
నాగార్జున, ధనుష్, రష్మిక మందన్న నటించిన ‘కుబేర’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. ఈ ఈవెంట్ లో నాగార్జున తన ప్రసంగంలో సినిమా గురించి, తన తండ్రి గురించి, మరియు ఫాదర్స్ డే గురించి మాట్లాడారు.
Key Points
కుబేర సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది.
నాగార్జున, ధనుష్, రష్మిక నటించిన కుబేర జూన్ 20న విడుదలవుతోంది.
నాగార్జున తన తండ్రి, ఎన్టీఆర్ గురించి మాట్లాడారు.
తాగి డ్రైవ్ చేయకండి అని నాగార్జున హెచ్చరించారు.
కుబేర సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్
Nagarjuna : నాగార్జున – ధనుష్ మల్టీస్టారర్ గా రష్మిక మందన్న ముఖ్య పాత్రలో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కుబేర. ఈ సినిమా జూన్ 20 రిలీజ్ కాబోతుంది. నేడు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ కి రాజమౌళి గెస్ట్ గా హాజరయ్యారు.
నాగార్జున ప్రసంగం ముఖ్యాంశాలు
ఈ ఈవెంట్లో నాగార్జున మాట్లాడుతూ.. ధనుష్ మరింత సక్సెస్ అవ్వాలి. సెట్లో అతనెంత కష్టపడతాడో చూసాను. ఇది నా సినిమా, ధనుష్, రష్మిక సినిమా కాదు. ఇది కేవలం శేఖర్ కమ్ముల సినిమా మాత్రమే. శేఖర్ తన కంఫర్ట్ జోన్ నుంచి బయటకి వచ్చి తీసిన సినిమా. మేము కూడా మా కంఫర్ట్ నుంచి బయటకు వచ్చి చేసాం. చాలా రోజుల తర్వాత ఒక టీమ్ చాలా బాగా పనిచేసిన సినిమా. శేఖర్ కమ్ముల టీమ్ ఇది. నేను ఇంకా సినిమా చూడలేదు. ఎన్నేళ్లయినా ఫ్యాన్స్ ప్రేమ, అభిమానం చెక్కు చెదరకుండా ఇలాగే ఉంది. నేను ఎలాంటి పాత్రలు చేసినా మీరు చూస్తున్నారు. మీరు ఉన్నంతవరకు ANR బతికే ఉంటారు. ఇవాళ ఫాదర్స్ డే అందరూ మీ ఫాదర్స్ కోసం దండం పెట్టుకోండి. ఎవరూ తాగి డ్రైవ్ చేయొద్దు. హైదరాబాద్ లో తాగి డ్రైవ్ చేస్తే పోలీసులు పట్టుకుంటారు అని అన్నారు.
ఫాదర్స్ డే శుభాకాంక్షలు
కుబేర సినిమా విడుదలకు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నాగార్జున మాటలతో ఈవెంట్ మరింత ప్రత్యేకంగా మారింది. అందరూ తమ తండ్రులకు శుభాకాంక్షలు తెలియజేయాలని కోరారు.


