
దివంగత నటి సౌందర్య పేరు వినగానే నటి రమ్యకృష్ణ జగపతి బాబు హోస్ట్ చేస్తున్న ‘జయమ్ము నిశ్చయమ్ము రా’ షోలో భావోద్వేగానికి లోనయ్యారు. సౌందర్యతో తన స్నేహం, ‘అమ్మోరు’, ‘నరసింహ’ వంటి చిత్రాల జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఆమె కంటతడి పెట్టారు. ఈ హృదయ స్పర్శ గల క్షణాలు అందరినీ కదిలించాయి.
Key Points
జగపతి బాబు షోలో సౌందర్య పేరు వినగానే రమ్యకృష్ణ కంటతడి పెట్టారు.
నరసింహ, అమ్మోరు చిత్రాల షూటింగ్ జ్ఞాపకాలను రమ్యకృష్ణ గుర్తుచేసుకున్నారు.
సౌందర్యను అమాయకురాలు, అద్భుతమైన స్నేహితురాలుగా రమ్యకృష్ణ వర్ణించారు.
గర్భవతిగా ఉన్న సౌందర్య 2004లో హెలికాప్టర్ ప్రమాదంలో విషాదంగా మరణించారు.
జగపతి బాబు షోలో రమ్యకృష్ణ భావోద్వేగం
రమ్యకృష్ణ కంటతడి పెట్టింది. దివంగత నటి సౌందర్య పేరు వినగానే ఆమె ఏడ్చేసింది. జీ5లో వచ్చే జగపతి బాబు షో జయమ్ము నిశ్చయమ్ము రాలో గెస్ట్ గా వచ్చిన ఆమె.. సౌందర్యతో కలిసి తాను నటించిన నరసింహ మూవీ సీన్ చూడగానే కంటతడి పెట్టింది.
నటి రమ్యకృష్ణ ఇటీవల జగపతి బాబు హోస్ట్ చేస్తున్న జీ5 (Zee5) టాక్ షో ‘జయమ్ము నిశ్చయమ్ము రా’కు వచ్చింది. ఆ షోలో తమ స్నేహితురాలు, దివంగత నటి సౌందర్య (Soundarya) గురించి మాట్లాడేటప్పుడు రమ్యకృష్ణ భావోద్వేగానికి లోనై కంట తడి పెట్టింది. అమ్మోరు, నరసింహ వంటి చిత్రాల షూటింగ్ సమయంలోని జ్ఞాపకాలను ఆమె గుర్తు చేసుకుంది.
సౌందర్యతో అపురూప జ్ఞాపకాలు
సౌందర్యను తలచుకుని ఏడ్చేసిన రమ్యకృష్ణ
ఆమె పరిస్థితిని గమనించిన జగపతి బాబు.. “మేము ఆ క్లిప్ను ప్లే చేశాం, ఎందుకంటే ఇది మనం గుర్తుంచుకోవాల్సిన క్షణం. సౌందర్య పేరు లాగే ఆమె హృదయం కూడా చాలా సౌందర్యంగా ఉండేది” అని అన్నాడు. కొద్దిసేపటి తర్వాత.. జగపతి బాబు, సౌందర్యతో తన జ్ఞాపకాలను పంచుకోమని రమ్యకృష్ణను అడిగాడు. కన్నీళ్లు తుడుచుకుంటూ ఆమె ఇలా చెప్పింది.
దివంగత నటి సౌందర్య జీవితం – విషాద ముగింపు
“నేను సౌందర్యను మొదటిసారి అమ్మోరు (1995) షూటింగ్ సమయంలో చూశాను. నరసింహ సహా నేను ఆమెతో చాలా సినిమాల్లో పనిచేశాను. అమాయకురాలైన, సహజమైన, అందమైన చిన్నారి పెరిగి పెద్దదై తనను తాను తీర్చిదిద్దుకోవడం చూశాను. ఆమె తనకు వచ్చిన కీర్తికి ఏమాత్రం లొంగిపోలేదు. ఆమె ఒక అద్భుతమైన మనిషి, మంచి స్నేహితురాలు” అని రమ్యకృష్ణ పేర్కొంది. సౌందర్యతో తన స్నేహాన్ని వివరిస్తూ.. తమ పాత ఫొటోలను చూస్తూ రమ్యకృష్ణ చాలా భావోద్వేగానికి గురయింది.
2003 ఏప్రిల్ 27న ఆమె వృత్తిరీత్యా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన జి.ఎస్. రఘును పెళ్లి చేసుకుంది. వారి మొదటి వివాహ వార్షికోత్సవానికి కొద్ది రోజుల ముందు అంటే 2004 ఏప్రిల్ 17న, సౌందర్య తన సోదరుడు అమర్నాథ్తో కలిసి హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయింది. బీజేపీ తరఫున ప్రచారం చేయడానికి బెంగళూరు నుంచి కరీంనగర్ కు వచ్చే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. ఆ సమయంలో ఆమె గర్భవతిగా ఉంది.
సౌందర్యతో రమ్యకృష్ణ స్నేహాన్ని గుర్తుచేసుకోవడం, ఆమెను కీర్తించడం ఒక గొప్ప నివాళి. ఆమె జీవితం విషాదంగా ముగిసినా, ఆమె జ్ఞాపకాలు ఎప్పటికీ మన మనసుల్లో నిలిచి ఉంటాయని ఈ క్షణం రుజువు చేసింది.


