
📌 Key Points
- రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే అంశంపై ఏపీ ప్రభుత్వం దృష్టి సారించింది.
- శాసనసభ ప్రత్యేకంగా సమావేశమై విభజన చట్టంలో సవరణ కోరుతూ తీర్మానం చేయనుంది.
- సభ ఉదయం 11 గంటలకు ప్రారంభం కాగా, స్పీకర్ చర్చనీయాంశాలను ప్రస్తావించారు.
- రాజధాని కోసం భూములిచ్చిన రైతుల త్యాగాలను సభలో గుర్తు చేశారు.
రాష్ట్ర రాజధానిగా అమరావతిని కొనసాగించేందుకు ఏపీ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఈ మేరకు శాసనసభ ప్రత్యేకంగా సమావేశమై చట్టపరమైన చర్యలు చేపట్టనుంది. మరికాసేపట్లో సభలో కీలక తీర్మానం ప్రవేశపెట్టనున్నారు.
అమరావతి రాజధానిగా చట్టబద్ధత
రాష్ట్ర రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే అంశంపై ఏపీ సర్కార్ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా శాసనసభ ఇవాళ ప్రత్యేకంగా సమావేశమైంది. విభజన చట్టంలో సవరణ చేయాలని కేంద్రాన్ని కోరుతూ తీర్మానం చేయనుంది.
విభజన చట్టంలో సవరణ కోరుతూ తీర్మానం
ఇవాళ(శనివారం) ఉదయం 11 గంటలకు శాసనసభ మొదలు కాగా… ముందుగా స్పీకర్ అయ్యన్నపాత్రుడు సభలో చర్చించే అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతుల త్యాగంతో పాటు పలు అంశాలను వివరించారు.
సభలో రాజధాని రైతుల త్యాగాల ప్రస్తావన
మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 – 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన ‘లాంగ్వేజేస్ జర్నో’ అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు. Read More
అమరావతిని రాజధానిగా కొనసాగించే దిశగా ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ ప్రత్యేక సమావేశం భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో వేచి చూడాలి.


