
పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా సెన్సార్ ప్రక్రియను పూర్తి చేసుకుంది. ఆశ్చర్యకరంగా, ఈ సినిమాకు ‘A’ సర్టిఫికెట్ లభించింది. మితిమీరిన హింసాత్మక దృశ్యాలు, బూతు డైలాగులు దీనికి కారణమని తెలుస్తోంది.
Key Points
పవన్ కల్యాణ్ నటించిన ఓజీకి ‘A’ సర్టిఫికెట్!
మితిమీరిన హింసాత్మక దృశ్యాల కారణంగా ‘A’ సర్టిఫికెట్.
బూతు డైలాగులు కట్ చేయమని సెన్సార్ బోర్డ్ ఆదేశం.
‘A’ సర్టిఫికెట్ కారణాలు
పవన్ కల్యాణ్ నటించిన ఓజీ మూవీ సెన్సార్ పనులు పూర్తి చేసుకుంది. రిలీజ్ కు మూడు రోజుల ముందు ఈ సినిమాను సెన్సార్ బోర్డు ఎ సర్టిఫికెట్ ఇవ్వడం గమనార్హం. మితిమీరిన హింసే దీనికి కారణమని తెలిసింది. ఇక ఈ సినిమా రన్ టైమ్ 2 గంటల 35 నిమిషాలుగా ఉంది.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ లీడ్ రోల్లో నటించిన మూవీ ఓజీ. సోమవారమే (సెప్టెంబర్ 22) ఈ మూవీ ట్రైలర్ రిలీజైంది. అదే సమయంలో సెన్సార్ పనులు కూడా పూర్తయ్యాయి. ట్రైలర్ లోనే ఎంతో హింస ఉండటం మనం చూశాం. దీంతో ఊహించినట్లే మూవీకి సెన్సార్ బోర్డు ఎ సర్టిఫికెట్ ఇచ్చింది. ఇక సినిమాలో ఉన్న బూతు డైలాగులను కూడా కట్ చేయాలని ఆదేశించింది.
ఇక ఓజీ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.166 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసింది. ఆ లెక్కన సినిమా బ్లాక్బస్టర్ అయితే తప్ప లాభాలు రావు. సుజీత్ డైరెక్ట్ చేసిన ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి.
సినిమా రన్ టైమ్ వివరాలు
పవన్ కల్యాణ్ రెండు నెలల గ్యాప్ లో రెండో సినిమాతో వస్తున్నాడు. దే కాల్ హిమ్ ఓజీ అంటూ మరో పవర్ఫుల్ పాత్రతో అభిమానులను అలరించబోతున్నాడు. తాజాగా రిలీజైన ట్రైలర్ లో పవర్ స్టార్ మాస్ యాక్షన్ పూనకాలు తెప్పిస్తోంది. బాంబే వస్తున్నా.. తలలు జాగ్రత్త అనే రెండే డైలాగులు ఈ ట్రైలర్లో పవన్ నోట వినిపిస్తాయి.
ఇక చివర్లో ఓజస్ గంభీరా అంటూ తన పూర్తి పేరు చెబుతూ చేతిలో ఉన్న గన్ ను పేలుస్తూ చాలా ఆవేశంగా కనిపిస్తాడు. ఒకప్పటి బాంబే గ్యాంగ్ వార్స్ నేపథ్యంలో సాగే కథగా ఈ సినిమా కనిపిస్తోంది. విలన్ పాత్రలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మి కూడా ఈ సినిమాకు ప్లస్ కాబోతున్నాడు. ఇక ఫిమేల్ లీడ్ అయిన ప్రియాంక మోహన్ పాత్ర గురించి ట్రైలర్ లో పెద్దగా రివీల్ చేయలేదు.
సెన్సార్ బోర్డ్ నిర్ణయం
సుజీత్ డైరెక్షన్ లో ఈ ఓజీ మూవీ తెరకెక్కింది. డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మించాడు. ఈ మూవీలో పవన్ కల్యాణ్, ప్రియాంక మోహన్ తోపాటు ఇమ్రాన్ హష్మి, ప్రకాష్ రాజ్, శ్రియ రెడ్డి, ఉపేంద్ర, అర్జున్ దాస్ లాంటి వాళ్లు నటించారు. తమన్ బీజీఎం ట్రైలర్ ను మరో లెవెల్ కు తీసుకెళ్లింది. ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ఆదివారం (సెప్టెంబర్ 21) రాత్రి హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో జరిగిన విషయం తెలిసిందే.
ఈ సినిమా గురువారం (సెప్టెంబర్ 25) రిలీజ్ కానుండగా.. ఒక రోజు ముందే అంటే బుధవారం ప్రీమియర్ షోలకు రెండు తెలుగు రాష్ట్రాలు అనుమతి ఇచ్చాయి. ఇక ఈ మూవీ టికెట్ల ధరలు కూడా భారీగా పెరిగిన విషయం తెలిసిందే. దసరా హాలిడేస్ కావడంతో ఈ సినిమాకు భారీ ఓపెనింగ్స్ లభిస్తాయన్న నమ్మకంతో మేకర్స్ ఉన్నారు. ముఖ్యంగా హరి హర వీరమల్లు దారుణంగా బోల్తా పడిన నేపథ్యంలో ఈ ఓజీ మూవీపై పవన్ ఫ్యాన్స్ భారీ ఆశలే పెట్టుకున్నారు.
చివరగా, ఓజీ సినిమా ‘A’ సర్టిఫికెట్తో విడుదల కానున్నట్లు తెలుస్తోంది. మితిమీరిన హింసాత్మక దృశ్యాలు, బూతు డైలాగులు దీనికి కారణం. అభిమానులు ఎలా స్పందిస్తారో చూడాలి.


