|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

విరోష్ పెళ్లి వేడుకలు: దేశమంతా పండుగే! అన్నదానాలతో ఆశీస్సులు!!

Published: 28-02-2026, 10:05 PM
విరోష్ పెళ్లి వేడుకలు: దేశమంతా పండుగే! అన్నదానాలతో ఆశీస్సులు!!
  • విజయ్, రష్మికల వివాహం సందర్భంగా దేశవ్యాప్తంగా మిఠాయిల పంపిణీ.
  • 16 ప్రముఖ దేవాలయాల్లో భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమాలు.
  • హైదరాబాద్, విజయవాడ, వైజాగ్ వంటి నగరాల్లో స్వీట్ల పంపిణీ.
  • ప్రమాదం కారణంగా బీహార్‌లో సోమవారం మిఠాయిలు పంపిణీ చేయనున్నారు.

టాలీవుడ్ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న తమ వివాహాన్ని దేశవ్యాప్తంగా వేడుకగా జరుపుకుంటున్నారు. ఇందులో భాగంగా దేశంలోని ప్రధాన నగరాల్లో స్వీట్లు పంచుతున్నారు. అంతేకాకుండా 16 ప్రముఖ దేవాలయాల్లో అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

దేశవ్యాప్తంగా విరోష్ వెడ్డింగ్ వేడుకలు

Virosh Wedding: టాలీవుడ్ స్టార్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న తమ వివాహ బంధాన్ని అత్యంత వైభవంగా, అర్థవంతంగా జరుపుకుంటున్నారు. తమ జీవితంలోని ఈ మధురమైన ఘట్టాన్ని దేశప్రజలందరితో పంచుకోవాలనే ఉద్దేశంతో, మార్చి 1వ తేదీన దేశవ్యాప్తంగా మిఠాయిలతో నిండిన ట్రక్కులను పంపుతున్నట్లు ఈ జంట ప్రకటించింది. ‘భారతదేశం ఏదైనా వేడుకను మిఠాయిలు, ఆహారంతోనే కదా సెలబ్రేట్ చేసుకుంటుంది’ అంటూ విజయ్, రష్మికలు తమ సంతోషాన్ని అందరికీ పంచుతూ అందరి ఆశీస్సులు కోరుతున్నారు. ఈ వేడుకల్లో భాగంగా కేవలం మిఠాయిల పంపిణీ మాత్రమే కాకుండా, దేశవ్యాప్తంగా ఉన్న 16 ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రాలలో భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఆ వివరాలను తెలుపుతూ వారు చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఆ వివరాల్లోకి వెళితే..

తెలంగాణ, హైదరాబాద్‌లోని హరే కృష్ణ హెరిటేజ్ టెంపుల్, మహబూబ్‌నగర్‌లోని మాన్యంకొండ శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆలయం, చింతపల్లి సాయిబాబా ఆలయాల్లో అన్నదానం జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం, వైజాగ్ శ్రీ కనక మహాలక్ష్మి ఆలయం, ద్వారకా తిరుమల (చిన్న తిరుపతి) ఆలయాల్లో భక్తులకు ప్రసాద వితరణ చేయనున్నారు. కర్ణాటక బెంగళూరులోని శివోహం టెంపుల్, ఉత్తరప్రదేశ్ బృందావనంలోని శ్రీ శ్రీకృష్ణ బలరామ్ మందిర్, అస్సాం గౌహతిలోని శ్రీ రుక్మిణి టెంపుల్.. ఇలా మొత్తంగా 16 రాష్ట్రాలలోని ప్రముఖ ఆలయాల్లో ఈ సేవా కార్యక్రమాలు కొనసాగనున్నాయని తెలిపారు.

16 ఆలయాల్లో అన్నదాన కార్యక్రమాలు

ఇక మిఠాయిల పంపిణీ విషయానికి వస్తే, ఉత్తరాది నుంచి దక్షిణాది వరకు అన్ని ప్రధాన నగరాలను కవర్ చేస్తున్నారు. తెలంగాణలో హైదరాబాద్, మహబూబ్‌నగర్, కరీంనగర్.. ఏపీలో వైజాగ్, విజయవాడ, పుట్టపర్తిలతో పాటు ఢిల్లీ, ముంబై, అహ్మదాబాద్, చెన్నై, కొచ్చి, జైపూర్ వంటి నగరాల్లో స్వీట్లు పంచుతున్నారు. అయితే బీహార్‌లో మాత్రం ఒక రైలు ప్రమాదం కారణంగా ఏర్పడిన ఆలస్యం వల్ల, అక్కడ సోమవారం నాడు పంపిణీ చేయనున్నట్లు స్పష్టం చేశారు. తమ పెళ్లి సందర్భంగా ఇలా సమాజానికి మేలు చేసే కార్యక్రమాలు చేపట్టిన ఈ జంటపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ‘విరోష్’ వెడ్డింగ్ విషయానికి వస్తే.. ‘గీత గోవిందం’ సినిమాలో కలిసి నటించిన ఈ జంట, అప్పటి నుంచి ప్రేమించుకుంటూ.. ఇప్పుడు ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించి, రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఫిబ్రవరి 26న అతి కొద్ది మంది సమక్షంలో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.

❤️ pic.twitter.com/7193UPPhBh

ప్రధాన నగరాల్లో స్వీట్ల పంపిణీ

— Vijay Deverakonda (@TheDeverakonda) February 28, 2026

విజయ్, రష్మికల ఈ గొప్ప ఆలోచనను అందరూ మెచ్చుకుంటున్నారు. పెళ్లి వేడుకను సమాజానికి ఉపయోగపడేలా చేయడం అభినందనీయం. వారి జీవితం ఆనందంగా సాగాలని కోరుకుందాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.