
టాలీవుడ్ నటుడు కోట శ్రీనివాసరావు గుర్తుపట్టలేని స్థితిలో ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బండ్ల గణేష్ ఆయనను కలిసిన ఫోటోను పంచుకున్నారు. కోటా ఆరోగ్యంపై ఆందోళన నెలకొంది.
Key Points
ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నారు.
బండ్ల గణేష్ ఆయనను కలిసి ఫోటో దిగారు.
కోటాకు తీవ్రమైన షుగర్ వ్యాధి, కాలికి గాయం ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
కోట శ్రీనివాసరావు ఆరోగ్యం క్షీణించింది
టాలీవుడ్ ( Tollywood) ఇండస్ట్రీలో చాలా మంది నటులు ఉన్న సంగతి తెలిసిందే. ఒకప్పుడు విలన్ గా.. ఆ తర్వాత తండ్రి పాత్రలో, ఇప్పుడు తాత పాత్రల్లో నటిస్తున్నటాలీవుడ్ ( Tollywood) ఇండస్ట్రీలో చాలా మంది నటులు ఉన్న సంగతి తెలిసిందే. ఒకప్పుడు విలన్ గా.. ఆ తర్వాత తండ్రి పాత్రలో, ఇప్పుడు తాత పాత్రల్లో నటిస్తున్నవారు కూడా ఉన్నారు. అలాంటి వారిలో విలక్షణ నటుడు కోటా శ్రీనివాసరావు ( Kota Srinivasa Rao) ఒకరు. అప్పట్లో విలన్ అంటేనే కోటా శ్రీనివాసరావు అన్న రేంజ్ లో… ఉండేది. అలాంటి కోటా శ్రీనివాసరావు ఇప్పుడు గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నారు.
బండ్ల గణేష్ తో ఫోటో
ఆయన ఆరోగ్యం… చాలా క్షీణించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు బండ్ల గణేష్ ( Bandla Ganesh) తాజాగా… నటుడు కోటా శ్రీనివాసరావును కలిశారు. ఈ సందర్భంగా కోటా శ్రీనివాసరావు తో కలిసి ఫోటో కూడా దిగారు. కోటా శ్రీనివాస రావును ఇవాళ కలిసాను… కోట బాబాయ్ ని కలవడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది అంటూ… ఆయనను కలిసిన ఫోటోలు షేర్ చేసుకున్నాడు బండ్ల గణేష్.
సోషల్ మీడియాలో చర్చ
అయితే బండ్ల గణేష్ షేర్ చేసిన ఫోటోలో కోట శ్రీనివాసరావు ఆరోగ్యం ఏమాత్రం బాగాలేదని తెలుస్తోంది. ఆయన విపరీతమైన షుగర్ వ్యాధితో ( Sugar) బాధపడుతున్నట్లు ఆ ఫోటో చూస్తే అర్థమవుతుంది. అలాగే ఆయన ఎడమ కాలికి తీవ్ర గాయం కూడా ఉంది. షుగర్ ఉన్న వాళ్లకు అలాంటి గాయాలు సాధారణమని వైద్యులు చెబుతున్నారు. ఇక ఈ ఫోటోను చూసిన కోట శ్రీనివాసరావు ఫ్యాన్స్… ఎమోషనల్ అవుతున్నారు.
కోట శ్రీనివాసరావు గారి ఆరోగ్యంపై అభిమానులు ఆందోళన చెందుతున్నారు. వారి త్వరిత కోలుకునేందుకు శుభాకాంక్షలు తెలియజేద్దాం.


