
📌 Key Points
- గవర్నర్ సి.వి. ఆనంద బోస్ రాజీనామాతో పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో సంచలనం.
- రాష్ట్రపతి ఆమోదం తెలిపిన వెంటనే మమతా బెనర్జీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
- కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఒత్తిడి వల్లే రాజీనామా అని మమతా బెనర్జీ ఆరోపణ.
- ఎన్నికల వేళ గవర్నర్ రాజీనామాపై రాజకీయ విశ్లేషకుల చర్చలు.
పశ్చిమ బెంగాల్ గవర్నర్ సి.వి. ఆనంద బోస్ హఠాత్తుగా రాజీనామా చేయడం సంచలనంగా మారింది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ నిర్ణయంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ రాజీనామా ఎన్నికల సమయంలో చోటు చేసుకోవడం రాజకీయంగా చర్చనీయాంశమైంది.
గవర్నర్ ఆనంద బోస్ ఆకస్మిక రాజీనామా
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ గవర్నర్ సి.వి. ఆనంద బోస్ (C.V. Ananda Bose) ఎవరూ ఊహించని విధంగా రాజీనామా చేశారు. ఆయన రాజీనామాకు రాష్ట్రపతి ఆమోదం (President’s approval) తెలిపారు. కాగా ఆయన నిర్ణయంపై బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) తీవ్రంగా స్పందించారు. ఆయన తీసుకున్న ఈ ఆకస్మిక నిర్ణయం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ఆనంద బోస్ తన పదవికి ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చిందో ఇప్పటికీ తనకు అర్థం కావడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
అయితే.. ఈ ఆకస్మిక రాజీనామా వెనుక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయంటూ మమతా బెనర్జీ (Mamata Banerjee) సంచలన ఆరోపణలు చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Union Home Minister Amit Shah) ఒత్తిడి కారణంగానే గవర్నర్ తన పదవిని వీడాల్సి వచ్చిందని ఆమె విమర్శించారు. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న వారిపై కేంద్రం ఇలాంటి ఒత్తిళ్లు తీసుకురావడం సరికాదని ఆమె ఈ సందర్భంగా పరోక్షంగా అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉంటే సరిగ్గా అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయన రాజీనామా చేడయంపై అనేక అంశాలపై రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.
మమతా బెనర్జీ దిగ్భ్రాంతి, కేంద్రంపై ఆరోపణలు
రాజీనామా వెనుక రాజకీయ ఒత్తిళ్లు?
గవర్నర్ రాజీనామా పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కీలక పరిణామంగా మారింది. దీని ప్రభావం రాబోయే ఎన్నికలపై ఏ విధంగా ఉంటుందో వేచి చూడాలి. మమతా బెనర్జీ ఆరోపణలు మరింత రాజకీయ దుమారం రేపే అవకాశం ఉంది.


