
📌 Key Points
- ఒడిశాలో డీజీపీ సమక్షంలో 11 మంది మావోయిస్టుల లొంగుబాటు.
- లొంగిపోయిన వారిలో డివిజనల్ కమిటీ సభ్యుడు నకుల్, ఐదుగురు ఏరియా కమిటీ సభ్యులు ఉన్నారు.
- మావోయిస్టుల నుంచి AK-47, ఇన్సాస్ రైఫిల్స్తో సహా భారీగా ఆయుధాలు స్వాధీనం.
- నకుల్పై రూ. 22 లక్షల రివార్డు, బసధార–ఘుమ్షార్ డివిజన్లో పనిచేస్తున్నట్లు సమాచారం.
ఒడిశాలో మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. కలహాండి జిల్లాలో డీజీపీ వై.బి. ఖురానియా సమక్షంలో 11 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో డివిజనల్ కమిటీ సభ్యుడు నకుల్ కూడా ఉన్నారు. వీరి వద్ద నుంచి భారీగా ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
డీజీపీ సమక్షంలో లొంగిపోయిన మావోయిస్టులు
మావోయిస్టుల లొంగుబాటు పరంపర కొనసాగుతూనే ఉన్నది. ఇవాళ ఒడిశాలోని కలహాండి జిల్లాలో ఆ రాష్ట్ర డీజీపీ వై.బి. ఖురానియా సమక్షంలో డివిజనల్ కమిటీ సబ్యుడు నకుల్ సహా మొత్తం11 మంది మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో ఐదుగురు ఏరియా కమిటీ సభ్యులు (ACM), మరో ఐదుగురు పార్టీ క్యాడర్లు ఉన్నారు. వీరంతా ఒక AK-47 రైఫిల్, ఒక ఇన్సాస్ (INSAS), నాలుగు ఎస్ఎల్ఆర్ (SLR) రైఫిళ్లు, నాలుగు సింగిల్ షాట్ తుపాకులు, భారీగా మందుగుండు సామాగ్రిని పోలీసులకు అప్పగించారు. మహారాష్ట్రకు చెందిన నకుల్ ఒడిశా రాష్ట్ర కమిటీలో DCMగా పనిచేస్తున్నారు. ప్రభుత్వం ఇతనిపై రూ. 22 లక్షల రివార్డు ఉంది. ఈ మావోయిస్టు బృందం బసధారా–ఘుమ్షార్–నాగాబలి డివిజన్ పరిధిలో పనిచేస్తూ కలహాండి, రాయగడ, కంధమాల్ జిల్లాల్లో చురుకుగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. నకుల్ మహారాష్ట్రకు చెందినవాడు కాగా, మిగతా సభ్యులు ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందినవారని పోలీసులు వెల్లడించారు.
స్వాధీనం చేసుకున్న ఆయుధాలు, మందుగుండు సామాగ్రి
ఎవరీ నకుల్? అతని నేపధ్యం ఏమిటి?
మావోయిస్టుల లొంగుబాటు అనేది ప్రభుత్వ ప్రయత్నాలకు లభించిన విజయంగా చూడవచ్చు. అయితే, ఈ ప్రాంతంలో శాంతి స్థాపన కోసం మరిన్ని చర్యలు తీసుకోవలసిన అవసరం ఉంది. అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడం చాలా ముఖ్యం.


