
📌 Key Points
- దళపతి విజయ్ ‘జన నాయగన్’ ఆడియో లాంచ్ ఈవెంట్ జీ5లో జనవరి 4న స్ట్రీమింగ్ కానుంది.
- విజయ్ తన చివరి సినిమాగా ప్రకటించి, రాజకీయ ప్రవేశంపై కీలక వ్యాఖ్యలు చేశారు.
- “నేను సినిమాను వదిలేస్తున్నా” అంటూ అభిమానుల కోసం రాజకీయాల్లోకి వస్తున్నానని తెలిపారు.
- పూజా హెగ్డే, అనిరుధ్, అట్లీ, నెల్సన్, లోకేష్ కనగరాజ్ వంటి సినీ ప్రముఖులు ఈవెంట్లో సందడి చేశారు.
దళపతి విజయ్ చివరి సినిమా ‘జన నాయగన్’ ఆడియో లాంచ్ ఈవెంట్ ఇప్పుడు జీ5లో స్ట్రీమింగ్కు సిద్ధమైంది. జనవరి 4న ప్రసారం కానున్న ఈ ఈవెంట్లో విజయ్ తన రాజకీయ ప్రవేశంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన సినిమా ప్రయాణం ముగించి అభిమానుల కోసం నిలబడతానని ప్రకటించారు.
ఓటీటీలో స్ట్రీమింగ్ వివరాలు
తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన చివరి సినిమా జన నాయగన్ ఆడియో లాంచ్ ఈ మధ్యే మలేషియాలో జరిగిన విషయం తెలుసు కదా. ఈ ఈవెంట్ ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. తాజాగా జీ5 ఓటీటీ స్ట్రీమింగ్ డేట్, టైమ్ వెల్లడించింది.
దళపతి విజయ్ తన చివరి సినిమాగా చెబుతున్న జన నాయగన్ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలుసు కదా. ఈ సినిమా ఆడియో లాంచ్ ఈవెంట్ ఈ మధ్యే అంటే డిసెంబర్ 27న మలేషియాలో జరిగింది. ఆ ఈవెంట్ ను లైవ్ స్ట్రీమింగ్ చేయలేదు. కానీ ఇప్పుడది ఓటీటీలోకి అడుగుపెడుతోంది.
జన నాయగన్ ఆడియో లాంచ్ స్ట్రీమింగ్
విజయ్ రాజకీయ వ్యాఖ్యలు
“బిగ్గెస్ట్ సౌత్ ఈవెంట్ ఆఫ్ ద ఇయర్.. ఒక ఐకాన్. ఒక చివరి గర్జన. ఒక మరచిపోలేని రాత్రి.. దళపతి తిరువీర జన నాయగన్ ఆడియో లాంచ్ జనవరి 4న జీ5లో ప్రీమియర్ కానుంది” అనే క్యాప్షన్ తో ట్వీట్ చేసింది. ఈ సందర్భంగా ఈవెంట్ కు సంబంధించి చిన్న టీజర్ కూడా జోడించింది.
సినిమాను వదిలేస్తున్నా..: విజయ్
“నేను సినిమాలోకి వచ్చినప్పుడు ఇక్కడొక చిన్న ఇసుక గూడు కట్టుకుంటున్నా అనుకున్నా. కానీ మీరందరూ కలిసి నాకోసం ఒక రాజభవనాన్ని కట్టారు. అభిమానులు నాకోసం ఒక ‘కోట’ను (Kottai) నిర్మించారు. నాకోసం సర్వస్వం ఇచ్చిన అభిమానుల కోసం నేను నిలబడాలని నిర్ణయించుకున్నా. అందుకే మీకోసం నేను సినిమాను వదిలేస్తున్నా” అని విజయ్ అన్నాడు. తమిళనాడులో ‘కొట్టై’ అంటే అసెంబ్లీ/సెక్రటేరియట్ అని అర్థం.
ఈవెంట్ లో సినీ ప్రముఖులు
రాజకీయ ప్రత్యర్థులకు పరోక్షంగా వార్నింగ్ ఇస్తూ విజయ్ ఇలా అన్నాడు. “జీవితంలో గెలవాలంటే స్నేహితులు అవసరం లేదేమో కానీ.. ఒక బలమైన శత్రువు కచ్చితంగా ఉండాలి. అప్పుడే మనం ఇంకా బలంగా మారుతాం. కాబట్టి, 2026లో చరిత్ర పునరావృతం అవుతుంది. ప్రజల కోసం మనం సిద్ధంగా ఉందాం” అని విజయ్ అన్నాడు.
ఈ ఆడియో లాంచ్ ఈవెంట్ ఇప్పుడు జనవరి 4న జీ5 లో స్ట్రీమింగ్ కానుంది. హీరోయిన్ పూజా హెగ్డే, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్, డైరెక్టర్లు అట్లీ, నెల్సన్, లోకేష్ కనగరాజ్ ఈ ఈవెంట్లో సందడి చేశారు.
మొత్తంగా, దళపతి విజయ్ ‘జన నాయగన్’ ఆడియో లాంచ్ కేవలం సినిమా వేడుక కాదు. ఇది ఆయన రాజకీయ ప్రవేశ ప్రకటనకు వేదికైంది. ఈ ముఖ్యమైన ఈవెంట్ జీ5లో జనవరి 4న అందుబాటులో ఉంటుంది.


