
📌 Key Points
- పెద్ది సినిమా 4 రోజుల్లో రూ. 250 కోట్లకు పైగా వసూలు చేసి బ్లాక్ బస్టర్ హిట్.
- పెద్ది కోసం రామ్ చరణ్ రెండేళ్లు కష్టపడ్డారు, తీవ్ర గాయాలతో బాధపడ్డారు.
- గాయాల నుంచి కోలుకోవడానికి 3 నెలల పాటు సినిమాల నుంచి విరామం ప్రకటించిన చరణ్.
- కుటుంబంతో గడపడానికి, విదేశీ పర్యటనలకు వెళ్లే అవకాశం, సుకుమార్ సినిమా వాయిదా.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమాతో బాక్సాఫీస్ను షేక్ చేశారు! ఈ బంపర్ హిట్ తర్వాత చరణ్ తీసుకున్న ఓ సంచలన నిర్ణయం టాలీవుడ్లో ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. అసలు ఏం జరిగింది? పూర్తి వివరాలు మీకోసం!
పెద్ది వసూళ్ల సునామీ: 4 రోజుల్లో రూ. 250 కోట్లు!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మెగాస్టార్ చిరంజీవి వారసత్వాన్ని అందిపుచ్చుకొని ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రామ్ చరణ్.. తన కంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. RRR లాంటి సినిమాతో పాన్ ఇండియా రేంజ్ కు వెళ్లిన రామ్ చరణ్, లేటెస్ట్ గా పెద్ది సినిమా చేశారు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ సినిమా బంపర్ హిట్ అయింది. రిలీజ్ అయిన నాలుగు రోజుల్లోనే రూ. 250 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. అయితే ఈ సినిమా బంపర్ హిట్ అయిన నేపథ్యంలో హీరో రామ్ చరణ్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు టాలీవుడ్ సర్కిల్స్ లో వార్త వైరల్ గా మారింది.
పెద్ది ట్రాన్స్ఫర్మేషన్ కోసం రామ్ చరణ్ దాదాపు రెండు సంవత్సరాలు కష్టపడ్డ సంగతి తెలిసిందే. ఫిజికల్ గా ఎంతో డిమాండ్ ఉన్న రోల్ కు న్యాయం చేసేందుకు ఎక్కడా వెనక్కి తగ్గలేదట. ఈ నేపథ్యంలో ఆయనకు తీవ్ర గాయాలు అయ్యాయి. లేటెస్ట్ గా చేతికి గాయం కూడా జరిగింది. అయితే వాటి నుంచి రికవరీ కావడం కోసం మూడు నెలల పాటు సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నాడట. ఈ మూడు నెలల పాటు ఫ్యామిలీతో కాస్త రిలాక్స్ అయ్యేందుకు డిసైడ్ అయినట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగానే విదేశీ టూర్లకు కూడా వెళ్లే అవకాశాలు ఉన్నాయట. ఈ క్రమంలో సుకుమార్ తో చరణ్ చేయబోయే తర్వాతి సినిమా కాస్త వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని టాక్.
రామ్ చరణ్ సంచలన నిర్ణయం: 3 నెలల బ్రేక్!
సుకుమార్ సినిమా వాయిదా? మెగా ఫ్యాన్స్ లో ఆందోళన!
రామ్ చరణ్ తీసుకున్న ఈ నిర్ణయం అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపింది. ఆయన త్వరగా కోలుకొని మళ్లీ సినిమాలతో సందడి చేయాలని ఆశిద్దాం. మరిన్ని ఆసక్తికరమైన అప్డేట్స్ కోసం వేచి ఉండండి!


