
📌 Key Points
- నటి మీనాక్షి చౌదరి వారాహి సిల్వర్ జ్యువెలరీ ఫ్లాగ్షిప్ స్టోర్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.
- బంగారం, వెండిని ఆడపిల్లల నుంచి వేరుగా చూడలేమని మీనాక్షి చౌదరి అభిప్రాయపడ్డారు.
- హీరో తేజ సజ్జా సిల్వర్ జ్యువెలరీ ట్రెండ్ను, దాని నమ్మకాన్ని గురించి మాట్లాడారు.
- వారాహి సిల్వర్ జ్యువెలరీ కెపిహెచ్బిలో కొత్త స్టోర్ను ప్రారంభించింది.
నటి మీనాక్షి చౌదరి వారాహి సిల్వర్ జ్యువెలరీ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బంగారం, వెండికి ఆడపిల్లలకు ఉన్న అనుబంధం గురించి మాట్లాడారు. తేజ సజ్జా కూడా సిల్వర్ జ్యువెలరీ ట్రెండ్ గురించి తన అభిప్రాయాలను పంచుకున్నారు.
వారాహి సిల్వర్ జ్యువెలరీ ప్రారంభోత్సవం
Meenakshi Chaudhary: బంగారం, వెండిని ఆడపిల్లల నుంచి వేర్వేరుగా చూడలేమని, బంగారం అంటే అమ్మాయి, అమ్మాయి అంటే బంగారంలాగా అనుబంధం ఉంటుందని అన్నారు నటి మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary). మార్చి 28న వారాహి సిల్వర్ జ్యువెలరీ ఫ్లాన్షిప్ స్టోర్ లాంచ్ సందర్భంగా హైదరాబాద్ ఐటీసీ కోహినూర్లో ఘనంగా ప్రీ-లాంచ్ ప్రెస్ మీట్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా హీరోయిన్ మీనాక్షి చౌదరి, హీరో తేజ సజ్జా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వారాహి సిల్వర్ జువెల్లరీ (Vaarahi Silver Jewellery) అధినేత మణిదీప్, స్పందనలతో కలిసి మీనాక్షి, తేజ సజ్జా (Teja Sajja) జ్యోతి ప్రజ్వలన చేసి, సిల్వర్ జ్యువెలరీని అధికారికంగా ఆవిష్కరించారు. వారాహి సిల్వర్ జ్యువెలరీ ఫ్లాన్షిప్ స్టోర్ను మార్చి 28న.. వారాహి సిల్క్స్, 1వ అంతస్తు, మెట్రో పిల్లర్ ఏ756 ఎదురు, కెపిహెచ్బిలో గ్రాండ్గా ఓపెన్ చేయబోతున్నట్లుగా ఈ కార్యక్రమంలో తెలిపారు.
బంగారం, అమ్మాయిల అనుబంధం: మీనాక్షి చౌదరి
ఈ సందర్భంగా వారాహి సిల్వర్ జ్యువెలరీ అధినేత మణిదీప్ మాట్లాడుతూ… ఈనెల 28వ తేదీన కేపీహెచ్బీలో తమ వారాహి సిల్క్ బ్రాంచ్ మొదటి అంతస్తులో వారాహి సిల్వర్ జ్యువెలరీని ఘనంగా ప్రారంభిస్తున్న సందర్భంగా ఈ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. ఇది విజయవంతమైనందుకు చాలా హ్యాపీగా ఉందని అన్నారు. హీరో తేజ సజ్జా మాట్లాడుతూ.. ‘‘ప్రస్తుతం బంగారం రేటు భారీగా ఉంది. సిల్వర్ జ్యువెలరీ కూడా మార్కెట్లో మంచి ట్రెండ్ అవుతోంది. అమ్మాయిలకు, అబ్బాయిలకు.. ఇద్దరికీ సిల్వర్ జ్యువెలరీ అనేది మంచిగా సెట్ అవుతుంది. బంగారం అంటే ఎంతో నమ్మకం కలిగి ఉండాలి. మా అమ్మ కూడా చిన్నప్పటి నుంచి ఒకరి దగ్గరే ఎన్నో సంవత్సరాలుగా బంగారం కొంటూ వచ్చారని, అలాంటి నమ్మకం సిల్వర్ జ్యువెలరీ కూడా ఇస్తుంది’’ అని చెప్పుకొచ్చారు.
వెండి ఆభరణాల ట్రెండ్పై తేజ సజ్జా
మీనాక్షి చౌదరి మాట్లాడుతూ.. బంగారం, వెండి వంటి వాటిని ఆడపిల్లల నుంచి వేర్వేరుగా చూడలేము. బంగారం అంటే అమ్మాయి, అమ్మాయి అంటే బంగారంలాగా అనుబంధం ఉంటుంది. వారాహి సిల్మ్స్ వారు ఇంతకు ముందు ఆల్రెడీ నమ్మకాన్ని పొందారు. ఇప్పుడు వారాహి సిల్వర్ జ్యువెలరీలో అడుగు పెడుతూ.. వాళ్ల నమ్మకాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు జ్యువెలరీ మార్కెట్లోకి అడుగు పెడుతుండటం అభినందనీయం. కస్టమర్ల కోసం అద్భుతమైన ఆఫర్లు ఇందులో ఉన్నాయి. వాటిని గమనిస్తే.. ఇక్కడ రూ.1,50,000 కొనుగోలుపై రూ.50,000 వోచర్, గోల్డ్ అండ్ సిల్వర్ కాయిన్.. రూ.1,00,000 కొనుగోలు పై రూ.30,000 గిఫ్ట్ వోచర్, సిల్వర్ కాయిన్.. రూ.50,000 కొనుగోలుపై రూ. 15,000 గిఫ్ట్ వోచర్, సిల్వర్ కాయిన్ ఉచితంగా ఇస్తున్నారు. ఈ ఆఫర్ ఏప్రిల్ 12 వరకు వర్తిస్తుందని చెబుతున్నారు. మెగా లక్కీ డ్రా కూడా ఉంటుంది. ఇందులో కారు మరియు ఫ్రిజ్ గెలుచుకునే అవకాశం ఉంది. ఈ లక్కీ డ్రా ఏప్రిల్ 30న నిర్వహించబడుతుంది. కాబట్టి త్వరపడండి.. అని పేర్కొన్నారు.
మొత్తానికి మీనాక్షి చౌదరి చేసిన వ్యాఖ్యలు, తేజ సజ్జా వెండి ఆభరణాల గురించి మాట్లాడిన మాటలు ఈ కార్యక్రమానికి మరింత శోభను తెచ్చాయి. వారాహి సిల్వర్ జ్యువెలరీ కొత్త స్టోర్ ప్రారంభం విజయవంతంగా జరిగింది.


