
📌 Key Points
- సూడాన్లోని ఎడ్ డేన్లో ఈద్ వేళ ఆస్పత్రిపై డ్రోన్ దాడి, 64 మంది మృతి.
- మృతుల్లో 13 మంది చిన్నారులు, ఒక డాక్టర్, ఇద్దరు నర్సులు ఉన్నారని WHO ధ్రువీకరణ.
- దాడికి సూడాన్ ఆర్మీ కారణమని RSF ఆరోపణ, ఆర్మీ ఖండన.
- 2023 నుండి సూడాన్లో ఆరోగ్య కేంద్రాలపై 213 దాడులు, 2,000 మందికి పైగా మృతి.
సూడాన్లో దారుణం చోటుచేసుకుంది. ఈద్ వేళ తూర్పు డార్ఫర్ రాష్ట్ర రాజధాని ఎడ్ డేన్లోని ఆస్పత్రిపై జరిగిన డ్రోన్ దాడిలో 64 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన దేశంలో తీవ్ర విషాదాన్ని నింపింది.
ఎడ్ డేన్లో ఆస్పత్రిపై డ్రోన్ దాడి: 64 మంది మృతి
ఆధిపత్య పోరులో భాగంగా ఓ వర్గం ఆస్పత్రిపై దాడి చేయడంతో 64 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ షాకింగ్ సంఘటన సూడాన్ చోటు చేసుకుంది. అనేక సంవత్సరాలుగా ఆధిపత్య పోరుతో అట్టుడుకుతున్న ఈ ప్రాంతంలో నిత్యం ఇలాంటి దారుణ సంఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా ఈద్-అల్-ఫితర్ పండుగ వేళ తూర్పు డార్ఫర్ రాష్ట్ర రాజధాని ‘ఎడ్ డేన్’ (Ed Daein) లోని టీచింగ్ ఆస్పత్రిలో జరిగిన డ్రోన్ దాడి చేశారు. ఈ దాడిలో 64 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 13 మంది చిన్నారులు, ఒక డాక్టర్, ఇద్దరు నర్సులు కూడా మరణించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) చీఫ్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ ధృవీకరించారు. దాదాపు 89 మంది తీవ్రంగా గాయపడ్డారని, ఆస్పత్రిలోని ఎమర్జెన్సీ వార్డు, ప్రసూతి విభాగం పూర్తిగా ధ్వంసమై ఆసుపత్రి సేవలు నిలిచిపోయాయని ఆయన వెల్లడించారు.
కాగా ఆస్పత్రిపై జరిగిన ఈ దాడిపై పరస్పర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పారామిలిటరీ దళం రాపిడ్ సపోర్ట్ ఫోర్స్ (RSF) ఆధీనంలో ఉన్న ఈ ప్రాంతంలో సూడాన్ ఆర్మీనే ఈ దాడికి పాల్పడిందని RSF ఆరోపిస్తోంది. అయితే, సైన్యం ఈ ఆరోపణలను తిరస్కరించింది. తాము కేవలం సమీపంలోని పోలీస్ స్టేషన్ను మాత్రమే లక్ష్యంగా చేసుకున్నామని, ఆస్పత్రిపై దాడి చేయలేదని ఆర్మీ వర్గాలు పేర్కొన్నాయి. 2023 ఏప్రిల్ నుండి జరుగుతున్న ఈ అంతర్యుద్ధంలో ఇప్పటివరకు ఆరోగ్య కేంద్రాలపై జరిగిన 213 దాడుల్లో మొత్తం 2,000 మందికి పైగా మరణించినట్లు WHO గణాంకాలు చెబుతున్నాయి.
మృతుల్లో చిన్నారులు, వైద్య సిబ్బంది: WHO
దాడికి కారణమెవరు? పరస్పర ఆరోపణలు
సూడాన్లో కొనసాగుతున్న అంతర్యుద్ధం మరింత విషాదాన్ని నింపుతోంది. ఆరోగ్య కేంద్రాలపై దాడులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. శాంతి నెలకొనాలని ఆశిద్దాం.


