ చేయబోతున్నారని తెలిసింది. ఈ పాటలో ‘ముఠామేస్త్రి’, ‘రిక్షావోడు’ సినిమాల థీమ్స్ ఉంటాయని సమాచారం.
Key Points
మౌని రాయ్ 'విశ్వంభర'లో ఐటెం సాంగ్ చేయనున్నారు.
'ముఠామేస్త్రి', 'రిక్షావోడు' సినిమాల థీమ్స్తో ఐటెం సాంగ్ రూపొందించబడింది.
ఐటెం సాంగ్ పూర్తయితే 'విశ్వంభర' షూటింగ్ 100% పూర్తయినట్లే.
‘విశ్వంభర’ ఐటెం సాంగ్ విశేషాలు
మెగాస్టార్ చిరంజీవి గురించి తెలియని వారు ఉండరు. ఇండస్ట్రీలో ఎంతో కష్టపడి పైకి వచ్చిన వారిలో మెగాస్టార్ చిరంజీవి ముందు వరుసలో ఉంటారు. అయితే అలాంటి మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికే 150 కి పైగా సినిమాలు చేశారు. ప్రస్తుతం విశ్వంభర సినిమా చేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఈ సినిమాకు వశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు. అంతేకాదు ఈ మూవీలో చిరంజీవి అలాగే హీరోయిన్ త్రిష… రొమాన్స్ చేయనున్నారు.
మౌని రాయ్ ఐటెం సాంగ్ షూటింగ్
అయితే మొన్న సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన ఈ సినిమా తరచూ వాయిదా పడుతూ వస్తోంది. దాదాపు 90 శాతం ఈ సినిమా షూటింగ్ పూర్తయిందని చెప్తున్నారు. సెప్టెంబర్ అంటే దసరా కానుకగా ఈ సినిమా రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అయితే ఇలాంటి నేపథ్యంలోనే ఈ సినిమా నుంచి ఓ అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఈ సినిమాలో మౌని రాయ్.. ఐటెం సాంగ్ చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.
రెండు సినిమాల థీమ్స్ ప్రేరణ
అయితే దీనికి సంబంధించిన సాంగ్ కాంపోజిషన్ పూర్తయిందట. ఇక ఈ పాటలో ముఠామేస్త్రి సినిమాలోని ఈ పేటకు నేనే మేస్తిరి.. రిక్షావోడు లోని జల్దీ కా నామ్ గాడి హై థీమ్స్ ఇలా వచ్చి అలా వెళ్ళిపోతాయని సమాచారం. ఆ మూమెంట్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈనెల 25వ తేదీన ఈ పాట షూట్ కూడా ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఈ ఐటెం సాంగ్ పూర్తి అయితే షూటింగ్ 100% ఫినిష్ అయినట్లేనని చెబుతున్నారు.
మొత్తంగా చూస్తే, ‘విశ్వంభర’ సినిమాకు మౌనిరాయ్ ఐటెం సాంగ్ ఒక బిగ్ అట్రాక్షన్గా ఉంటుందని అనిపిస్తోంది. షూటింగ్ పూర్తి కావడంతో సినిమా రిలీజ్ కు దారితీస్తుందని భావిస్తున్నారు.


