
📌 Key Points
- IRCTC ద్వారా విజయవాడ నుండి తమిళనాడులోని ఆలయాలకు ప్రత్యేక ప్యాకేజీ అందుబాటులో ఉంది.
- ఈ టూర్ ప్యాకేజీలో తంజావూరు, రామేశ్వరం, మధురై, కొడైకెనాల్ ప్రాంతాలు సందర్శించవచ్చు.
- ఏప్రిల్ 25, 2026న ప్రారంభమయ్యే ఈ టూర్ ఆరు రోజులు ఉంటుంది.
- సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.51050 నుండి ధరలు మొదలవుతాయి.
IRCTC టూరిజం విజయవాడ నుండి తమిళనాడులోని ప్రముఖ ఆలయాలను సందర్శించడానికి ఒక ప్రత్యేక టూర్ ప్యాకేజీని అందిస్తోంది. ఈ ప్యాకేజీ ద్వారా భక్తులు తంజావూరు, రామేశ్వరం, మధురై వంటి ప్రదేశాలను సందర్శించవచ్చు.
IRCTC తమిళనాడు టూర్ ప్యాకేజీ వివరాలు
ఐఆర్సీటీసీ టూరిజం పలు ప్రత్యేక టూర్ ప్యాకేజీలను ఆపరేట్ చేస్తోంది. విజయవాడ నుంచి తమిళనాడులోని ప్రముఖ ఆలయాలను సందర్శించి రావొచ్చు. ఆరు రోజులు, ఐదు రాత్రుల టూర్ ప్యాకేజీ ఇది. విజయవాడ నుంచి మెుదలై.. తంజావూరు, రామేశ్వరం, మధురై, కొడైకెనాల్లాంటి ప్రాంతాలను చూడొచ్చు. 25 ఏప్రిల్ 2026న టూర్ మెుదలవుతుంది.
మధ్యాహ్నం విజయవాడ విమానాశ్రయం నుండి బయలుదేరాలి. సాయంత్రానికి తిరుచ్చి విమానాశ్రయం చేరుకోవాలి. సాయంత్రం శ్రీరంగం ఆలయాన్ని సందర్శించాలి. రాత్రి భోజనం తర్వాత తిరుచ్చిలోనే బస ఉంటుంది.
హోటల్లో అల్పాహారం చేయాలి. చెక్-అవుట్ చేసి తంజావూరుకు (60 కి.మీ) బయలుదేరాలి. బృహదీశ్వర ఆలయాన్ని సందర్శించాలి. మధ్యాహ్నం రామేశ్వరానికి (240 కి.మీ) బయలుదేరాలి. హోటల్లో చెక్-ఇన్ చేసి రాత్రి భోజనం చేసి, బస రామేశ్వరంలో ఉంటుంది.
టూర్ ఎక్కడెక్కడ జరుగుతుంది?
హోటల్లో అల్పాహారం చేయాలి. రామనాథస్వామి ఆలయం, ధనుష్కోడి, స్థానిక ఆలయాలను సందర్శించాలి. రాత్రి భోజనం, రామేశ్వరంలోనే బస చేస్తారు.
ఉదయాన్నే/ప్యాక్ చేసిన అల్పాహారంతో చెక్-అవుట్ చేయాలి. మదురైకి (180 కి.మీ) బయలుదేరాలి. మీనాక్షి ఆలయాన్ని సందర్శించాలి. కొడైకెనాల్కు (120 కి.మీ) బయలుదేరాలి. హోటల్లో చెక్-ఇన్ చేసి రాత్రి భోజనం, కొడైకెనాల్లో బస చేయాలి.
హోటల్లో అల్పాహారం చేయాలి. కొడైకెనాల్లోని స్థానిక పర్యాటక ప్రదేశాలను (బ్రియెంట్ పార్క్, గుణ గుహలు, పైన్ అడవి, పిల్లర్స్ రాక్, కొడై సరస్సు) సందర్శించాలి. రాత్రి భోజనం చేసి కొడైకెనాల్లో బస చేస్తారు.
ధరలు మరియు బుకింగ్ వివరాలు
హోటల్లో అల్పాహారం చేయాలి. చెక్-అవుట్ చేసి మదురైకి (120 కి.మీ) బయలుదేరాలి. విమానం ఎక్కడానికి మధ్యాహ్నానికి మదురై విమానాశ్రయం వద్ద దింపుతారు. సాయంత్రానికి విజయవాడ చేరుకుంటారు. ఏప్రిల్ 30వ తేదీతో టూర్ ముగుస్తుంది.
తమిళనాడు టెంపుల్ అండ్ హిల్స్ ఎక్స్-విజయవాడ టూర్ ప్యాకేజీ ధరలు చూస్తే.. సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.51050, డబుల్ ఆక్యుపెన్సీకి రూ.37900, త్రిబుల్ ఆక్యుపెన్సీకి రూ.36300గా నిర్ణయించారు. 5 నుంచి 11 ఏళ్ల చైల్డ్ విత్ బెడ్ రూ.31200, చైల్డ్ వితౌట్ బెడ్ రూ.27100, 2 నుంచి 4 ఏళ్ల వరకు చైల్డ్ వితౌట్ బెడ్ రూ.21450గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు ఐఆర్సీటీసీ టూరిజం www.irctctourism.com అధికారిక వెబ్సైట్ వెళ్లవచ్చు.
IRCTC యొక్క ఈ ప్రత్యేక టూర్ ప్యాకేజీ తమిళనాడులోని ప్రసిద్ధ ఆలయాలను సందర్శించాలనుకునే వారికి ఒక గొప్ప అవకాశం. తక్కువ ధరలో అన్ని ప్రాంతాలను చుట్టిరావచ్చు.


