|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

కోహ్లి లైక్‌తో అవ్‌నీత్ కౌర్‌కు 2 మిలియ‌న్ల ఫాలోవ‌ర్స్‌: అది బాధాకరం.. మనం చాలా ఖాళీగా ఉన్నామంటూ రకుల్ ప్రీత్ కామెంట్లు

Published: 29-05-2025, 9:45 PM
కోహ్లి లైక్‌తో అవ్‌నీత్ కౌర్‌కు 2 మిలియ‌న్ల ఫాలోవ‌ర్స్‌: అది బాధాకరం.. మనం చాలా ఖాళీగా ఉన్నామంటూ రకుల్ ప్రీత్ కామెంట్లు

భారత క్రికెట్ స్టార్ విరాట్ కోహ్లి యొక్క ఇన్‌స్టాగ్రామ్ లైక్ వల్ల యువ నటి అవ్నీత్ కౌర్‌కు 2 మిలియన్ల ఫాలోవర్లు పెరిగారు. ఈ ఘటనపై బాలీవుడ్ నటి రకుల్ ప్రీత్ సింగ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

Key Points

1

విరాట్ కోహ్లి లైక్‌తో అవ్‌నీత్ కౌర్‌కు 2 మిలియన్ల ఫాలోవర్స్ పెరిగారు.

2

రకుల్ ప్రీత్ సింగ్ ఈ ఘటనపై ఆసక్తికరమైన అభిప్రాయాలు వ్యక్తం చేశారు.

4

కోహ్లి లైక్ పొరపాటున జరిగిందని వివరణ ఇచ్చారు.

కోహ్లి లైక్‌తో అవ్నీత్ కౌర్‌కు ఫాలోవర్స్ పెరుగుదల

భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లికి ఉన్న క్రేజ్ వేరు. అతనికి ఉన్న స్టార్ డమ్ వేరు. ఆ స్టార్ డమ్ తోనే యువ నటి అవ్‌నీత్ కౌర్‌ దశ తిరిగింది. ఇన్ స్టాగ్రామలో కోహ్లి అకౌంట్ నుంచి అవ్‌నీత్ కౌర్‌ ఫ్యాన్ పేజీలో ఓ పోస్టుకు లైక్ వెళ్లింది. దీంతో అవ్‌నీత్ కౌర్‌కు 2 మిలియన్ల ఫాలోవర్లు పెరిగారు. ప్రమోషన్లు పెరిగాయి. ప్రకటనలు పెరిగాయి. మొత్తంగా ఆమె దశ తిరిగింది. దీనిపై తాజాగా స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ స్పందించింది.

భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ.. అవ్‌నీత్ కౌర్‌ ఫ్యాన్ పోస్ట్‌ని ‘లైక్’ చేసిన విషయంపై రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేసింది. శుభంకర్ మిశ్రా పాడ్‌కాస్ట్‌లో రకుల్ మాట్లాడుతూ.. విరాట్ లైక్ చేసిన తర్వాత అవ్‌నీత్ కౌర్‌ ఫాలోవర్స్ పెరిగిన విషయాన్ని గుర్తు చేసింది. ఈ విషయంపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారని, ‘మనం చాలా ఖాళీగా ఉన్నాం’ అంటూ రకుల్ పేర్కొంది.

రకుల్ ప్రీత్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు

విరాట్, అవ్‌నీత్ కౌర్‌ గురించి చర్చ వచ్చినప్పుడు రకుల్ ఇలా రియాక్టయ్యారు. “చాలా బాధగా ఉంది. చాలా బాధగా ఉంది. మనం చాలా ఖాళీగా ఉన్నాం (హమ్ బహుత్ వేలే హై). అతని లైక్ ఆమెకు 2 మిలియన్ల ఫాలోవర్ల ను పెంచిందని మనకు తెలుసు. అతను లైక్ చేశాడో లేదో లేదా తప్పుగా జరిగిందో అది ఇక్కడ అనవసరం. ఇన్‌స్టాగ్రామ్‌లో తరచుగా మీరు తప్పుగా స్నేహితులను అన్‌ఫాలో చేస్తారు. అతను (కోహ్లి) సెలబ్రిటీ కావడం వల్ల.. ఏం లైక్త చేశాడు, లైక్ చేయలేదు అనేది వార్తలుగా మారడం చాలా బాధాకరం” అని రకుల్ తెలిపింది.

అయితే ఇన్‌స్టాగ్రామ్ అల్గారిథం కారణంగా పొరపాటున పోస్టుకు లైక్ జరిగిందని, దాని వెనుకు ఎలాంటి ఉద్దేశం లేదని విరాట్ అప్పుడే చెప్పాడు. ఈ విరాట్ ఇచ్చిన వివరణ గురించి రకుల్ స్పందించడానికి నిరాకరించింది. “ఇది చాలా వ్యక్తిగత నిర్ణయం. దానిపై వ్యాఖ్యానించడానికి నాకు అర్హత లేదు. మీరు సెలబ్రిటీ అయినప్పుడు ప్రతి విషయాన్ని అందరూ జాగ్రత్తగా పరిశీలిస్తారు. మనం సోషల్ మీడియాలో చాలా సమయాన్ని వృధా చేస్తున్నాం. అది అవసరం లేదు” అని రకుల్ పేర్కొంది.

సోషల్ మీడియా చర్చలపై రకుల్ అభిప్రాయం

అవ్‌నీత్ కౌర్‌ ఫ్యాన్ పేజీ పోస్టుకు కోహ్లి లైక్ గురించి ఎక్కువగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదని రకుల్ ఇండైరెక్ట్ గా తెలిపింది. చాలా ఖాళీగా ఉన్నామని, అందుకే ఇలాంటి విషయాలు చర్చకు వస్తున్నాయని చెప్పింది. ఇక విరాట్, అనుష్క శర్మ గురించి చెప్తూ.. వాళ్లది ఆదర్శప్రాయమైన జంట, దేశంలో అందరూ వాళ్లను ఆదర్శంగా భావిస్తున్నారని రకుల్ వివరించింది.

మే నెల ప్రారంభంలో విరాట్ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి అవ్‌నీత్ కౌర్‌ ఫ్యాన్ పేజీలో లైక్‌ కనిపించింది. ఆ పోస్ట్ తర్వాత ‘డిస్‌లైక్’ చేసినప్పటికీ.. స్క్రీన్‌షాట్‌లు వైరల్ గా మారాయి. అయితే అల్గారిథమ్ పొరపాటు అని కోహ్లి క్లారిటీ ఇచ్చాడు. కానీ విరాట్ లైక్ తో అవ్‌నీత్ కౌర్‌కు 2 మిలియన్ల ఫాలోవర్లు వచ్చి చేరారు. అంతే కాకుండా డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్‌ఫామ్ బజ్‌క్రాఫ్ట్ ప్రకారం ఆమె పోస్ట్‌ల విలువ రూ.2 లక్షల నుండి రూ.2.6 లక్షలకు పెరిగిందని వెల్లడించింది.

చివరగా, ఈ ఘటన సోషల్ మీడియా ప్రభావాన్ని, అలాగే సెలబ్రిటీల జీవితాలపై దాని ప్రభావాన్ని చూపిస్తుంది. రకుల్ ప్రీత్ సింగ్ వ్యాఖ్యలు సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా ఉపయోగించుకోవాలనే అవసరాన్ని తెలియజేస్తాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.