
ముగ్గురు పిల్లల తల్లి సన్నీ లియోనీ, తన ప్రెగ్నెన్సీ అనుభవం ఇష్టం లేకపోవడంతో సరోగసీ ద్వారా పిల్లలను పొందడం గురించి ‘ఆల్ అబౌట్ హర్’ పాడ్కాస్ట్లో మాట్లాడింది. ఆమె సరోగసీ మదర్కు ఇచ్చిన డబ్బుతో ఆమె కొత్త ఇల్లు కొనుక్కున్నట్లు తెలిపింది.
Key Points
సన్నీ లియోనీ సరోగసీ ద్వారా ముగ్గురు పిల్లలకు తల్లి అయ్యింది.
ఆమె సరోగసీ మదర్కు భారీగా డబ్బు ఇచ్చింది.
సరోగసీ మదర్ ఆ డబ్బుతో కొత్త ఇల్లు కొనుక్కుంది.
సన్నీ లియోనీ తన అనుభవాలను 'ఆల్ అబౌట్ హర్' పాడ్కాస్ట్లో పంచుకుంది.
సన్నీ లియోనీ సరోగసీ అనుభవం
ముగ్గురు పిల్లల తల్లి అయిన బాలీవుడ్ నటి సన్నీ లియోనీ.. వీళ్లలో ఒక్కరిని కూడా కనలేదు. ఒకరిని దత్తత తీసుకోగా, మరో ఇద్దరిని సరోగసీ ద్వారా పొందింది. దత్తత తీసుకున్న కూతురు నిషా, సరోగసీ ద్వారా పుట్టిన కవలలు నోహ్, అషర్.. తన సరోగసీ ఎక్స్పీరియన్స్ గురించి ఆమె తాజాగా ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పింది. ఆ సరోగసీ మదర్ కు భారీగా డబ్బు ఇచ్చామని, దాంతో ఆమె ఇల్లు కట్టుకుందని, భారీగా ఖర్చు పెట్టి పెళ్లి చేసుకుందని చెప్పడం విశేషం.
సన్నీ లియోనీ తాజాగా సోహా అలీ ఖాన్ హోస్ట్ చేసే ‘ఆల్ అబౌట్ హర్’ అనే పాడ్కాస్ట్లో సరోగసీ జర్నీ గురించి మాట్లాడింది. ఈ ఎపిసోడ్ ట్రైలర్ను సోహా గురువారం (ఆగస్టు 28) పోస్ట్ చేసింది. ఇందులో సన్నీ తన లైఫ్ గురించి నిజాయితీగా మాట్లాడింది.
వీడియో మొదట్లో సోహా మాట్లాడుతూ.. “ఈరోజు ఎపిసోడ్ పేరెంట్స్ అవ్వడానికి ఉన్న వివిధ మార్గాలను ఎక్స్ప్లోర్ చేయడం గురించి” అని చెప్పింది. దానికి సన్నీ స్పందిస్తూ.. “నేను ఒక బిడ్డను దత్తత తీసుకోవాలని అనుకున్నాను” అని తెలిపింది. ఆ పాడ్కాస్ట్లో ఇండియాలో ఉన్న గైనకాలజిస్టులలో ఒకరైన కిరణ్ కోయెల్హో కూడా మహిళల ఆరోగ్యం గురించి మాట్లాడారు.
సరోగసీ మదర్కు భారీ ఖర్చు
సన్నీ ఒక పాపను దత్తత తీసుకునే జర్నీ గురించి మాట్లాడుతూ.. “మేము అడాప్షన్ కోసం అప్లై చేశాం. ఐవీఎఫ్ రోజునే మాకు ఒక పాపతో మ్యాచ్ అయింది” అని చెప్పింది.
ఇక ఇదే చర్చలో ప్రెగ్నెన్సీ ని ఇష్టపడలేదా అని సన్నీ లియోనీని సోహా అలీ ఖాన్ అడిగింది. దానికి సన్నీ స్పందిస్తూ.. “అవును.. నేను ఇష్టపడలేదు” అని ఒప్పుకుంది. ఇక సరోగసీకి ఎంత ఖర్చు అయిందని కూడా అడిగింది.
దానికి సన్నీ స్పందిస్తూ.. “మేము వీక్లీ ఫీజ్ చెల్లించాం. ఆమె భర్త కూడా డ్యూటీకి వెళ్లకుండా ఉన్నందుకు డబ్బులు తీసుకున్నారు. సో, ఆమెకి అందుకు కూడా డబ్బులు చెల్లించాం. మేము చాలా డబ్బులు ఇచ్చాం. ఆమె ఒక ఇల్లు కొనుక్కుంది. భారీగా ఖర్చు పెట్టిన పెళ్లి చేసుకుంది” అని చెప్పింది.
‘ఆల్ అబౌట్ హర్’ పాడ్కాస్ట్లో సన్నీ లియోనీ
సన్నీ లియోనీ, డేనియల్ వెబర్ 2011లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు. 2017లో దత్తత తీసుకున్న కూతురు నిషా. ఇక 2018లో సరోగసీ ద్వారా పుట్టిన కవల కొడుకులు నోహ్, అషర్. సన్నీ తరచుగా పుట్టినరోజుల వేడుకలు, ఫ్యామిలీ వెకేషన్స్ ఇతర స్పెషల్ అకేషన్స్లో వాళ్ళ ఫొటోలను షేర్ చేస్తూ ఉంటుంది.
2011లో సన్నీ లియోనీ బిగ్ బాస్ 5 లో ఒక కంటెస్టెంట్గా కనిపించింది. ఆ తర్వాత సంవత్సరం జిస్మ్ 2తో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. రాగిణి ఎంఎంఎస్ 2, ఏక్ పహేలీ లీలా, మస్తీజాదే లాంటి సినిమాల్లో నటించింది. అలాగే ఒక డేటింగ్ రియాలిటీ షో ఎంటీవీ స్ప్లిట్స్విల్లాకి హోస్ట్ గా కూడా వ్యవహరించింది.
సన్నీ లియోనీ తన నిజాయితీతో కూడిన సరోగసీ అనుభవాన్ని పంచుకోవడం ద్వారా, అనేక మందికి స్ఫూర్తినిచ్చింది. ఆమె పిల్లలతో సంతోషంగా ఉండటం అభినందనీయం.


