
📌 Key Points
- మనోజ్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్న వైనం, దాసరి సమాధి శుభ్రం.
- సోషల్ మీడియాలో వైరల్ అయిన దాసరి సమాధి నిర్లక్ష్యం.
- ఉదయం 7 గంటలకే అక్కడికి చేరుకున్న మంచు మనోజ్.
- ‘ఐక్య ధైర్య సేన’ ద్వారా తక్షణ సేవ, ప్రశంసలు.
టాలీవుడ్లో ఇప్పుడు ఎక్కడ చూసినా మంచు మనోజ్ గురించే చర్చ! దిగ్గజ దర్శకుడు దాసరి నారాయణరావు సమాధి పట్ల ఆయన చూపిన గౌరవం, చేసిన సేవ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. మాట నిలబెట్టుకున్న మనోజ్పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ వైరల్ వార్త పూర్తి వివరాలు ఇక్కడ!
మాట నిలబెట్టుకున్న మనోజ్
Manchu Manoj; దిగ్గజ దర్శకుడు దాసరి నారాయణరావు సమాధి నిర్లక్ష్యానికి గురై, చెత్తాచెదారంతో ఉన్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారిన విషయం తెలిసిందే. పరిశ్రమకు పెద్దదిక్కుగా ఉన్న మహానుభావుడి సమాధి దయనీయ స్థితిని చూసి హీరో మంచు మనోజ్ తీవ్రంగా కలత చెందారు. దీనిపై వెంటనే స్పందించిన ఆయన, తానే స్వయంగా ఆ ప్రాంతాన్ని శుభ్రం చేయిస్తానని సోషల్ మీడియా వేదికగా హామీ ఇచ్చారు.
మాట ఇచ్చినట్టుగానే మనోజ్(Manchu Manoj) శనివారం ఉదయం 7 గంటలకే తన బృందంతో కలిసి అక్కడికి చేరుకున్నారు. షూటింగ్కు వెళ్లే ముందు సమయం కేటాయించి, సమాధి పరిసరాల్లోని ఎండుటాకులను స్వయంగా తొలగించారు. మనోజ్, మౌనిక భూమా దంపతులు స్థాపించిన “ఐక్య ధైర్య సేన” సమితి ద్వారా ఈ తక్షణ సేవా కార్యక్రమాన్ని చేపట్టారు. సమయస్ఫూర్తితో స్పందించి దాసరి గారిపై గౌరవాన్ని చాటుకున్న మనోజ్ను నెటిజన్లు ఎంతగానో ప్రశంసిస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబందించిన ఫోటోలు. వీడియోలో నెట్టింట వైరల్ అవుతున్నాయి.
దాసరి సమాధి వద్ద షాకింగ్ దృశ్యం
నెట్టింట వైరల్ అవుతున్న ఫోటోలు
మనోజ్ చేసిన ఈ పని ఎంతో మందికి ఆదర్శప్రాయం. దిగ్గజాలకు మన సినీ ప్రముఖులు ఇచ్చే గౌరవానికి ఇది నిదర్శనం. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన సినీ వార్తల కోసం మా వెబ్సైట్ను అనుసరిస్తూ ఉండండి!


