
కోలీవుడ్లోని ఓ సినిమా షూటింగ్లో స్టంట్ మ్యాన్ రాజు ప్రమాదవశాత్తు మరణించారు. కారు స్టంట్ సమయంలో జరిగిన ఈ ప్రమాదంపై హీరో విశాల్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. విశాల్ తన సంతాపాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.
Key Points
కోలీవుడ్ స్టంట్ మ్యాన్ రాజు షూటింగ్లో ప్రమాదవశాత్తు మరణించారు.
కారు స్టంట్ సమయంలో జరిగిన ప్రమాదంలో ఆయన మృతి చెందారు.
హీరో విశాల్ ఆయన మృతికి సంతాపం తెలిపారు.
కోలీవుడ్ పరిశ్రమలో రాజుకు ఉన్న కృషిని విశాల్ గుర్తుచేశారు.
షూటింగ్లో విషాదం
కోలీవుడ్ లో విషాదం నెలకొంది . పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓ సినిమా షూట్ లో ప్రమాదం జరిగింది . ఈ ఘటనలో స్టంట్ మ్యాన్ రాజు మరణించారు . కారుతో స్టంట్ చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది . ఈ విషాద ఘటనపై కోలీవుడ్ హీరో , నిర్మాత విశాల్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు . అతని మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు .
విశాల్ సంతాపం
విశాల్ తన ట్వీట్ లో రాస్తూ ..’ డైరెక్టర్ పా రంజిత్ సినిమా షూట్ లో ఈ రోజు ఉదయం జరిగిన విషాదం గురించి విన్నా . కారు బోల్తా పడే సన్నివేశం చేస్తూ స్టంట్ ఆర్టిస్ట్ రాజు మరణించాడనే వాస్తవాన్ని జీర్ణించుకోవడం చాలా కష్టం. రాజు నాకు చాలా సంవత్సరాలుగా తెలుసు . అతను నా సినిమాల్లో చాలా రిస్క్ స్టంట్లు చేశాడు . ఎందుకంటే అతను చాలా ధైర్యవంతుడు. అతనికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా . రాజు ఆత్మకు శాంతి చేకూరాలి. ఈ విషాద సమయంలో ఆ దేవుడు వారి కుటుంబానికి మరింత ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నా . ఇది కేవలం ఈ ట్వీట్ మాత్రమే కాదు .. అతని కుటుంబానికి భవిష్యత్తులో అండగా ఉంటాం . కోలీవుడ్ పరిశ్రమలో చాలా చిత్రాలకు ఆయన చేసిన కృషి ఎంతో విలువైంది . ఇది నా కర్తవ్యంగా వారి కుటుంబానికి మద్దతుగా నిలుస్తా ‘ అని పోస్ట్ చేశారు . రాజు మృతి పట్ల ప్రముఖ స్టంట్ కొరియోగ్రాఫర్ సిల్వా కూడా తన సంతాపం ప్రకటించారు.
రాజు మృతి
కాగా .. స్టంట్ మ్యాన్ రాజు తన సాహసోపేతమైన స్టంట్లతో కోలీవుడ్ పరిశ్రమలో ఫేమస్ అయ్యారు . తన కెరీర్ లో చాలా ఏళ్లుగా కోలీవుడ్ లో అనేక చిత్రాలకు పనిచేశారు. రాజుకు చాలా ధైర్యవంతుడిగా , నైపుణ్యం కలిగిన స్టంట్ ఆర్టిస్ట్గా గుర్తింపు పొందారు . ప్రస్తుతం అతను పనిచేసిన చిత్రంలో ఆర్య హీరోగా నటిస్తున్నారు . ఈ మూవీని 2021లో వచ్చిన ‘సర్పట్ట పరంబరై’కి సీక్వెల్ గా తెరకెక్కిస్తున్నారు . ఈ సినిమా 2026లో థియేటర్లలోకి వచ్చే ఛాన్స్ ఉంది .
కోలీవుడ్ పరిశ్రమకు రాజు చేసిన సేవలను గుర్తుంచుకుంటూ, అతని కుటుంబానికి విశాల్ తన మద్దతును ప్రకటించారు. ఈ విషాద ఘటన కోలీవుడ్లో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.


