
540 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన సూపర్ హిట్ సినిమా సైయారా, త్వరలోనే ఓటీటీలో ప్రసారం కానుంది. నెట్ఫ్లిక్స్లో విడుదలయ్యే ఈ సినిమా రిలీజ్ డేట్ ఇప్పుడు వెల్లడైంది.
Key Points
540 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన సైయారా సినిమా
సెప్టెంబర్ 12, 2025 నుండి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్
యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్పై నిర్మించబడింది
సైయారా ఓటీటీ రిలీజ్ డేట్
2025లో ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న సినిమా ‘సైయారా’ (Saiyaara). ఈ రొమాంటిక్ లవ్ స్టోరీ కలెక్షన్ల రికార్డులు బద్దలు కొడుతోంది. ఇండియాలోనే అత్యధిక వసూళ్లు సాధించిన రొమాంటిక్ మూవీగా హిస్టరీ క్రియేట్ చేసింది. ఈ సెన్సేషనల్ మూవీ ఓటీటీలోకి ఎప్పుడొస్తుందా? అని మూవీ లవర్స్ వెయిట్ చేస్తున్నారు. ఆ వెయిటింగ్ ఎండ్ కార్డు వేసే వార్త ఇది.
ఇండియా బిగ్గెస్ట్ రొమాంటిక్ బ్లాక్ బస్టర్ సైయారా సినిమా ఓటీటీ డేట్ లాక్ అయింది. ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ఫ్లిక్స్ లోకి రాబోతోంది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఓటీటీ లోకి మూవీ ఎప్పుడొస్తుందా? అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు అనూహ్యంగా స్ట్రీమింగ్ డేట్ రివీలైంది.
540 కోట్ల కలెక్షన్ల సాఫల్యం
ఓటీటీలోకి సైయారా మూవీ అడుగుపెట్టే రోజు ఏదో కన్ఫామ్ అయింది. ఈ సినిమా సెప్టెంబర్ 12, 2025 నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది. అయితే ఈ విషయాన్ని సైయారా మూవీ టీమ్ కానీ లేదా నెట్ఫ్లిక్స్ కానీ అఫీషియల్ గా ప్రకటించలేదు. కానీ ప్రొడక్షన్ హౌజ్ అయిన యశ్ రాజ్ ఫిల్మ్ క్యాస్టింగ్ డైరెక్టర్ షానూ శర్మ ఇన్స్టాగ్రామ్ స్టోరీతో రివీల్ ఓటీటీ డేట్ రివీలైంది. ఓటీటీఫ్లిక్స్ ప్రకారం సైయారా సెప్టెంబర్ 12, 2025న నెట్ఫ్లిక్స్లో ప్రసారం అవుతుందని ఆ స్టోరీ వెల్లడించింది.
సైయారా మూవీ బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. జులై 18న ఈ సినిమా థియేటర్లలో రిలీజైంది. అప్పటి నుంచి కలెక్షన్ల మోత మోగిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.540 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించింది. రికార్డుల దుమ్ము రేపుతోంది. ఈ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం ఎదురు చూస్తున్న సినీ లవర్స్ కు ఇప్పుడు అదిరే అప్ డేట్ అందింది.
సినిమా కథాంశం
అహాన్ పాండే, అనీత్ పడ్డా జంటగా నటించిన రొమాంటిక్ లవ్ స్టోరీ సైయారా. మోహిత్ సూరి ఈ మూవీకి డైరెక్టర్. యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ పై దీన్ని నిర్మించారు. సింగింగ్ సెన్సేషన్ గా మారాలనుకునే క్రిష్ కపూర్, జర్నలిస్ట్ వాణి బత్రా లవ్ స్టోరీ ఇది. వాణి రాసే లిరిక్స్ ను పాటలుగా పాడి క్రిష్ కపూర్ ఫేమస్ అవుతాడు. ఆ తర్వాత వీళ్లిద్దరి ప్రేమ ఏ దిశగా సాగింది? మధ్యలో ఈగో, ఇతర సవాళ్లను ఎలా దాటారు? అనేదే కథ. ఈ యూత్ ఫుల్ లవ్ స్టోరీ ఎమోషన్ యంగ్ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
చివరగా, సైయారా సినిమా ఓటీటీ ప్రేక్షకులకు సెప్టెంబర్ 12, 2025 నుండి అందుబాటులో ఉంటుంది. ఈ రొమాంటిక్ డ్రామా యొక్క విజయం ఖచ్చితంగా ఓటీటీ వేదికపై కొనసాగుతుంది.


