
టాలీవుడ్ సూపర్ స్టార్ నాగార్జున తన కోడలు శోభిత ధూళిపాళపై ప్రశంసలు కురిపించారు. శోభిత అద్భుతమైన నటి అని, తమ ఇంట్లో మరో కూతురులా ఉందని నాగార్జున పేర్కొన్నారు. ఆమెతో పుస్తకాలు, సంగీతం, గార్డెనింగ్ వంటి విషయాలపై మాట్లాడుకుంటానని తెలిపారు. నాగ చైతన్య, శోభిత వివాహం వివరాలను కూడా ఈ సందర్భంగా పంచుకున్నారు.
Key Points
నాగార్జున తన కోడలు శోభితను 'అద్భుతమైన నటి'గా, కూతురుగా అభివర్ణించారు.
వారు పుస్తకాలు, సంగీతం, గార్డెనింగ్ వంటి విషయాలపై మాట్లాడుకుంటారు.
2018లో 'గూఢచారి' సినిమాలో శోభిత నటనను నాగార్జున ఎంతో మెచ్చుకున్నారు.
నాగ చైతన్య, శోభిత 2024 డిసెంబర్లో హైదరాబాద్లో వివాహం చేసుకున్నారు.
శోభిత ధూళిపాళతో నాగార్జున బంధం
టాలీవుడ్ సూపర్ స్టార్ నాగార్జున తన కోడళ్లను చూసి మురిసిపోతున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో వాళ్లపై ప్రశంసలు కురిపించాడు. తన కొడుకు, నటుడు నాగ చైతన్య గతేడాది డిసెంబర్లో నటి శోభిత ధూళిపాళను హైదరాబాద్లో ఒక ప్రైవేట్ వేడుకలో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. చైతన్య, శోభిత మధ్య బంధాన్ని తానే పరోక్షంగా కలిపానని నాగార్జున ఇంతకుముందు చెప్పాడు. ఇప్పుడు టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఈ సీనియర్ నటుడు తన కోడలుతో తన బంధం గురించి మాట్లాడాడు.
శోభిత ధూళిపాళతో నాగార్జున బంధం
శోభిత తో తన రిలేషన్షిప్ గురించి నాగార్జున చాలా బాగా చెప్పాడు. “ఆమె నిజంగా ఫెంటాస్టిక్. మేము బుక్స్ ఇంకా మ్యూజిక్ గురించి మాట్లాడుకుంటాం. ఇప్పుడైతే ఆమె నాగ చైతన్య ఇంట్లో ఒక గార్డెన్ పెంచాలని అనుకుంటోంది. నాకు కూడా గార్డెనింగ్లో చాలా ఇంట్రెస్ట్ ఉంది. అందుకే దాని గురించి చాలా మాట్లాడుకుంటాం. ఇది చాలా మంచి బంధం. ఇంట్లో ఒక కూతురు ఉన్నట్లు ఉంది. ఇప్పుడు మాకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు – జైనాబ్ (అఖిల్ భార్య), శోభిత” అని నాగార్జున అన్నాడు.
శోభిత నటనపై నాగార్జున ప్రశంసలు
ఆసక్తికరంగా శోభిత తన ఫ్యామిలీలోకి రాకముందే ఆమె నటనను నాగార్జున మెచ్చుకున్నాడు. 2018లో వచ్చిన ‘గూఢచారి’ సినిమాలో ఆమె పర్ఫార్మెన్స్ తనకు నచ్చిందని అతడు గుర్తు చేసుకున్నాడు. వెంటనే ఆమెకు కాల్ చేసి తన అప్రిసియేషన్ని చెప్పానని అన్నాడు. ఒకసారి అతని ఇంట్లో జరిగిన అలాంటి మీటింగ్లో చైతన్య అనుకోకుండా రావడంతో వాళ్ళిద్దరూ మొదటిసారి కలుసుకున్నారు. శోభితను “బ్రిలియంట్ యాక్ట్రెస్”గా వర్ణిస్తూ.. ఆమె కష్టం, వైజాగ్ నుంచి ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్థానం సంపాదించుకోవడం చాలా స్ఫూర్తిదాయకం అని నాగ్ పొగిడాడు.
నాగ చైతన్య, శోభిత ధూళిపాళ పెళ్లి
నాగ చైతన్య 2021లో సమంతతో విడిపోయిన విషయం తెలిసిందే. తర్వాత 2022 నుంచి శోభితతో డేటింగ్ చేశాడు. ఆ తర్వాత చైతన్య, శోభిత డిసెంబర్ 2024 లో హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోస్లో పెళ్లి చేసుకున్నారు. ఈ పెళ్లి చాలా కొద్దిమంది దగ్గరి ఫ్రెండ్స్, ఫ్యామిలీతో జరిగింది. ఇందులో రామ్ చరణ్, చిరంజీవి, ఎస్.ఎస్. రాజమౌళి, నాని కూడా పాల్గొన్నారు.
నాగ చైతన్య – శోభిత పెళ్లి వివరాలు
నాగార్జున తర్వాత తన అధికారిక ఎక్స్ అకౌంట్లో కొత్త జంట ఫొటోలు షేర్ చేస్తూ.. “శోభిత, చైతన్య కలిసి ఈ అందమైన అధ్యాయాన్ని మొదలుపెట్టడం చూడటం నాకు ఒక స్పెషల్ ఎమోషనల్ మూమెంట్. నా ప్రియమైన చైతన్యకు కంగ్రాట్స్. శోభితా ఫ్యామిలీకి స్వాగతం.. నువ్వు మా జీవితాల్లోకి ఇప్పటికే చాలా సంతోషాన్ని తీసుకొచ్చావు” అని రాశాడు.
నాగార్జున తర్వాతి ప్రాజెక్టులు
ఇక వర్క్ పరంగా నాగార్జున చివరిగా రజినీకాంత్తో కలిసి ‘కూలీ’లో కనిపించాడు. ఆ సినిమాకు మిక్స్డ్ రివ్యూస్ వచ్చినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా రూ.517 కోట్లు వసూలు చేయగలిగింది. నాగార్జున తర్వాతి ప్రాజెక్ట్లో డైరెక్టర్ రా కార్తీక్ తో కలిసి పని చేయనున్నాడు. దీనికి తాత్కాలికంగా ‘కింగ్ 100’ అని పేరు పెట్టారు. ఇది ఒక యాక్షన్-ఫ్యామిలీ డ్రామాగా చెబుతున్నారు. ఈ సినిమా మరిన్ని వివరాల కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
నాగార్జున వ్యాఖ్యలు శోభితతో ఆయనకున్న అద్భుతమైన బంధాన్ని తెలియజేస్తున్నాయి. ఆమెను కూతురుగా స్వీకరించడం, నటనను ప్రశంసించడం కుటుంబంలో శోభిత స్థానాన్ని సుస్థిరం చేస్తుంది. ఈ కొత్త జంటకు భవిష్యత్తులో మంచి జరగాలని ఆశిస్తున్నాం.


