
📌 Key Points
- బక్రీద్ సెలవు మార్పుతో మే 28న జరగాల్సిన పరీక్షలు వాయిదా.
- మే 28 పరీక్షలు జూన్ 5వ తేదీకి రీషెడ్యూల్ చేయబడ్డాయి.
- హాల్ టికెట్లలో, పరీక్షా కేంద్రాల్లో ఎలాంటి మార్పులు లేవు.
- bie.ap.gov.in లేదా మనమిత్ర వాట్సాప్ ద్వారా హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల తేదీల్లో ఏపీ ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. బక్రీద్ సెలవు దినాన్ని మార్చడంతో, మే 28న జరగాల్సిన పరీక్షలను జూన్ 5కు వాయిదా వేసింది. విద్యార్థులు కొత్త షెడ్యూల్ను గమనించి తదనుగుణంగా సిద్ధం కావాలని సూచించింది.
పరీక్షల తేదీల మార్పునకు కారణం
AP Inter Supplementary Exams 2026 : ఏపీ ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు ఇంటర్ బోర్డు కీలక అప్డేట్ ఇచ్చింది. బక్రీద్ (ఈద్-ఉల్-అజ్హా) సెలవు దినాన్ని మే 28వ తేదీకి మారుస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో…. ఆ రోజు జరగాల్సిన పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఏపీ ఇంటర్మీడియట్ విద్యామండలి కార్యదర్శి పి. రంజిత్ బాషా ప్రకటన విడుదల చేశారు. మే 28న జరగాల్సిన ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షలను జూన్ 5వ తేదీకి రీషెడ్యూల్ చేశారు.
గతంలో ప్రకటించిన టైమ్టేబుల్ ప్రకారం…. మే 28వ తేదీన ఉదయం సెషన్లో జరగాల్సిన ఫస్ట్ ఇయర్ పరీక్షలను జూన్ 5వ తేదీ ఉదయం (09:00 గంటల నుండి 12:00 గంటల వరకు) నిర్వహించనున్నారు.
మే 28వ తేదీన మధ్యాహ్నం సెషన్లో జరగాల్సిన సెకండ్ ఇయర్ పరీక్షలను కూడా జూన్ 5వ తేదీ మధ్యాహ్నం (02:30 గంటల నుండి 05:30 గంటల వరకు) నిర్వహించనున్నారు.
కొత్త పరీక్షల షెడ్యూల్ వివరాలు
ఈ మార్పు ప్రకారం… ఆయా సబ్జెక్టు విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు వెళ్లాలని ఇంటర్ బోర్డు సూచించింది. పరీక్షా కేంద్రాలు, హాల్ టికెట్లలో ఎలాంటి మార్పులు ఉండవని స్పష్టం చేసింది. తీవ్రమైన ఎండల దృష్ట్యా పరీక్షా కేంద్రాల వద్ద తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు మరియు అవసరమైన వైద్య సదుపాయాలను సిద్ధంగా ఉంచాలని అధికారులను ఆదేశించింది.
ఇక ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల హాల్ టికెట్లను బోర్డు అధికారిక వెబ్ సైట్ https://bie.ap.gov.in/ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మనమిత్ర వాట్సాప్ వేదికగా కూడా వీటిని అందుబాటులోకి ఉంచారు. ‘మన మిత్ర’ వాట్సాప్ నంబరు 9552300009 కు మెసేజ్ చేయడం ద్వారా విద్యార్థులు నేరుగా తమ మొబైల్లోనే హాల్టికెట్ను సులువుగా పొందే వీలుంది. డౌన్లోడ్ చేసుకోని విద్యార్థులు… పైన పేర్కొన్న విధంగా ప్రాసెస్ పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది.
హాల్ టికెట్లు, ఇతర సూచనలు
విద్యార్థులు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో తమ పేరు, ఫోటో, సంతకం, పరీక్షా కేంద్రం వివరాలు, రాసే సబ్జెక్టుల కోడ్లు సరిగ్గా ఉన్నాయో లేదో ఒకసారి క్షుణ్ణంగా పరిశీలించుకోవాలని అధికారులు సూచించారు. ఏవైనా తప్పులు ఉంటే వెంటనే కళాశాల యాజమాన్యాన్ని లేదా బోర్డు హెల్ప్లైన్ను సంప్రదించాల్సి ఉంటుంది.
మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 – 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన ‘లాంగ్వేజేస్ జర్నో’ అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు. Read More
ఈ మార్పులు విద్యార్థులకు కొంత గందరగోళం కలిగించినా, పరీక్షల నిర్వహణలో పారదర్శకతను, ప్రభుత్వ నిర్ణయాల ప్రభావాన్ని ఇది స్పష్టం చేస్తుంది. విద్యార్థులు కొత్త తేదీలను దృష్టిలో ఉంచుకొని పరీక్షలకు సన్నద్ధం కావాలి.


