|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

పవన్ కళ్యాణ్ సంచలనం: నిర్మాతగా కొత్త ప్రయాణం! భోగి రోజు బిగ్ ట్విస్ట్!

Published: 14-01-2026, 6:30 AM
పవన్ కళ్యాణ్ సంచలనం: నిర్మాతగా కొత్త ప్రయాణం! భోగి రోజు బిగ్ ట్విస్ట్!
  • పవన్ కళ్యాణ్ తన నిర్మాణ సంస్థ ద్వారా టాలీవుడ్‌లో మళ్లీ యాక్టివ్ కానున్నారు.
  • భోగి పండుగ సందర్భంగా నిర్మాత విశ్వ ప్రసాద్‌తో పవన్ భేటీలో ప్రాజెక్టులపై చర్చ జరిగింది.
  • రామ్ తాళ్లూరి జనసేన పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనడం పవన్‌కు సపోర్ట్‌గా నిలుస్తుంది.
  • పవన్ కళ్యాణ్ నిర్మాతగా దృష్టి సారించి, రాజకీయ బాధ్యతలకు సమతుల్యం పాటించాలని భావిస్తున్నారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నిర్మాతగా మారబోతున్నారనే వార్త టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. భోగి పండుగ సందర్భంగా ప్రముఖ నిర్మాత విశ్వ ప్రసాద్‌ను కలవడంతో ఈ ఊహాగానాలకు బలం చేకూరింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

నిర్మాణ రంగంలోకి పవన్ కళ్యాణ్

Pawan Kalyan Big Update: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. రాజకీయాల వైపు వెళ్లిన కానీ సినిమాలకు ఏమాత్రం దూరం అవ్వకుండా.. వరుస పెట్టి షూటింగ్స్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసింది. అయితే ఈసారి నటుడిగా.. కాకుండా నిర్మాతగా కూడా బిజీ అవుతూ పవన్ కళ్యాణ్ మరోసారి టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారారు. చాలా కాలంగా సినిమాల నుంచి దూరంగా ఉన్న పవన్ కళ్యాణ్, తన నిర్మాణ సంస్థ Pawan Kalyan Creative Works ద్వారా మళ్లీ ఇండస్ట్రీలో యాక్టివ్ కావాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం.

భోగి పండుగ సందర్భంగా పవన్ కళ్యాణ్ ప్రముఖ నిర్మాత విశ్వ ప్రసాద్‌ను కలవడం ఈ వార్తలకు బలం చేకూర్చింది. ఈ భేటీలో రాబోయే ప్రాజెక్టులపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఇది కేవలం నటనకే పరిమితం కాకుండా నిర్మాణ రంగంలో కూడా కలిసి పని చేయాలనే ఆలోచనతోనే ఈ సమావేశం జరిగినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి.

ఇప్పటికే పవన్ కళ్యాణ్ నటుడిగా ఎస్.ఆర్.టి ఎంటర్టైన్మెంట్స్.స బ్యానర్‌తో ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఈ సంస్థ అధినేత రామ్ తాళ్లూరి, జనసేన పార్టీ కార్యక్రమాల్లో కూడా చురుకుగా పాల్గొంటున్నారు. రాజకీయాలతో బిజీగా ఉన్న పవన్‌కు ఇది మంచి సపోర్ట్‌గా మారే అవకాశం ఉంది.

విశ్వ ప్రసాద్‌తో పవన్ భేటీ

ఇదే సమయంలో కెవిఎన్ ప్రొడక్షన్స్.. కూడా పవన్ డేట్స్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నట్లు సమాచారం. అలాగే ప్రస్తుత పరిస్థితుల్ని బట్టి పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కూడా.. పవన్ కలిసి పని చేసే అవకాశాలు ఉన్నాయని టాక్ వినిపిస్తోంది.

పవన్ కళ్యాణ్ ప్రొడక్షన్ హౌస్ సోషల్ మీడియా పోస్ట్‌లో “భోగి అనే శుభ సందర్భంలో కొత్త ఆరంభాలకు నాంది పలుకుతూ, రాబోయే ప్రాజెక్టులపై గతంలో జరిగిన చర్చలను ముందుకు తీసుకెళ్తున్నాం” అని పేర్కొన్నారు. ఈ మాటలు చూస్తే పవన్ ఇకపై నిర్మాతగా ఎక్కువ ఫోకస్ చేయబోతున్నారన్న అర్థం వస్తోంది.

అంతర్గత వర్గాల సమాచారం ప్రకారం, పవన్ కళ్యాణ్ స్వయంగా కొన్ని కథలపై చర్చలు జరుపుతున్నారు. రాజకీయ, పరిపాలనా బాధ్యతలు పెరిగిన నేపథ్యంలో ఎక్కువ సినిమాలు చేయడం కష్టమని భావిస్తూ, తనకు దగ్గరైన నిర్మాతలతో కలిసి సినిమాలు నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారట. ఇలా చేస్తే సినిమాలపై తన ముద్ర ఉండడంతో పాటు..రాజకీయ బాధ్యతలకూ సమతుల్యం సాధించవచ్చని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది.

రాజకీయాలకు, సినిమాలకు సమతుల్యం

దీంతో పవన్ కళ్యాణ్ మరోసారి ప్రభంజనం సృష్టించడం ఖాయమే కానీ ఈసారి నటుడిగా కాకుండా నిర్మాతగా అనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇది టాలీవుడ్‌కు కొత్త దిశ చూపించే అడుగుగా మారుతుందేమో చూడాలి.

పవన్ కళ్యాణ్ నిర్మాతగా మారడం టాలీవుడ్‌లో సరికొత్త చర్చకు దారితీస్తోంది. నటుడిగానే కాకుండా నిర్మాతగా కూడా ఆయన తన ముద్ర వేస్తారా వేచి చూడాలి. రాజకీయాలతో పాటు సినిమా రంగంలోనూ రాణిస్తారని ఆశిద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.