
📌 Key Points
- దుల్కర్ సల్మాన్ ‘ధురంధర్ 2’ విడుదలకి ముందే వివాదంలో చిక్కుకుంది!
- ముంబైలో డ్రోన్ అనుమతి లేకుండా షూటింగ్ చేసినందుకు కేసు నమోదు!
- లొకేషన్ మేనేజర్ రింకు రాజ్పాల్పై FIR నమోదు చేసిన పోలీసులు!
- మార్చి 19న విడుదల కానున్న ‘ధురంధర్ 2’పై నీలినీడలు కమ్ముకున్నాయ్!
దుల్కర్ సల్మాన్ నటించిన ‘ధురంధర్ 2’ చిత్రం విడుదలకి ముందే ఊహించని వివాదంలో చిక్కుకుంది. డ్రోన్ కెమెరాల వినియోగంపై కేసు నమోదు కావడంతో ఒక్కసారిగా సినిమాపై నీలినీడలు కమ్ముకున్నాయి. అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం రండి!
విడుదలకి ముందే వివాదంలో ధురంధర్ 2
Dhurandhar : ఇటీవల బాలీవుడ్ లో వచ్చిన ధురంధర్ సినిమా భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణవీర్ సింగ్ హీరోగా వచ్చిన ధురంధర్ సినిమా ఆల్మోస్ట్ 800 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఈ సినిమా సీక్వెల్ ధురంధర్ 2 కోసం పాన్ ఇండియా ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.(Dhurandhar)
నేడు ధురంధర్ 2 టీజర్ రిలీజ్ చేసి ఈ సినిమా మార్చ్ 19 న రిలీజ్ కానుందని ప్రకటించారు. అయితే ఈ సూపర్ హిట్ సీక్వెల్ సినిమా రిలీజ్ కి ముందు సినిమా యూనిట్ పై కేసు నమోదు అవడం సంచలనంగా మారింది.
డ్రోన్ వాడకంపై కేసు నమోదు
పార్ట్ 2 కి సంబంధించి మిగిలిన కొంత షూటింగ్ ప్రస్తుతం జరుగుతుంది. దక్షిణ ముంబైలోని ఫోర్ట్ ప్రాంతంలో ఈ షూటింగ్ జరుగుతుంది. సంజయ్ దత్ కూడా ఈ షూటింగ్ లో పాల్గొన్నారు. అయితే ఈ ప్లేస్ లో డ్రోన్స్ ఎగురవేయడానికి అనుమతి లేదు. కానీ ధురంధర్ సినిమా షూటింగ్ కోసం ఈ ప్రదేశంలో డ్రోన్ ఎగురవేశారు.
దీంతో ఈ సినిమా లొకేషన్ మేనేజర్పై FIR నమోదు చేయబడింది. దక్షిణ ముంబైలోని ఫోర్ట్ ప్రాంతంలో అనుమతి లేకుండా డ్రోన్ను ఎగురవేయడంతో ఈ సినిమా లొకేషన్ మేనేజర్ రింకు రాజ్పాల్ పై ఫిబ్రవరి 1న MRA మార్గ్ పోలీస్ స్టేషన్లో అతనిపై FIR నమోదు చేసారు. దీనిపై లొకేషన్ మేనేజర్ కానీ, నిర్మాత కానీ మూవీ యూనిట్ కానీ ఇంకా స్పందించలేదు.
సినిమా యూనిట్కు షాక్!
త్వరలో ధురంధర్ 2 రిలీజ్ కాబోతుండగా ఇలా కేసు నమోదు కావడంతో బాలీవుడ్ లో చర్చగా మారింది. మరి దీనిపై మూవీ యూనిట్ స్పందిస్తుందా లేదా చూడాలి.
దుల్కర్ సల్మాన్ సినిమా విడుదలకి ముందే ఇలాంటి చిక్కుల్లో పడటం అభిమానులను కలవరానికి గురిచేస్తోంది. దీనిపై చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


