|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

సర్కార్ గుడ్ న్యూస్: ఉద్యోగుల పెండింగ్ బకాయిలపై సీఎం చంద్రబాబు భారీ ప్రకటన!

Published: 02-04-2026, 10:05 AM
సర్కార్ గుడ్ న్యూస్: ఉద్యోగుల పెండింగ్ బకాయిలపై సీఎం చంద్రబాబు భారీ ప్రకటన!
  • ఉద్యోగుల పెండింగ్ బిల్లుల చెల్లింపులపై సీఎం చంద్రబాబు సమీక్ష.
  • రూ.7,358 కోట్ల పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని అధికారులకు ఆదేశం.
  • ఇప్పటికే రూ.1,848 కోట్ల ప్రావిడెంట్ ఫండ్ బకాయిలు ఉద్యోగుల ఖాతాల్లో జమ.
  • చిన్న కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపుల్లో ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం ఆదేశం.

ఏపీలోని ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు నాయుడు సర్కార్ తీపి కబురు అందించింది. ఉద్యోగుల పెండింగ్ బిల్లుల చెల్లింపునకు సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీనికి సంబంధించి ఆర్థిక శాఖపై ఆయన సమీక్ష నిర్వహించారు.

ఉద్యోగుల పెండింగ్ బిల్లులపై సీఎం సమీక్ష

ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ బిల్లుల చెల్లింపులపై గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు… ఆర్థిక శాఖపై సమీక్షించారు. ఈ మేరకు రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల పెండింగ్ బిల్లుల చెల్లింపులపై ఆరా తీశారు.

ఉద్యోగుల పెండింగ్ బిల్లుల చెల్లింపులు జరపాలని గతంలో ఇచ్చిన ఆదేశాలను ఏ మేరకు అమలు చేశారని అడిగారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనల మేరకు కసరత్తు చేశామని… నిధుల లభ్యతను బట్టి చెల్లింపులను జరుపుతున్నామని అధికారులు వివరించారు. ఉద్యోగులకు రిలీఫ్ ఇచ్చేలా మొత్తంగా రూ.7,358 కోట్ల మేర పెండింగ్ బిల్లుల విడుదలకు చర్యలు తీసుకున్నామని అధికారులు సీఎంకు తెలిపారు.

పెండింగ్ బకాయిల విడుదలకు సీఎం ఆదేశాలు

ఇందులో భాగంగా ఇప్పటికే ప్రావిడెంట్ ఫండ్ బకాయిల కింద రూ.1,848 కోట్లను నేరుగా ఉద్యోగుల ఖాతాల్లో జమ చేశామని చెప్పారు. అలాగే గ్రూప్ లైఫ్ ఇన్సూరెన్స్ కింద 4,793 మందికి సంబంధించిన రూ.76 కోట్ల చెల్లింపులు కూడా పూర్తి చేశామని వెల్లడించారు. వీటితో పాటు గ్రాట్యుటీ బకాయిల కింద రూ. 3,411 కోట్లు, పెండింగులో ఉన్న రిటైర్డ్ ఉద్యోగుల లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ కింద రూ. 1,800 కోట్లు, పోలీస్ శాఖకు సంబంధించి అదనపు సరెండర్ లీవుల నిమిత్తం రూ. 223 కోట్ల బిల్లుల విడుదల ప్రక్రియ కొనసాగుతోందని వివరించారు.మరో రెండు రోజుల్లో చెల్లింపులు పూర్తి చేస్తామని అధికారులు సీఎంకు చెప్పారు.

తల్లికి వందనం తర్వాత ఒకేసారి ఇంత పెద్ద మొత్తంలో చెల్లింపులు జరుపుతోంది ఉద్యోగులకు మాత్రమేనని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. నిధుల లభ్యతను బట్టి ఉద్యోగుల పెండింగ్ బిల్లుల సహా అన్ని రకాల పెండింగ్ బిల్లులకు చెల్లింపులు జరపాలని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఈ క్రమంలో గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగుల విషయంలో జరిగిన పరిణామాలు ప్రస్తావనకు వచ్చాయి.

కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపుల్లో ప్రాధాన్యత

ఇదే సమీక్షా సమావేశంలో వివిధ పనులు చేసిన కాంట్రాక్టర్లకు, మెటిరీయల్ సరఫరా చేసిన వారికి జరపాల్సిన చెల్లింపులపైనా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరా తీశారు. వివిధ శాఖలకు మెటీరియల్ సరఫరా చేసిన చిన్న చిన్న కాంట్రాక్టర్లకు రూ.614 కోట్ల బకాయిల చెల్లింపులు జరిపామని అధికారులు తెలిపారు. పనులు చేసిన, మెటిరీయల్ సరఫరా చేసిన వాళ్లకు బిల్లులు చెల్లింపులు జరిపే ప్రక్రియలో చిన్న కాంట్రాక్టర్లకు పెద్ద పీట వేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 – 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన ‘లాంగ్వేజేస్ జర్నో’ అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు. Read More

మొత్తానికి, ఉద్యోగుల పెండింగ్ బిల్లుల చెల్లింపునకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం ద్వారా ఉద్యోగులకు ఊరట లభించనుంది. నిధుల లభ్యతను బట్టి మిగిలిన పెండింగ్ బిల్లులను కూడా చెల్లించాలని సీఎం ఆదేశించారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.