
📌 Key Points
- అనసూయ వస్త్రాధారణపై శివాజీ కామెంట్స్కు కరాటే కళ్యాణి కౌంటర్.
- రాజ్యాంగం స్వేచ్ఛను ఇచ్చినా, విచ్చలవిడిగా బట్టలు వేసుకోవాలని చెప్పలేదన్న కళ్యాణి.
- దేవాలయాల్లో శిల్పాలకు చీరలు ఉంటాయని, బట్టలు లేవని చెప్పడం సరికాదని వాదన.
- అనసూయ వ్యాఖ్యలను మూర్ఖత్వంగా అభివర్ణించిన కరాటే కళ్యాణి.
శివాజీ డ్రెస్సింగ్ కామెంట్స్తో మొదలైన వివాదం మరింత రచ్చకెక్కింది. ఈ చర్చలో అనసూయ చేసిన వ్యాఖ్యలకు కరాటే కళ్యాణి ఘాటుగా స్పందించారు. రాజ్యాంగం, దేవాలయ శిల్పాలపై అనసూయ వ్యాఖ్యలు మూర్ఖత్వమని కళ్యాణి విమర్శించారు.
డ్రెస్సింగ్ వివాదం: అనసూయ ఆగ్రహం
Karate Kalyani Vs Anasuya: హీరోయిన్ల డ్రెస్సింగ్ పై శివాజీ చేసిన కామెంట్స్ వివాదం రోజురోజుకి మరింత ముదురుతుంది . ఆయన క్షమాపణలు చెప్పినప్పటికీ దీనిపై చర్చ జరుగుతూనే ఉంది . చిన్మయి శ్రీపాద , నటి అనసూయల ఎంట్రీతో ఈ వివాదం మరింత రచ్చకెక్కింది . మరి ముఖ్యంగా ఈ వివాదంలో అనసూయ వరుస పోస్ట్స్ , కామెంట్స్ చేస్తూ వస్తోంది . నిన్నటి శివాజీ కామెంట్స్ అనంతరం వీడియో షేర్ చేసిన అనసూయ .. ఈ రోజు ఉదయం వరుస పోస్ట్స్ చేసింది . తన వయసు ఉద్దేశిస్తూ ఆంటీ అంటున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది .
అలాగే ఆడవాళ్ల వస్త్రాధారణను తప్పుబడుతున్నవారంత .. దేవాలయాలపై ఉన్న విగ్రహలను దేవతలుగా చూస్తున్నప్పుడు బయట అమ్మాయిలను ఎందుకు తప్పుగా చూస్తున్నారని ప్రశ్నించింది . అయితే తాజాగా ఆమె పోస్ట్స్ పై కరాటే కళ్యాణి స్పందించింది . బిగ్ టీవీకి తాజాగా ఆమె ఇంటర్య్వూ ఇచ్చింది . అనసూయ ఈ వివాదాన్ని చిలిచిలికి గాలివానగా చెస్తుందన్నారు . ఎవరికి నచ్చినట్టు వాళ్లు ఉండే అధికారం రాజ్యాంగమే ఇచ్చిందన్న అనసూయ కామెంట్స్ కి ఆమె ఘాటు రిప్లై ఇచ్చింది . రాజ్యంగా కేవలం వాక్ స్వాతంత్ర్యం ఇచ్చింది తప్పా .. విచ్చలవిడిగా బట్టలు వేసుకోవచ్చని రాజ్యాంగం చెప్పలేదు కూడా . దేవాలయాల్లో బొమ్మలకు బట్టలు ఉండవు అంటుంది .. దేవాలయాల్లోని బొమ్మలకు ఖచ్చింతంగా చీరలు ఉంటాయి .
కరాటే కళ్యాణి ఘాటు సమాధానం: రాజ్యాంగం ఏం చెబుతోంది?
ఒకప్పుడు సినిమాల్లో ఉల్లిపోరలాంటి చీరలు వాడేవారు కానీ , నటీమణలు ఒంటినిండా బట్టలు వేసుకునేవారు . కాకపోతే .. వారి ఒంపుసొంపులు కనిపించేలా అలాంటి బట్టలు ఇస్తారు . అలాగే దేవాయాల్లోని బొమ్మలకు కూడా చీరలు ఉంటాయి . బట్టలు లేకుండ శిల్పి ఎలా చెక్కుతాడు . అజంత , ఎల్లోరా శిల్పం అంటూ శిల్పికి ఓ ద్రష్టి కోణం ఉంటుంది . అలా శిల్పాల ఒంపుసొంపులు కనిపించేలా చెక్కుతారు కానీ , చీరలు లేకుండ ఉండవు . బట్లలు లేకుండ కుచ్చులు అనేవి ఎందుకు ఉంటాయి . అవి రాయి కాబట్టి కనిపించవు . శిల్పాలకు చీరలు ఖచ్చితంగా ఉంటాయి ” అని కరాటే కళ్యాణి కన్ ఫాం చేశారు . అనంతరం అనసూయని ముర్ఖురాలిగా పేర్కొంది . శివాజీ వివాదంలోకి దేవుల్లను , దేవలయాల్లోని శిల్పాలను మధ్య తీసుకోవడం ముర్ఖుల లక్షణమన్నారు .
దేవాలయ శిల్పాలపై కరాటే కళ్యాణి స్పందన
వాళ్ల ప్రైవేట్ ఫంక్షన్ లో ఎలా అయిన వేసుకోండి . పబ్లిక్ ఫంక్షన్ లోకి వచ్చినప్పుడు కస్తా పద్దతిగా వేసుకోండని చెప్పడం తప్పా అని పేర్కొంది . దీనికి దేవాలయాల్లోని బొమ్మలకి కనెక్ట్ చేయడం కరెక్ట్ కాదు . నా డ్రెస్ నా ఇష్టం అన్నప్పుడు .. నా చూపు నా ఇష్టం .. అని వాళ్లు అంటే ఏం చేస్తారు . మేము ఇష్టం వచ్చినట్టు బట్టలు వేసుకుంటాం .. వాళ్లు చూడొద్దని అంటారు . ఒళ్లంత కనిపించేలా బట్టలు వేసుకున్నప్పుడు .. అబ్బాయిలు కూడా చూస్తారు . మా చూపు మా ఇష్టం అంటారు అప్పుడు నువ్వు ఏం చేయగలవు అని ఘాటు వ్యాఖ్యలు చేసింది . ఇప్పుడు 30 వయసు దాటివారిని కూడా ఆంటీ అంటున్నారు . నువ్వు 40 దగ్గర్లో ఉన్నప్పుడు ఆంటీ అనరా ? ఇంకా నువ్వు స్వీట్ సీక్సిటినా ? అని వెటకరించింది . ఇద్దరు పిల్లలు ఉన్న నువ్వు ఆంటి కాదా ? ఆంటీ అంటే ఎందుకు ఒప్పుకోవడం లేదంటూ అనసూయకు కళ్యాణ్ గట్టి చురకలు అట్టించింది .
శివాజీ వ్యాఖ్యలతో మొదలైన ఈ డ్రెస్సింగ్ వివాదం అనసూయ, కరాటే కళ్యాణిల మధ్య మాటల యుద్ధంగా మారింది. ఎవరు సరైనవారు, ఎవరు మూర్ఖులనే చర్చకు తావిస్తూ, ఈ సంఘటన సినీ వర్గాలలో తీవ్ర చర్చకు దారితీసింది.

