
📌 Key Points
- మహిళల డ్రెస్సింగ్పై శివాజీ చేసిన వ్యాఖ్యలకు పాయల్ రాజ్పుత్ గట్టి కౌంటర్ ఇచ్చారు.
- మహిళల దుస్తుల గురించి మాట్లాడే హక్కు శివాజీకి ఎవరు ఇచ్చారని పాయల్ నిలదీశారు.
- దండోరా ఈవెంట్లో శివాజీ పొట్టి బట్టలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
- పరిశ్రమ ఆగ్రహం వ్యక్తం చేయడంతో శివాజీ క్షమాపణలు చెప్పక తప్పలేదు.
మహిళల దుస్తులపై శివాజీ చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్లో పెద్ద దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలకు హీరోయిన్ పాయల్ రాజ్పుత్ సంచలన కౌంటర్ ఇచ్చారు. శివాజీ తీరుపై సినీ పరిశ్రమ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో, చివరకు ఆయన క్షమాపణలు చెప్పారు.
పాయల్ రాజ్పుత్ ఘాటు రియాక్షన్
శివాజీ వ్యాఖ్యలపై టాలీవుడ్ హీరోయిన్ పాయల్ రాజ్పుత్ రియాక్ట్ అయ్యారు. మా డ్రెస్సుల పై మాట్లాడే హక్కు శివాజీకి ఎవరు ఇచ్చారని నిలదీశారు పాయల్. మహిళల డ్రెస్సింగ్ ఎలా ఉండాలని చెప్పే రైట్ మీకు లేదన్నారు. బహిరంగ వేదికపై మహిళల గురించి శివాజీ మాట్లాడటం దారుణమని ఫైర్ అయ్యారు. మహిళలపై ఆయన చేసిన వ్యాఖ్యలు అసహ్యించుకునేలా ఉన్నాయని మండిపడ్డారు.
ఇలాంటి సంఘటన మళ్లీ జరుగకుండా చూడాలని కోరారు. ఇది ఇలా ఉండగా, దండోరా ఈవెంట్ లో మహిళల దుస్తులపై హాట్ కామెంట్స్ చేశారు శివాజీ. పొట్టి బట్టలు వేసుకుని, తిరడం ఏంటని ప్రశ్నించారు. హీరోయిన్లు చీర కట్టులో కనిపిస్తే, అదే అందం అన్నారు. ఇక ఈ వ్యాఖ్యల నేపథ్యంలో శివాజీపై ఇండస్ట్రీ మొత్తం విరుచుకుపడింది. దీంతో ఆయన క్షమాపణలు కూడా చెప్పారు.
మహిళల దుస్తులపై శివాజీ వ్యాఖ్యలు
పరిశ్రమ ఆగ్రహం.. క్షమాపణలు చెప్పిన శివాజీ
ఈ వివాదం మహిళల గౌరవం, వారి వ్యక్తిగత స్వేచ్ఛపై చర్చకు దారితీసింది. శివాజీ క్షమాపణలతో ఈ వివాదం సద్దుమణిగినప్పటికీ, సెలబ్రిటీలు బహిరంగ వ్యాఖ్యలు చేసేటప్పుడు జాగ్రత్త వహించాలని మరోసారి స్పష్టమైంది.


