
📌 Key Points
- సాయికృష్ణ మరణం కేసులో పరారీలో ఉన్న ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు అశోక్, నాని లొంగిపోయారు.
- కృష్ణలంక మాజీ సీఐ నాగరాజుకు కుడిభుజాలుగా వీరు అక్రమ కార్యకలాపాలకు పాల్పడ్డారు.
- బార్లు, లాడ్జీల వ్యవహారాలు, సివిల్ సెటిల్మెంట్లు, రౌడీషీటర్లతో బెదిరింపులు వీరిపై ఆరోపణలు.
- వీరి లొంగుబాటుతో సాయికృష్ణ మృతి వెనుక మరిన్ని నిజాలు వెలుగులోకి రానున్నాయి.
విజయవాడ సాయికృష్ణ మరణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. పరారీలో ఉన్న ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు అశోక్, నాని పోలీసుల ఎదుట లొంగిపోయారు. సీఐ నాగరాజుకు కుడిభుజాలుగా వ్యవహరించిన వీరు పలు అక్రమ దందాలకు పాల్పడినట్లు సిట్ గుర్తించింది. వీరి లొంగుబాటుతో కేసులో మరిన్ని నిజాలు బయటపడే అవకాశం ఉంది.
సాయికృష్ణ కేసులో హెడ్ కానిస్టేబుళ్ల లొంగుబాటు
విజయవాడలో గాదె సాయికృష్ణ మరణం కేసులో కీలక పరిణామం జరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు, కృష్ణలంక మాజీ సీఐ నాగరాజుకు కుడిభుజాలుగా వ్యవహరించిన ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు పోలీసుల ఎదుట లొంగిపోయారు. సీఐ అరెస్ట్ అయినప్పటి నుంచి పరారీలో ఉన్న హెడ్ కానిస్టేబుళ్లు అశోక్, నాని సూర్యారావుపేట ఏసీపీ కార్యాలయానికి వచ్చి స్వయంగా లొంగిపోయారు. సాయికృష్ణ మృతి వెనుక వీరు సీఐ నాగరాజుకు పూర్తిస్థాయిలో సహకరించినట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం నిర్ధారించింది.
సిట్ విచారణలో లొంగిపోయిన ఈ ఇద్దరు పోలీసుల విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలోని అసాంఘిక కార్యకలాపాలకు వీరే సూత్రధారులని తేలింది. హెడ్ కానిస్టేబుల్ అశోక్ స్టేషన్ పరిధిలోని బార్లు, మద్యం దుకాణాలు, లాడ్జీలు.. ఇతర విషయాలను చూసుకునేవాడు. అంతేకాకుండా.. సివిల్ సెటిల్మెంట్లు చేస్తూ పెద్ద ఎత్తున అక్రమార్జనకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి.
అశోక్, నాని అక్రమ దందాల చిట్టా
హెడ్ కానిస్టేబుల్ నాని రౌడీషీటర్లు, పాత నేరస్థులతో ముఠాగా ఏర్పడి బెదిరింపులకు పాల్పడేవాడు. గతంలో పటమట స్టేషన్లో ఉన్నప్పుడు స్పా సెంటర్ల నిర్వాహకులను వేధించడంతో ఇతడిని వీఆర్కు పంపారని తెలుస్తోంది. గన్నవరంలో పనిచేసినప్పుడు ఓ మిస్సింగ్ కేసులో తానే ఎస్సైని అంటూ డబ్బులు వసూలు చేసి సస్పెండ్ కూడా అయ్యాడు.
పోలీస్ స్టేషన్లో రౌడీషీటర్ల కౌన్సెలింగ్, నిందితుల విచారణ వంటి అధికారిక వ్యవహారాల్లో సురేష్ అనే ప్రైవేట్ వ్యక్తిని కూడా వీరు భాగస్వామిని చేసినట్లు సిట్ గుర్తించింది. గత నెల 29న సాయికృష్ణ బంధువులను బెదిరించేందుకు లేదా ప్రభావితం చేసేందుకు అశోక్, నాని, సురేష్ కలిసి గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం వడ్డేశ్వరానికి వెళ్లినట్లు ఆధారాలు లభించాయి.
పోలీసుల అండతో సాగిన అక్రమాలపై విచారణ
ఇప్పటికే ప్రైవేట్ వ్యక్తి సురేష్ను అదుపులోకి తీసుకున్న సిట్ అధికారులు, ఇప్పుడు లొంగిపోయిన ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లను రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారు. ఈ లొంగుబాటుతో సాయికృష్ణ మృతి వెనుక ఉన్న మరిన్ని అసలు నిజాలు, నగరంలో పోలీసుల అండతో సాగిన మరికొన్ని అక్రమ దందాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.
ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు.
హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్సైట్స్ లాంచ్ టీమ్లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు. Read More
ఈ హెడ్ కానిస్టేబుళ్ల లొంగుబాటుతో సాయికృష్ణ కేసులో కొత్త కోణాలు వెలుగులోకి రానున్నాయి. నగరంలో పోలీసుల అండతో సాగిన అక్రమ దందాలపై విచారణ జరిపి, దోషులను కఠినంగా శిక్షించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.


