
కోలీవుడ్ డైరెక్టర్ పా రంజిత్ దర్శకత్వం వహిస్తున్న ‘వెట్టువం’ సినిమా సెట్లో ఓ స్టంట్మ్యాన్ మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
Key Points
కోలీవుడ్ సినిమా 'వెట్టువం' సెట్లో స్టంట్మ్యాన్ మృతి.
పా రంజిత్, మరికొందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
స్టంట్మ్యాన్ రాజు కారుతో స్టంట్ చేస్తుండగా ప్రమాదవశాత్తు మరణించాడు.
సినిమా సెట్లో భద్రతపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.
స్టంట్మ్యాన్ మృతితో విషాదం
కోలీవుడ్ మూవీ ‘వెట్టువం’ సెట్లో స్టంట్మ్యాన్ మృతితో తీవ్ర విషాదం నెలకొంది . మోహన్ రాజ్ మృతి పలువురు సినీతారలు తీవ్ర విచారం వ్యక్తం చేశారు . విశాల్ , మంచు విష్ణు సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటించారు . కోలీవుడ్ డైరెక్టర్ పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ఆర్య హీరోగా నటిస్తున్నారు .
అయితే ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు . డైరెక్టర్ పా రంజిత్ తో పాటు మరికొందరిపై ఎఫ్ ఐఆర్ నమోదు చేశారు. దర్శకుడితో పాటు స్టంట్ నటుడు వినోద్ , నీలం ప్రొడక్షన్స్ కు చెందిన రాజ్ కమల్ , కారు యజమాని ప్రభాకరన్ పై కేసు నమోదైంది . ఈ సంఘటన సమయంలో సినిమా సెట్ లో భద్రతపై పోలీసులు ఆరా తీస్తున్నారు . కాగా .. స్టంట్మ్యాన్ రాజు సినిమా సెట్లో కారుతో స్టంట్ చేస్తుండగా ప్రమాదవశాత్తూ మృతిచెందారు . కాగా .. జూలై 13న ఈ ప్రమాదం జరిగింది.
పా రంజిత్పై కేసు నమోదు
సినిమా సెట్లో భద్రతపై దర్యాప్తు
ఈ ఘటనతో కోలీవుడ్ సినీ పరిశ్రమలో తీవ్ర దిగ్భ్రాంతి నెలకొంది. పోలీసుల దర్యాప్తు ఫలితాల కోసం వేచి చూడాలి.


