
📌 Key Points
- ఆఫ్ఘనిస్తాన్ ఆసుపత్రిపై పాకిస్తాన్ వైమానిక దాడిలో 400 మంది మృతి.
- మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తాలిబన్ సర్కార్ ప్రకటన.
- దాడిలో 250 మందికి పైగా గాయపడ్డారని సమాచారం.
- ఆఫ్ఘన్ పౌరులపై దాడులు చేయలేదని పాకిస్తాన్ ప్రకటన, ఆరోపణలను ఖండించింది.
ఆఫ్ఘనిస్తాన్లో దారుణం జరిగింది. పాకిస్తాన్ వైమానిక దాడిలో ఒక ఆసుపత్రి ధ్వంసం అయింది, ఈ దాడిలో 400 మందికి పైగా మరణించారు. తాలిబన్ ప్రభుత్వం ఈ విషయాన్ని ధృవీకరించింది. పాకిస్తాన్ మాత్రం ఈ ఆరోపణలను ఖండిస్తోంది.
ఆఫ్ఘనిస్తాన్పై పాకిస్తాన్ వైమానిక దాడి
ఆఫ్ఘనిస్తాన్ కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. తాజాగా ఆఫ్ఘనిస్తాన్ పై పాకిస్తాన్ తెగబడింది. ఆఫ్ఘనిస్తాన్ లోని ఓ ఆసుపత్రి పై పాకిస్తాన్ వైమానిక దాడికి పాల్పడింది. ఈ సంఘటనలో ఏకంగా 400 మంది మృతి చెందారు. ఈ విషయాన్ని స్వయంగా తాలిబన్ సర్కార్ అధికారికంగా ప్రకటించింది. అంతేకాదు మరో 250 మందికి పైగా గాయపడినట్లు తెలుస్తోంది.
400 మంది మృతి: తాలిబన్ ప్రకటన
కాబూల్ లో డ్రగ్స్ కు బానిస అయిన వారికి చికిత్స అందించే ఆసుపత్రి పై ఈ అటాక్ జరిగినట్లు స్థానిక ఆఫ్ఘనిస్తాన్ మీడియా స్పష్టం చేసింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఆఫ్ఘనిస్తాన్ పౌరులపై తాము ఎలాంటి దాడులకు పాల్పడలేదని పాకిస్తాన్ స్పష్టం చేస్తోంది. ఆసుపత్రులను తాము లక్ష్యంగా చేసుకోలేదంటూ ఆఫ్ఘనిస్తాన్ చేసిన ప్రకటనను ఖండించింది పాకిస్తాన్. ఇక ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
పాక్ ఖండన, కొనసాగుతున్న విచారణ
A post shared by Newswire (@newswirelk)
పాకిస్తాన్ ఆరోపణలను ఖండిస్తూ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ సంఘటన ప్రాంతీయంగా తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసే అవకాశం ఉంది. దీనిపై అంతర్జాతీయంగా నిఘా పెట్టారు.


