
📌 Key Points
- మైత్రీ మూవీ మేకర్స్తో ధృవ్ విక్రమ్ భారీ చిత్రం.. కోలీవుడ్లో సంచలనం!
- దర్శకుడు కరణ్ అవవింధ కుమార్ దర్శకత్వంలో సరికొత్త కథతో DV4!
- సంగీతం: సాయి అభ్యంకర్.. మైత్రీ మూవీస్ బ్యానర్లో భారీ అంచనాలు!
- తమిళంలో విజయం సాధించినా తెలుగులో నిరాశపరిచిన బైసన్ చిత్రం.
యంగ్ హీరో ధృవ్ విక్రమ్ మరో సంచలనానికి సిద్ధమయ్యారు. ఈసారి మైత్రీ మూవీ మేకర్స్తో కలిసి భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుడుతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
మైత్రీ మూవీ మేకర్స్తో ధృవ్ విక్రమ్ నెక్స్ట్ మూవీ
గతేడాది ‘బైసన్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కోలీవుడ్ హీరో ధృవ్ విక్రమ్.. అనుకున్న స్థాయిలో ఆడియన్స్ను మెప్పించలేకపోయాడు. కబడ్డి బ్యాక్ డ్రాప్లో తెరకెక్కిన ఈ చిత్రానికి మారి సెల్వరాజ్ దర్శకత్వం వహించాడు. మొదటి తమిళంలో రిలీజైన ఈ మూవీ అక్కడ మంచి టాక్ తెచ్చుకోవడంతో వారం రోజుల గ్యాప్లో తెలుగులో సైతం విడుదల చేశారు. కానీ ఇక్కడ అంతగా మెప్పించలేకపోయింది. ఇక ఈ సినిమా పరాజయాన్ని పక్కన పెట్టిన ధృవ్ విక్రమ్ ప్రజెంట్ తన తదుపరి ప్రాజెక్టుపై ఫోకస్ పెట్టాడు. ఈ మేరకు ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్తో చేతులు కలిపినట్లు తమిళ వర్గాల నుంచి సమాచారం. DV4గా రాబోతున్న ఈ మూవీకి కోలీవుడ్ స్టార్ సూర్య కరుప్పు చిత్రం రచయిత కరణ్ అవవింధ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాట్లు టాక్. అలాగే సాయి అభ్యంకర్ మ్యూజిక్ అందిస్తున్నట్లు నెట్టింట పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఇక ధృవ్ నెక్ట్స్ ప్రాజెక్టును ప్రముఖ బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా దీనిపై భారీ అంచనాలు నెట్టింట క్రియేట్ కాగా.. త్వరలో దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది.
DV4 మూవీకి దర్శకత్వం ఎవరు?
సాయి అభ్యంకర్ సంగీతం.. అంచనాలు ఎలా ఉన్నాయంటే?
ధృవ్ విక్రమ్ కొత్త సినిమా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై వస్తుండటంతో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. త్వరలోనే మరిన్ని అప్డేట్స్తో మీ ముందుకు వస్తాం. చూస్తూ ఉండండి!


