|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Malavika Mohanan: రాజాసాబ్‌ హీరోయిన్‌ తెలుగులో కమిట్‌ అయిన ఫస్ట్ మూవీ ఏంటో తెలుసా? బ్యాడ్‌ లక్‌

Published: 17-09-2025, 7:41 AM
Malavika Mohanan: రాజాసాబ్‌ హీరోయిన్‌ తెలుగులో కమిట్‌ అయిన ఫస్ట్ మూవీ ఏంటో తెలుసా? బ్యాడ్‌ లక్‌

మలయాళ సినిమా నటి మాళవిక మోహనన్ త్వరలోనే ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘రాజాసాబ్’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను అలరించనుంది. కానీ ఆమె తెలుగులో కమిట్ అయిన మొదటి సినిమా ‘రాజాసాబ్’ కాదు అనేది ఆసక్తికర విషయం.

Key Points

1

మాళవిక మోహనన్ తెలుగులో తొలి చిత్రం 'రాజాసాబ్'

2

'హీరో' చిత్రం షూటింగ్‌ ఆగిపోవడం వల్ల ఆమెకు 'బ్యాడ్ లక్'

4

ప్రభాస్ హీరోగా నటిస్తున్న 'రాజాసాబ్' తో టాలీవుడ్ ఎంట్రీ

మాళవిక మోహనన్ తెలుగు ప్రయాణం

మలయాళ హీరోయిన్‌ మాళవిక మోహనన్‌ `ది రాజాసాబ్‌` చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. ప్రభాస్‌ హీరోగా నటిస్తోన్న ఈ మూవీకి మారుతి దర్శకుడు. సినిమాని ఆయన రొమాంటిక్‌ కామెడీ హర్రర్‌ ఫాంటసీగా రూపొందిస్తున్నారు. ఇండియాలోనే బిగ్గెస్ట్ హర్రర్‌ ఫాంటసీగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు మారుతి. ఇందులో మాళవిక మోహనన్‌తోపాటు నిధి అగర్వాల్‌, అలాగే రిద్ది కుమార్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సంజయ్‌ దత్‌ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ప్రతిష్టాత్మంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

ఇటీవల విడుదలైన ఈ మూవీ టీజర్‌ ఆకట్టుకుంది. ఇందులో ప్రభాస్‌తోపాటు మాళవిక సీన్‌ కూడా ఉంది. బెడ్‌ సీన్‌ కామెడీ ఆకట్టుకుంది. చాలా రొమాంటిక్‌గా ఉంది. ఈ మూవీతోనే మాళవిక టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తుంది. తెలుగు ఆడియెన్స్ ని అలరించేందుకు వస్తోంది. అయితే మాళవిక తెలుగులో కమిట్‌ అయిన ఫస్ట్ మూవీ `ది రాజాసాబ్‌` కాదు. ఆమె ఆరేళ్ల క్రితమే మరో సినిమాకి కమిట్‌ అయ్యింది. ఆ చిత్రం ఓపెనింగ్‌ జరుపుకుని కొన్ని రోజులు షూటింగ్‌ కూడా జరిగింది. కానీ అనూహ్యం ఆగిపోయింది. ఆ వివరాలు చూస్తే.

‘హీరో’ చిత్రం విషయంలో అనూహ్య పరిణామం

మాళవిక మోహనన్‌ తెలుగులో కమిట్‌ అయిన మొదటి చిత్రం `హీరో`. విజయ్‌ దేవరకొండ హీరోగా ఈ చిత్రం తెరకెక్కింది. విజయ్‌, మాళవికలపై ఓపెనింగ్ చేశారు. దీనికి స్టార్‌ డైరెక్టర్‌ కొరటాల శివ క్లాప్‌ కొట్టారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు. ఆనంద్‌ అన్నమలై దర్శకుడు. స్పోర్ట్స్ డ్రామా కథాంశంతో సాగే ఈ మూవీలో రేసర్‌గా విజయ్‌ దేవరకొండ నటించాల్సి ఉంది. అయితే ఈ మూవీ షూటింగ్‌ ప్రారంభమైన కొన్ని రోజులకే ఆగిపోయింది. క్రియేటివ్‌ డిఫరెంట్స్ కారణంగా సినిమా ఆగిపోయినట్టు సమాచారం. అలా మాళవిక ఆరేళ్ల క్రితమే తెలుగులో `హీరో` మూవీతో హీరోయిన్‌గా పరిచయం కావాల్సింది. అది ఆగిపోవడంతో ఇప్పుడు `రాజాసాబ్‌`తో ఎంట్రీ ఇస్తుంది. ఇది ఆమెకి గ్రాండ్‌ ఎంట్రీ అని చెప్పాలి.

కేరళాకి చెందిన మాళవిక మోహనన్‌.. ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ కే యూ మోహనన్‌ కూతురు. 2013లోనే మలయాళంలో `పట్టం పోలే` చిత్రంతోనే హీరోయిన్‌గా వెండితెరకు పరిచయం అయ్యింది. కన్నడలోకి `నాను మట్టు వరలక్ష్మి` చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. ఇక తమిళంలో రజనీకాంత్‌ `పేటా` చిత్రంలో నటించింది. `మాస్టర్‌`, `మారన్‌`, `తంగళాన్‌` చిత్రాలతో తమిళ ఆడియెన్స్ ని ఆకట్టుకుంది. ఇప్పుడు ప్రభాస్‌ `రాజాసాబ్‌`తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తుంది. ఈ మూవీ జనవరి 9న విడుదల కాబోతుంది. దీంతోపాటు తమిళంలో `సర్దార్‌ 2`లో నటిస్తుంది మాళవిక. కోలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా రాణిస్తోంది మాళవిక.

‘రాజాసాబ్’ తో గ్రాండ్ ఎంట్రీ

ఇక విజయ్‌ దేవరకొండ ఇటీవల `కింగ్డమ్‌` మూవీతో ఆకట్టుకున్నారు. ఇది యావరేజ్‌గా నిలిచింది. నిర్మాతలకు నష్టాలను తెచ్చింది. ఇప్పుడు రాహుల్‌ సాంక్రిత్యాన్‌ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నారు. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో ఒక హిస్టారికల్‌ స్టోరీతో రూపొందబోతుందని తెలుస్తోంది. ఇందులో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తుందని సమాచారం. దీంతోపాటు రవికిరణ్‌ కొల్లా దర్శకత్వంలో `రౌడీ జనార్థన్‌` అనే సినిమా చేయాల్సి ఉంది. దీనికి దిల్‌ రాజు నిర్మాత.

చివరకు ‘రాజాసాబ్’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అవుతున్న మాళవిక, ఈ సినిమాతో మంచి విజయం సాధిస్తుందని ఆశిద్దాం. ఆమె భవిష్యత్తు సినిమాలకు మంచి అవకాశాలు లభించాలని కోరుకుందాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.