
రజనీకాంత్, నాగార్జున, ఉపేంద్ర నటించిన `కూలీ` సినిమా తెలుగు రైట్స్ విషయంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ముగ్గురు నిర్మాతలు ఈ రైట్స్ కోసం పోటీ పడ్డారు.
Key Points
సునీల్ నారంగ్, సురేష్ బాబు, దిల్ రాజు కలిసి కూలీ తెలుగు రైట్స్ను రూ.48 కోట్లకు కొనుగోలు చేశారు.
మూవీలో నాగార్జున నెగటివ్ రోల్లో నటిస్తున్నారు.
లోకేష్ కనగరాజ్ దర్శకత్వం, రజినీకాంత్ హీరోగా నటించడం ఈ రైట్స్ డిమాండ్ పెరగడానికి కారణం.
ఓవర్సీస్ రైట్స్ రూ.80 కోట్లకు అమ్ముడయ్యాయి.
భారీ ధరకు తెలుగు రైట్స్ అమ్ముడు
సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం `కూలీ` సినిమాలో నటిస్తున్నారు. భారీ కాస్టింగ్తో ఈ మూవీ రూపొందుతోంది. ఇందులో నాగార్జున, ఉపేంద్ర, అమీర్ ఖాన్ వంటి బిగ్ స్టార్స్ నటిస్తుండటంతో సినిమా రేంజ్ మారిపోయింది. పాన్ ఇండియా మూవీకి పర్ఫెక్ట్ గా నిలిచింది.
అదే సమయంలో అన్ని భాషల్లోనూ ఈ చిత్రానికి డిమాండ్ ఏర్పడింది. ఇప్పటికే ఓవర్సీస్ రైట్స్ విషయంలో దుమ్మురేపింది. అక్కడి రైట్స్ ఏకంగా రూ.80కోట్లకు అమ్ముడు పోయాయట. ఇప్పుడు తెలుగు రైటర్స్ పరంగానూ సత్తా చాటుతోంది.
లేటెస్ట్ గా ఈ మూవీ తెలుగు రైట్స్ కి సంబంధించిన సమాచారం లీక్ అయ్యింది. భారీ రేట్కి తెలుగు స్టేట్స్ రైట్స్ అమ్ముడు పోయాయట. ముగ్గురు నిర్మాతలు ఈ రైట్స్ కోసం పోటీ పడ్డారట.
అయితే చివరికి ముగ్గురు కలిపి తెలుగు రైట్స్ తీసుకున్నట్టు తెలుస్తోంది. సునీల్ నారంగ్, సురేష్ బాబు, దిల్ రాజు కలిసి ఈ మూవీ కోసం ఏకంగా రూ.48 కోట్లు పెట్టినట్టు సమాచారం.
సినిమాకి బజ్ ఉన్న నేపథ్యంలో, పైగా లోకేష్ కనగరాజ్ మూవీ కావడంతో ఇంత భారీ రేట్కి తెలుగు రైట్స్ తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు ఈ విషయం టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది.
ముగ్గురు నిర్మాతల మధ్య పోటీ
ఇదిలా ఉంటే ఈ రైట్స్ విషయంలో నాగార్జున ప్రభావం కనిపిస్తుంది. ఆయన ఇటీవల నటించిన `కుబేర` చిత్రం మంచి ఆదరణ పొందింది. హిట్ దిశగా వెళ్తుంది. తెలుగులో ఈ చిత్రం భారీ వసూళ్లని రాబడుతుంది.
తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, ఓవర్సీస్ అన్నీ కలిపి ఓ ఎత్తైతే, తెలుగు కలెక్షన్లు అంతకు మించి ఉన్నాయి. దీంతో సినిమా మంచి వసూళ్లని రాబట్టింది. అందులో నాగార్జున, శేఖర్ కమ్ముల ల ప్రభావం స్పష్టంగా కనిపించింది.
అదే మ్యాజిక్ `కూలీ` విషయంలో వర్కౌట్ అవుతుందని నిర్మాతలు భావిస్తున్నారు. పైగా ఈ మూవీలో నాగార్జున పాత్ర మరింత స్ట్రాంగ్గా ఉంటుందట. ఆయనది నెగటివ్ రోల్ అని తెలుస్తోంది.
లోకేష్ సినిమాల్లో విలన్ పాత్ర అయినా చాలాస్ట్రాంగ్గా ఉంటుంది. పవర్ఫుల్గా ఉంటుంది. నటుడిగా ఎలివేట్ అవ్వడానికి ఉంటుంది. అదే ఉద్దేశ్యంతో నాగ్ ఈ మూవీ చేసినట్టు సమాచారం.
నాగార్జున ప్రభావం
ఇప్పటికే నాగ్కి సంబంధించిన ఒక చిన్న వీడియో క్లిప్ లీక్ గూస్బంమ్స్ తెప్పించింది. అంచనాలను పెంచేసింది. ఇదంతా తెలుగు రైట్స్ డిమాండ్ పెరగడానికి కారణమయ్యిందని చెప్పొచ్చు.
ఇక లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిన `కూలీ` చిత్రంలో రజనీకాంత్ హీరోగా నటించగా, నాగార్జున, ఉపేంద్ర, శృతి హాసన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అమీర్ ఖాన్ గెస్ట్ రోల్ అని తెలుస్తోంది.
క్లైమాక్స్ లో ఆయన ఎంట్రీ ఇచ్చి అదరగొడతాడని అంటున్నారు. సన్ పిక్చర్స్ ఈ మూవీని నిర్మించింది. ఇందులో పూజా హెగ్డే ఐటెమ్ సాంగ్ చేసింది. ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది.
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్ట్ 14న ఈ చిత్రం విడుదల కానుంది. ప్రపంచ వ్యాప్తంగా భారీగా దీన్ని రిలీజ్ చేస్తున్నారు. గోల్డ్ స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ మూవీ సాగుతుందని తెలుస్తోంది. లోకేష్ మార్క్ యాక్షన్ ఇందులో హైలైట్గా ఉండబోతుందని టాక్.
చివరకు ముగ్గురు నిర్మాతలు కలిసి `కూలీ` తెలుగు రైట్స్ను రూ.48 కోట్లకు దక్కించుకున్నారు. ఈ భారీ డీల్ టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది.


