
📌 Key Points
- అక్షయ తృతీయ రోజున గజకేసరి యోగం రావడం విశేషం.
- ఈ రోజున విష్ణు మూర్తి మంత్రాలను పఠించడం శ్రేయస్కరం.
- అక్షయ తృతీయ నాడు బంగారం లేదా వెండి కొనడం శుభప్రదం.
- ఈ రోజున బియ్యం, బెల్లం, బట్టలు దానం చేయడం పుణ్యఫలం.
అక్షయ తృతీయ హిందువులకు అత్యంత పవిత్రమైన రోజు. ఈ రోజున చేసే ప్రతి పని అక్షయమైన ఫలితాలను ఇస్తుంది. ఈ పర్వదినాన గజకేసరి యోగం రావడం మరింత శుభప్రదం.
అక్షయ తృతీయ ప్రాముఖ్యత
అక్షయ తృతీయ రోజు ఏ శుభకార్యానైనా పంచాంగం చూడకుండా ప్రారంభించచ్చు. ఏం చేసినా ఎక్కువ రెట్లు ఫలితం వస్తుందని నమ్ముతారు. పైగా అక్షయ తృతీయ నాడు గజకేసరి రాజయోగం రావడం మరింత విశేషం.బంగారం, వెండి కొనడం సాంప్రదాయం కూడా ఉంది. ఈ ఏడాది అక్షయ తృతీయ ఎప్పుడు వచ్చింది? శుభ ముహూర్తాలు, పరిహారాల గురించి తెలుసుకుందాం.
హిందూ మతంలో అక్షయ తృతీయకు ఎంతో ప్రాముఖ్యత వుంది. దీనిని వైశాఖ మాసంలో శుక్ల పక్షం మూడవ రోజున జరుపుకుంటారు. ఇది చాలా విశేషమైన రోజు. ఈ రోజున వివాహం, ఇంటి ప్రవేశం, భూమి పూజ, కొత్త వ్యాపారం ప్రారంభించడం వంటి ఇతర శుభకార్యాలు పంచాంగాన్ని చూడకుండానే చేయవచ్చు. 2026 సంవత్సరంలో అక్షయ తృతీయ ఏప్రిల్ 19, 2026, ఆదివారం వచ్చింది. ఈసారి ఇది అనేక అరుదైన జ్యోతిష్య యాదృచ్ఛికాలతో వస్తోంది. పైగా గజకేశరి రాజయోగం రావడం మరింత విశేషం.
అక్షయ తృతీయ రోజున ఈ శుభకార్యాలు చెయ్యచ్చు:
అభిజిత్ ముహూర్తం: ఉదయం 11:32 నుండి మధ్యాహ్నం 12:23 వరకు
గజకేసరి యోగం విశిష్టత
విజయ ముహూర్తం: మధ్యాహ్నం 02:06 నుండి 02:57 వరకు
గోధులీ ముహూర్తం: సాయంత్రం 06:21 నుండి 06:44 వరకు
అక్షయ తృతీయ నాడు పాటించాల్సిన ప్రత్యేక పరిహారాలు:
ఆచరించాల్సిన పరిహారాలు
విష్ణు మూర్తి మంత్రాలను పఠించడం వల్ల ప్రత్యేక ఫలితాలు వస్తాయి.
పూజ తరువాత ఈరోజు బియ్యం, బెల్లం, బట్టలు, పండ్లు, ఆవులను దానం చేయాలి.
ఈరోజు బంగారం లేదా వెండి కొనడం చాలా శుభప్రదమైనదిగా పరిగణించబడుతుంది.
అక్షయ తృతీయ శుభ సందర్భంలో ఈ సూచనలు పాటించి, సిరిసంపదలు, సుఖసంతోషాలతో తులతూగాలని ఆశిస్తున్నాము. శుభం భూయాత్!


