📌 Key Points
- శ్రీవల్లి దెబ్బకు షాక్ తిన్న అమ్మానాన్న.. చీపురుతో చితక్కొట్టిన సీన్ వైరల్!
- ప్రేమను పట్టించుకోని ధీరజ్.. అసలు నిజం తెలుస్తుందా?
- ఫుల్లుగా తాగి వచ్చిన చందు.. ఏం చెప్పాడో తెలుసా?
- రామరాజుపై సాగర్ ఫైర్.. ఇంటిలో రచ్చ రచ్చ!
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో ఊహించని ట్విస్ట్! శ్రీవల్లి రెచ్చిపోయింది! చందు షాకింగ్ నిజం చెప్పడానికి రెడీ అయ్యాడు! అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి!
చీపురుతో శ్రీవల్లి విధ్వంసం.. కారణం అదేనా?
Illu Illalu Pillalu April 6 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఏప్రిల్ 6 ఎపిసోడ్ లో ఓ వైపు ప్రేమ, ధీరజ్ ల మధ్య గొడవ కొనసాగుతూనే ఉంటుంది. ప్రేమ ఎంత ప్రేమగా మాట్లాడిన ధీరజ్ పట్టించుకోడు. మరోవైపు అమ్మానాన్నపై శ్రీవల్లి మండిపడుతుంది. ఇంకోవైపు పూటుగా తాగి వచ్చిన చందు.. తండ్రికి నిజం చెప్పాలనుకుంటాడు.
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే ఏప్రిల్ 6 ఎపిసోడ్ లో.. తనను తప్పుగా అర్థం చేసుకుంటున్నావంటూ ధీరజ్ తో చెప్తూ ప్రేమ ఏడుస్తుంది. అమూల్య విషయంలో తాను ఏ తప్పు చేయలేదని అంటుంది. నా మనసులో స్వచ్ఛమైన ప్రేమ ఉందని చెప్తుంది. కానీ ధీరజ్ మాత్రం కరగడు.
నిజాన్ని దాస్తున్న చందు.. ఏం జరుగుతోంది?
నేను తాగి రావడానికి కారణం అదే. దానివల్లే నేను తాగా. అసలు ఏం చేసిందో తెలుసా? మీ మనసు చాలా సెన్సిటివ్. మీరు నమ్మినవాళ్లు మోసం చేస్తే తట్టుకోలేరు. అందుకే వల్లి చేసింది తెలిస్తే మీరు తట్టుకోలేరని చందు చెప్తాడు. మధ్యలో నర్మద, వల్లి వచ్చి విషయాన్ని డైవర్ట్ చేయాలని చూస్తారు. చందును ధీరజ్ లోపలికి తీసుకెళ్లాలని అనుకుంటాడు.
ప్రేమ, ధీరజ్ ల మధ్య చిచ్చు.. అసలేం జరిగింది?
అప్పుడే సాగర్ చప్పట్లు కొడుతూ సెంటిమెంట్ డ్రామా జరుగుతుందంటాడు. రామరాజు గారికి పెద్ద కొడుకుపై ప్రేమ ఎక్కువైపోయి కళ్లు పూర్తిగా మూసుకుపోయాయి. ఒకవేళ నేనే తాగి వస్తే తాగి నా ముందుకే వస్తావా? గౌరవం తగలపెట్టేస్తావా? అని దేశద్రోహం చేసినట్లు నన్ను కొట్టి గెంటేసేవాళ్లని సాగర్ అనడంతో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ రోజుకో మలుపు తిరుగుతోంది. శ్రీవల్లి ప్రవర్తన, చందు నిజం చెప్పే ప్రయత్నం ఉత్కంఠ రేపుతున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.


