
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రతి జైలులో ప్రతి మూడు నెలలకు ఒకసారి ఆరోగ్య పరీక్షలు నిర్వహించేందుకు వీలుగా, ఆరోగ్య శాఖ జైళ్లతో ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకోనుందని మంత్రి దామోదర రాజనరసింహ తెలిపారు. జిల్లా వైద్య, ఆరోగ్య అధికారుల పర్యవేక్షణలో ఈ శిబిరాలను నిర్వహిస్తారని, వీటిలో పలు రకాల పరీక్షలు అందుబాటులో ఉంటాయని జైళ్ల డీజీ సౌమ్య మిశ్రా తెలిపారు. ప్రభుత్వ 99 రోజుల ప్రజా పాలన – ప్రగతి ప్రణాలిక కార్యక్రమం కింద చంచల్గూడలోని కేంద్ర జైలులో నిర్వహించిన ఆరోగ్య శిబిరంలో మంత్రి ప్రసంగించారు. రాష్ట్రంలోని 35 జైళ్లలో ఇలాంటి శిబిరాలను నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఆరోగ్య శాఖ కార్యదర్శి డాక్టర్ క్రిస్టినా జెడ్ చొంగ్తు, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి, హెల్త్ డైరెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ, వైద్య విద్య సంచాలకులు డాక్టర్ ఎ. నరేంద్ర కుమార్, ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ బి. రవీందర్ నాయక్, తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ జె.అజయ్ కుమార్ సహా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఐజీ ఎన్. మురళీ బాబు, డీఐజీ డాక్టర్ డి. శ్రీనివాస్, చంచల్గూడ జైలు సూపరింటెండెంట్ ఎన్. శివ కుమార్ సహా సీనియర్ జైలు అధికారులు హాజరయ్యారు.
మరోవైపు సంగారెడ్డి జిల్లాలోని ఆందోలు శాసనసభ నియోజకవర్గంలో పర్యటించారు మంత్రి దామోదర రాజనరసింహ. సామాజిక పరివర్తనకు విద్య ఒక శక్తివంతమైన సాధనమని అన్నారు. నియోజకవర్గంలో మౌలిక సదుపాయాలు, విద్యా సౌకర్యాలను బలోపేతం చేయడంపై దృష్టి సారించి, రూ.27.76 కోట్ల విలువైన అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. శివంపేట పాలిటెక్నిక్ కళాశాలలో, జిల్లా కలెక్టర్ పి. ప్రవీణ్యతో కలిసి న్యూ హాలండ్ అగ్రికల్చర్ వారి సీఎస్ఆర్ నిధుల కింద రూ.43 లక్షలతో నిర్మించిన మెకానికల్ వర్క్షాప్ షెడ్ను ప్రారంభించారు.
ఆందోలును విద్యా కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు జరుగుతున్నాయని మంత్రి దామోదర రాజనరసింహ తెలిపారు. ఇందుకోసం ఇప్పటికే ఉన్న ఇంజనీరింగ్, ఫార్మసీ, వ్యవసాయ, నర్సింగ్, మహిళా కళాశాలలతో పాటు రెసిడెన్షియల్ పాఠశాలలను ఉదహరించారు. బాలికా విద్యార్థుల భద్రత, సౌకర్యాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని ఆయన నొక్కి చెప్పారు.
ఈ పర్యటనలో భాగంగా విద్యుత్ సబ్స్టేషన్, గ్రంథాలయ భవనం మొదటి అంతస్తు ప్రారంభోత్సవం కూడా ఉన్నాయి. పర్యాటక రెస్టారెంట్, ప్రభుత్వ కార్యాలయ సముదాయానికి శంకుస్థాపన చేశారు.
మెరుగైన ఉపాధి అవకాశాల కోసం చదువుతో పాటు నైపుణ్యాభివృద్ధి ప్రాముఖ్యతను కలెక్టర్ ప్రవీణ్య నొక్కి చెప్పారు. పాలిటెక్నిక్ విద్యార్థులు తమకు అందుబాటులో ఉన్న ఉన్నత విద్యావకాశాలను, ఉద్యోగావకాశాలను రెండింటినీ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు.
హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్సైట్స్ లాంచ్ టీమ్లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు. Read More


