|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఏపీ బడ్జెట్ విప్లవం: ప్రజలే నిర్ణేతలు! జిల్లాల్లో సభలు, సంచలన ప్రకటన!

Published: 11-03-2026, 5:05 AM
ఏపీ బడ్జెట్ విప్లవం: ప్రజలే నిర్ణేతలు! జిల్లాల్లో సభలు, సంచలన ప్రకటన!
  • రాష్ట్ర బడ్జెట్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది.
  • త్వరలో జిల్లాల్లో బడ్జెట్ సమావేశాలు నిర్వహించనున్నారు.
  • ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ గురించి వివరించనున్నట్లు తెలిపారు.
  • రాష్ట్రం ఆర్థిక ప్రగతిలో దూసుకెళుతోందని మంత్రి పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది. బడ్జెట్‌ను ప్రజల వద్దకు తీసుకెళ్లి, వారి భాగస్వామ్యంతో అభివృద్ధిని సాధించేందుకు ప్రభుత్వం జిల్లాల్లో బడ్జెట్ సమావేశాలు నిర్వహించనుంది.

బడ్జెట్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం చర్యలు

రాష్ట్ర బ‌డ్జెట్‌ను ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు తీసుకెళ్లేలా ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మం రూపొందిస్తోంది. త్వ‌ర‌లోనే జిల్లాల్లో బ‌డ్జెట్ స‌మావేశాలు ఏర్పాటు చేయనుంది. ఇదే విషయంపై రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావులు కేశవ్ కీలక ప్రకటన చేశారు. ప్ర‌జ‌ల‌కు బ‌డ్జెట్ గురించి వివ‌రిస్తామ‌న్నారు.

ఇవాళ స‌చివాల‌యంలో జ‌రిగిన క‌లెక్ట‌ర్ల స‌ద‌స్సులో ఆయ‌న మాట్లాడుతూ… రాష్ట్ర ఆర్థిక ప్ర‌గ‌తి ల‌క్ష్యాల గురించి అధికారుల‌కు వివ‌రించారు.సీఎం సూచనలతో ఈ సారి ఆర్థిక శాఖ ఒక వినూత్న ఒర‌వ‌డితో ముందుకెళుతోంద‌ని చెప్పారు. గ‌తంలో మార్చి 31తేదీ వ‌ర‌కు కూడా బ‌డ్జెట్ పూర్తీ చేసేవారు కారు… కానీ ఇప్పుడు 20 రోజుల‌కంటే ముందే బ‌డ్జెట్‌ను పూర్తి చేశామని తెలిపారు.

జిల్లాల్లో బడ్జెట్ సమావేశాల నిర్వహణ

గ‌త రెండు సంవ‌త్స‌రాలు ప్ర‌భుత్వం అనేక ఒడిదొడుకుల‌ను త‌ట్టుకుని ముందుకెళ్లింద‌ని మంత్రి పయ్యావుల వివరించారు. ఇప్పుడు రాష్ట్రం ఆర్థిక ప్ర‌గ‌తిలో దూసుకెళుతోంద‌న్నారు. ముఖ్య‌మంత్రి మార్గ‌ద‌ర్శ‌నంలో రాష్ట్రం ఈ రోజు ఒక అసాధ‌ర‌ణ వృద్ధి ప‌థంవైపు ప‌య‌నిస్తోంద‌న్నారు. రాబోయే ఆర్థిక సంవ‌త్స‌రం అసాధ‌ర‌ణ వృద్ధి సంవ‌త్స‌రం (ఇయ‌ర్ ఆఫ్ ఎక్ట్స్రార్డిన‌రీ గ్రోత్‌)గా నిల‌వ‌బోతోంద‌న్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని అధికారులంతా ద్విగిణీకృత ఉత్సాహంతో ప‌నిచేయాల‌న్నారు.

రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ను ఈ సారి ఒక సామాన్యుడి ఇంటి బ‌డ్జెట్ త‌ర‌హాలో రూపొందించామ‌న్నారు. త‌ద్వ‌రా బ‌డ్జెట్‌ను సామాన్యుడి చెంత‌కు తీసుకెళ్లాల‌న్న‌దే ముఖ్య‌మంత్రి ధ్యేయ‌మ‌న్నారు. బ‌డ్జెట్ మీటింగులు క్షేత్ర‌స్థాయికి తీసుకెళ్లాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింద‌ని, త్వ‌ర‌లోనే ఈ కార్య‌క్ర‌మానికి సంబంధించి తేదీలు ఖ‌రారు చేస్తామ‌న్నారు. ఆ ప్ర‌కారం జిల్లాల్లో బ‌డ్జెట్ స‌మావేశాలు నిర్వ‌హిస్తామ‌న్నారు. ఈ లోపు ఆయా జిల్లాల వారీగా బ‌డ్జెట్ కేటాయింపులు ఖ‌ర్చు చేసే దిశ‌గా అధికారులు చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. అలాగే ఈ బ‌డ్జెట్‌లో జిల్లాల వారీగా కూడా ఆయా శాఖ‌ల ఉన్న‌తాధికారులు బ‌డ్జెట్ కేటాయింపులు కూడా పూర్తి చేయాల‌ని పేర్కొన్నారు. త‌ద్వారా బ‌డ్జెట్ గురించి ఆ జిల్లాల్లో ప్ర‌జ‌ల‌కు వివ‌రించ‌డానికి వీల‌వుతుంద‌ని అభిప్రాయపడ్డారు.

ఆర్థిక ప్రగతిపై మంత్రి పయ్యావుల ప్రకటన

కేంద్రం నుంచి వ‌చ్చే నిధుల్లో ప్ర‌తి పైసా కూడా ఖ‌ర్చు చేయాల‌ని మంత్రి ప‌య్యావుల అధికారుల‌ను కోరారు. కేంద్రం నుంచి వివిధ ప‌థ‌కాలు, కార్య‌క్ర‌మాల‌కు కోసం వ‌చ్చే నిధుల్లో ప్ర‌తి పైసా ఖ‌ర్చు చేసేలా అధికారులు చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. అయితే కొన్ని చోట్ల కాస్తంత నిర్లిప్త‌త క‌నిపిస్తోంద‌న్నారు. అలా కాకుండా కేటాయించిన ప్ర‌తి రూపాయిని కూడా వృథా కాకుండా స‌మ‌ర్థంగా ఖ‌ర్చు చేయాల‌న్నారు.

కేంద్రం నుంచి వ‌చ్చిన నిధులు ఏఏ శాఖ‌లో ఎక్క‌డెక్క‌డ ఖ‌ర్చు చేయ‌డం లేదో వాటిని గుర్తించి వాటిని ఖ‌ర్చు చేయడానికి అమిత ప్రాధాన్యం ఇవ్వాల‌ని ఆ దిశ‌గా ఆయా శాఖాధిప‌తులు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని దిశానిర్దేశం చేశారు. ప్ర‌భుత్వంలో మొత్తం వ్య‌యాన్ని ఖ‌ర్చు చేయాల‌నేదే ల‌క్ష్యంగా ప‌నిచేయాల‌న్నారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 సాధనకు పది సూత్రాల కార్యక్రమం లక్ష్యాలు సాధించే దిశగా అధికారులు పనిచేయాలని…. జీెెెఎస్డీపీ లక్ష్యాలు సాధించడమే ధ్యేయంగా పనిచేయాలని స్పష్టం చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రజలకు చేరువ చేసేందుకు కృషి చేస్తోంది. రాబోయే సమావేశాల్లో ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని మరింత అభివృద్ధి దిశగా అడుగులు వేయనున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.