
అక్కినేని నాగ చైతన్య తన వైవాహిక జీవితంపై ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. భార్య శోభిత ధూళిపాళతో ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయమై, అది ఎలా ప్రేమగా మారిందో ఓ ఇంటర్వ్యూలో వివరించారు. వారి లవ్స్టోరీకి సంబంధించిన పలు వివరాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
Key Points
నాగ చైతన్య తన ప్రేమ కథను ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు.
శోభిత ధూళిపాళతో ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయమై ప్రేమగా మారిందని వివరించారు.
తన జీవిత భాగస్వామిని సోషల్ మీడియాలో కలుస్తానని అస్సలు ఊహించలేదని తెలిపారు.
భార్య శోభిత అంటేనే తన ప్రపంచమని, ఆమె లేకుండా జీవించలేనని చైతన్య అన్నారు.
ఇన్స్టాలో పరిచయం.. ప్రేమగా ఎలా మారింది?
అక్కినేని నాగచైతన్య(Naga Chaitanya) ప్రస్తుతం వైవాహిక జీవితాన్ని ఆస్వాదిస్తున్నాడు. ఎక్కువ సమయంలో సతీమణి శోభిత ధూళిపాళ(Sobhita Dhulipala)కే కేటాయిస్తున్నాడు. ఖాలీ సమయం దొరికితే భార్యతో కలిసి ఫారిన్ ట్రిప్కి వెళ్తున్నారు. అలాగే అవకాశం వచ్చినప్పుడల్లా తన ప్రేమ కథను చెబుతూ.. శోభితను పొగడ్తలతో ముంచేస్తున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో శోభితతో ఎలా ప్రేమలో పడ్డాడో వివరించాడు .
శోభితతో రెండో వివాహం వివరాలు
ఓ టీవీ చానల్ లో జగపతి బాబు నిర్వహిస్తున్న టాక్ షోకి వెళ్లిన నాగ చైతన్య .. తన ప్రేమ కథ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు . సోషల్ మీడియా వల్లే వీరిద్దరికి పరిచయం ఏర్పడి .. అది కాస్త ప్రేమ , పెళ్లి వరకు దారి తీసిందట . ‘ ఓ సారి నేను ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో నా క్లౌడ్ కిచెన్ ‘షోయు’ గురించి పోస్ట్ పెట్టాను . దానికి శోభిత ఎమోజీతో కామెంట్ చేసింది . వెంటనే నేను రిప్లై ఇచ్చాను . అలా చాటింగ్ ద్వారా మేమిద్దరం క్లోజ్ అయ్యాం . కొన్నాళ్ల తర్వాత అది కాస్త ప్రేమగా మారింది . నా జీవిత భాగస్వామిని ఇన్ స్టాగ్రామ్ ద్వారా కలుస్తానని అస్సలు ఊహించుకోలేదు ’ అని నాగ చైతన్య చెప్పుకొచ్చారు . అదే షోలో ‘ మీరు ఏది లేకుండా జీవించలేరు ’ అని జగపతి బాబు అడగ్గా .. చైతన్య వెంటనే ‘ నా భార్య శోభిత ’ అని సమాధానమిచ్చాడు . తన జీవితంలో శోభితకు అధిక ప్రాధాన్యత ఉందని చైతూ చెప్పారు .
శోభిత అంటేనే నా ప్రపంచం: చైతన్య
కాగా , నాగచైతన్య – శోభితల పెళ్లి గతేడాది డిసెంబర్ లో జరిగింది . అంతకు ముందు 2017 లో సమంతను ప్రేమ వివాహం చేసుకున్న చైతూ .. 2021 లో విడాకులు ఇచ్చాడు . కొన్నాళ్ల పాటు ఒంటరిగా ఉండి .. 2024 లో శోభితను రెండో వివాహం చేసుకున్నాడు . కొద్దిమంది అతిథుల మధ్య జరిగిన ఈ పెళ్లి వేడుక అట్టహాసంగా ముగిసింది . ప్రస్తుతం నాగచైతన్య ‘ విరూపాక్ష’ ఫేమ్ కార్తీక్ దండుతో ఓ మిథికల్ థ్రిల్లర్ చిత్రం చేస్తున్నాడు.
మొత్తానికి, ఊహించని విధంగా ఇన్స్టాగ్రామ్ ద్వారా కలిసిన నాగ చైతన్య, శోభితల ప్రేమ కథ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తుంది. ప్రస్తుతం వీరిద్దరూ వైవాహిక జీవితాన్ని ఆనందంగా గడుపుతున్నారు.


