
📌 Key Points
- కేరళంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని లోక్ పోల్ సర్వే అంచనా.
- యూడీఎఫ్ కూటమికి 77-81 స్థానాలు వచ్చే అవకాశం ఉంది.
- ఎల్డీఎఫ్ కూటమి 58-62 సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది.
- ఎన్డీఏ కూటమికి 1-2 స్థానాలు మాత్రమే వస్తాయని అంచనా.
కేరళ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో రాజకీయ వేడి రాజుకుంది. తాజాగా లోక్ పోల్ సర్వే ఫలితాలు వెలువడ్డాయి. ఈ సర్వేలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమి అధికారంలోకి వస్తుందని అంచనా వేశారు.
లోక్ పోల్ సర్వే ఫలితాలు
కేరళం (Keralam) శాసనసభకు పోలింగ్ సమీపిస్తున్న వేళ పార్టీల మధ్య పొలిటికల్ హీట్ పెరుగుతోంది. ఈసారి అధికార ఎల్డీఎఫ్, విపక్ష యూడీఎఫ్ మధ్య నెక్ టు నెక్ ఫైట్ కనిపిస్తోంది. ఇక కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ సైతం ‘దేవభూమి’లో పాగా వేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా వెలువరించిన లోక్ పోల్ సర్వే ఫలితాల్లో కీలక విషయాలు వెల్లడయ్యాయి. ఈసారి కేరళంలో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతోందని లోక్ పోల్ సర్వే అంచనా వేసింది. కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమి 42-44 శాతం ఓట్లతో 77-81 స్థానాలు కైవసం చేసుకోబోతోందని, ఇక అధికార ఎల్డీఎఫ్ 39-41 శాతం ఓట్లతో 58-62 సీట్లు దక్కించుకోబోతోందని లెక్క కట్టింది. ఇక బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి 14-16 శాతం ఓట్లతో కేవలం 1-2 స్థానాలకే పరిమితం కాబోతున్నట్లు అంచనా వేసింది. మార్చి 16 వ తేదీ నుంచి 31వ తేదీ మధ్య జరిపిన సర్వే శాంపిల్స్ ఆధారంగా ఈ అంచనా వేసినట్లు లోక్ పోల్ శుక్రవారం వెల్లడించింది. కాగా ఈ నెల 9వ తేదీన కేరళంతో పాటు అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. మే 4న కౌంటింగ్ జరగనుంది.
కూటమిల సీట్ల అంచనా
ఎన్నికల తేదీలు, కౌంటింగ్ వివరాలు
కేరళ ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. లోక్ పోల్ సర్వే అంచనాలు నిజమవుతాయో లేదో చూడాలి. మే 4న ఫలితాలు వెలువడనున్నాయి.


