
టాలీవుడ్ నటుడు అడివి శేష్ నటిస్తున్న డకాయిట్ సినిమా షూటింగ్లో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో అడివి శేష్ మరియు మృణాల్ ఠాకూర్కు గాయాలయ్యాయి. ప్రమాదం ఉన్నప్పటికీ, షూటింగ్ కొనసాగుతోంది.
Key Points
డకాయిట్ సినిమా షూటింగ్లో ప్రమాదం సంభవించింది.
అడివి శేష్ మరియు మృణాల్ ఠాకూర్కు గాయాలయ్యాయి.
అడివి శేష్ ఆసుపత్రికి వెళ్ళనున్నట్లు సమాచారం.
షూటింగ్లో ప్రమాదం
టాలీవుడ్ హీరో అడివి శేష్ ప్రస్తుతం డెకాయిట్ మూవీలో నటిస్తున్నారు . ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా జరుగుతున్న షూటింగ్ లో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది . హీరోతో పాటు హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కు కూడా గాయాలైనట్లు సమాచారం . అయినప్పటికీ ఈ రోజు షూట్ ను యథాతథంగా కొనసాగించినట్లు తెలుస్తోంది . ఈ ప్రమాదంలో అడివి శేష్ కు కాలు బాగా వాపు రావడంతో ఆస్ప త్రికి వెళ్లనున్నట్లు టాక్ .
కాగా.. ఇప్పటికే డకాయిట్ మూవీ నుంచి ఫైర్ గ్లింప్స్ను మేకర్స్ విడుదల చేశారు. షానీల్ డియో తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ తెలుగు, హిందీ భాషల్లో ఈ చిత్రం నిర్మిస్తున్నారు. అడివి శేష్ నటించిన ‘క్షణం’, ‘గూఢచారి’తో సహా పలు తెలుగు సినిమాలకు కెమెరామేన్గా చేసిన షానీల్ డియో ఈ మూవీతో డైరెక్టర్గా పరిచయం అవుతున్నారు. ఇద్దరు మాజీ ప్రేమికుల కథే ‘డకాయిట్ను ప్రేక్షకులమ ముందుకు తీసుకొస్తున్నారు.
నటులకు గాయాలు
షూటింగ్ కొనసాగింపు
డకాయిట్ సినిమా షూటింగ్లో జరిగిన ప్రమాదం అడివి శేష్ మరియు మృణాల్ ఠాకూర్లకు గాయాలను కలిగించింది. అయినప్పటికీ, షూటింగ్ కొనసాగుతోంది. తదుపరి వివరాల కోసం ఎదురుచూడాలి.


