|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రాయలసీమలో చిరుతల కలకలం! గ్రామాల్లోకి వన్యప్రాణుల దాడులు- భయాందోళనలో ప్రజలు!

Published: 08-04-2026, 10:35 PM
రాయలసీమలో చిరుతల కలకలం! గ్రామాల్లోకి వన్యప్రాణుల దాడులు- భయాందోళనలో ప్రజలు!
  • రాయలసీమలో చిరుతల సంచారం పెరుగుతోంది, ఇది మానవ-వన్యప్రాణుల సంఘర్షణకు దారితీస్తోంది.
  • గత మూడేళ్లలో 30కి పైగా చిరుతలు మానవ నివాస ప్రాంతాల్లో మరణించాయి, గత సంవత్సరంలోనే 16 మరణాలు నమోదయ్యాయి.
  • నీటి కొరత, ఆవాసాల తగ్గింపు, పర్యావరణ ఒత్తిడి వంటి కారణాల వల్ల చిరుతలు గ్రామాల్లోకి వస్తున్నాయి.
  • రైతులు ఏర్పాటు చేసిన విద్యుత్ కంచెలు చిరుతల మరణానికి కారణమవుతున్నాయి, దీనిపై అవగాహన కల్పించాలి.

రాయలసీమ ప్రాంతంలో చిరుతల సంచారం ఎక్కువ కావడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. నీటి కొరత మరియు అడవుల నరికివేత కారణంగా చిరుతలు గ్రామాల్లోకి వస్తున్నాయని అటవీ అధికారులు తెలిపారు.

రాయలసీమలో పెరుగుతున్న చిరుతల సంచారం

రాయలసీమ వ్యాప్తంగా జనావాసాల్లోకి చిరుతల చొరబాట్లు పెరగడం కనిపిస్తోంది. పులులకు తీవ్రమైన నీటి కొరత, ఆవాసాలు తగ్గిపోవడం, పెరుగుతున్న పర్యావరణ ఒత్తిడే ఈ ధోరణికి కారణమని అటవీ అధికారులు పేర్కొంటున్నారు. తక్షణమే సరిదిద్దే చర్యలు తీసుకోకపోతే.. ఈ ప్రాంతంలో మానవ-వన్యప్రాణుల సంఘర్షణ తీవ్రంగా పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

వైఎస్ఆర్ కడప జిల్లా దువ్వూరు మండలం చిన్న బకరపురం గ్రామంలో ఇటీవల జరిగిన ఓ ఘటన జరిగింది. గ్రామంలోకి ప్రవేశించిన చిరుత పిల్లను వీధి కుక్కలు చంపడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అటవీ అధికారుల సమాచారం ప్రకారం, రాయలసీమలో గత మూడేళ్లలో మానవ నివాస ప్రాంతాల్లోకి ప్రవేశించిన 30కి పైగా చిరుతలు మరణించాయి. ఆందోళనకరంగా, గత సంవత్సరంలోనే 16 మరణాలు నమోదయ్యాయి.

చిరుతపులులు మేకలు, గొర్రెలు, దూడలు, ఆవులు వంటి జంతువులను ఇష్టపడతాయి. ఆహారం కోసం అవి మానవ నివాస ప్రాంతాల్లోకి ప్రవేశిస్తాయి. కొన్నిసార్లు, అటవీ ప్రాంతాల్లో సమీపంలో నీటి వనరులు లేకపోవడం కూడా ఒక కారణంగా ఉంది. చిరుతపులులు దట్టమైన అడవుల్లో లోపల ఉండటానికి బదులుగా, కొద్దిగా బహిరంగ లేదా మైదాన ప్రాంతాల్లోకి వెళ్లడానికి ఇష్టపడతాయని అటవీ అధికారులు అంటున్నారు.

మానవ ఆవాసాల్లోకి చిరుతలు రావడానికి కారణాలు

చిరుతపులులు మనుషులపై దాడి చేయడానికి బయటకు రావడం లేదు. కానీ ఆకస్మాత్తుగా మనిషి ఎదురైతే దాని రక్షణలో భాగంగా దాడి చేయాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. వాటి సంచారం ప్రధానంగా ఆహారం, నీటి అన్వేషణ కోసమే ఉంటుంది. అడవుల అంచున ఉన్న గ్రామాల్లోకి చిరుతలు ఎక్కువగా వస్తుంటాయి.

వేటగాళ్లు ఏర్పాటు చేసిన ఉచ్చులు, అడవి పందులను నివారించడానికి రైతులు ఏర్పాటు చేసిన విద్యుత్ కంచెలు పులులకు ఇబ్బందికరంగా మారాయి. విద్యుత్ కంచెల కారణంగా ప్రమాదవశాత్తు మరణాలు పెరుగుతున్నాయి. రైతులలో తక్షణమే అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది.

అటవీ భూముల ఆక్రమణలతో పులుల సహజ ఆవాసాలను తగ్గిపోయేలా చేస్తూ, వన్యప్రాణులను మానవ నివాసాలకు మరింత దగ్గరగా నెడుతున్నాయి. దట్టమైన అడవుల్లో ఉండాల్సిన వన్యప్రాణులు ఇప్పుడు జనావాస ప్రాంతాల వైపు వస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో చిరుతపులుల సంచారం ఎక్కువగా ఉందని, ఇది తమ జీవనోపాధికి ముప్పుగా మారిందని రైతులు వాపోతున్నారు.

నివారణ చర్యలు: అటవీశాఖ సూచనలు

కొన్నిసార్లు పొలాల దగ్గర చిరుతపులులు సంచారం ఉన్నట్టుగా రైతులు చూస్తున్నారు. దానికి సంబంధించిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. పశువులను, మేకలను మేతకు బయటకు తీసుకెళ్లాలంటే భయపడుతున్నాయి.

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు.

హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు. Read More

చిరుతల సంచారంపై అటవీ శాఖ అధికారులు దృష్టి సారించి, రైతులు మరియు ప్రజలకు అవగాహన కల్పించాలి. తక్షణ చర్యలు తీసుకోకపోతే పరిస్థితి మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.