
‘కూలీ’ సినిమాలో నాగార్జున విలన్ పాత్రలో నటించారు. తాను పోషించిన పాత్ర చాలా దారుణమైనదని, తన మనవళ్లకు ఈ విషయం చెప్పనని ఆయన తెలిపారు. ఈ సినిమాలో రజినీకాంత్ తో కలిసి పనిచేసిన అనుభవం గురించి కూడా నాగార్జున మాట్లాడారు.
Key Points
నాగార్జున 'కూలీ' సినిమాలో విలన్ పాత్ర పోషించారు.
ఈ పాత్ర చాలా దారుణమైనదని, మనవళ్లకు చెప్పనని నాగార్జున తెలిపారు.
రజినీకాంత్ తో పనిచేసిన అనుభవం అద్భుతంగా ఉందని నాగార్జున పేర్కొన్నారు.
'కూలీ' సినిమా ఆగస్టు 14న విడుదల కానుంది.
నాగార్జున ‘కూలీ’లో విలన్గా
లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ ‘కూలీ’లో టాలీవుడ్ కింగ్ నాగార్జున.. సైమన్ అనే విలన్ పాత్రలో నటించాడు. ఇటీవల, సినిమా హిందీ ఆల్బమ్ విడుదల సందర్భంగా ముంబైలో జరిగిన స్పాటిఫై ఈవెంట్లో నాగార్జున, అనిరుధ్ రవిచందర్, శ్రుతి హాసన్ కలిసి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నాగార్జున విలన్ పాత్ర గురించి, షూటింగ్ సమయంలో రజినీకాంత్ నుండి తనకు లభించిన మద్దతు గురించి మాట్లాడాడు.
కూలీ మూవీలో నాగార్జున విలన్ పాత్ర అనగానే చాలా మంది ఆశ్చర్యపోయారు. తాను విలన్ పాత్రను ఎందుకు ఎంచుకున్నానో ఈ ఈవెంట్లో నాగ్ వివరించాడు. “నేను ప్రతిసారీ మంచి పాత్రలే పోషిస్తున్నాను. అది కాస్త బోరింగ్గా అనిపించింది, కాబట్టి ఒక చెడ్డ పాత్ర చేద్దామని అనుకున్నాను. ఇది చాలా స్వేచ్ఛగా అనిపించింది. కానీ లోకేష్ను నేను చాలా కష్టపెట్టాను. నన్ను ఒప్పించడానికి ఏడు నుండి ఎనిమిది మీటింగ్లు తీసుకున్నాడు. ఈ పాత్ర గురించి నా మనవళ్లకు నేను కచ్చితంగా చెప్పాలనుకోవడం లేదు. ఇది చాలా అంటే చాలా చాలా చెడ్డ పాత్ర” అని నాగార్జున అనడం విశేషం.
రజినీకాంత్ తో అద్భుతమైన అనుభవం
ఇక రజినీకాంత్ తో కలిసి పనిచేసిన అనుభవాన్ని కూడా పంచుకున్నాడు. “అవును, రజినీ సర్తో కలిసి పనిచేయడం అద్భుతంగా ఉంది. నేను ఇంటికి తీసుకెళ్లగలిగేది అదే. ఆయన చరిష్మా, ఆరా, ఆయన సెట్లో సృష్టించిన వాతావరణం అసాధారణం. నా తమిళ డైలాగ్లను పలకడంలో ఆయన నాకు సాయం చేశారు. అది ఆయన మంచితనం. నేను చాలా ప్రతికూల పాత్ర పోషించినప్పటికీ, ఆ అనుభవం మాత్రం చాలా సానుకూలంగా ఉంది” అని చెప్పాడు.
ఇక తాను చాలా రోజులుగా లోకేష్, అనిరుధ్ తో కలిసి పని చేయాలని అనుకుంటున్నట్లు కూడా నాగ్ చెప్పాడు. ఈ సినిమాలో తన విలన్ పాత్రకు అతడు ఐ యామ్ ద డేంజర్ అనే బీజీఎం ఇచ్చాడని కూడా ఈ సందర్భంగా నాగ్ తెలిపాడు.
‘కూలీ’ విడుదల తేదీ
లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్, ఈ సంవత్సరం అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాలలో ఒకటి. సన్ పిక్చర్స్ (కళానిధి మారన్) నిర్మించిన ఈ చిత్రానికి లోకేష్, చంద్రు అన్బళగన్ కలిసి స్క్రీన్ప్లే రాశారు. ఇది రజినీకాంత్ 171వ మూవీ. ఈ సినిమాలో నాగార్జున, సౌబిన్ షాహిర్, ఉపేంద్ర, శ్రుతి హాసన్, సత్యరాజ్ కూడా నటించారు.
ఆమిర్ ఖాన్ ఒక అతిథి పాత్రలో కనిపిస్తారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూర్చాడు. ఇది రజినీకాంత్తో అతనికి ఐదో మూవీ కాగా.. లోకేష్తో నాలుగో సినిమా కావడం విశేషం. ‘కూలీ’ ఆగస్టు 14న విడుదల కానుంది. అదే రోజు అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో హృతిక్ రోషన్, జూనియర్ ఎన్.టి.ఆర్. నటించిన ‘వార్ 2’తో బాక్సాఫీస్ వద్ద పోటీ పడనుంది.
నాగార్జున ‘కూలీ’లోని తన విలన్ పాత్ర గురించి, రజినీకాంత్ తో కలిసి పనిచేసిన అనుభవం గురించి తెలిపిన విషయాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. సినిమా విడుదల కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు.


