|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

తమన్నా చెబితే కొంటారా : రమ్య

Published: 25-05-2025, 1:45 AM
తమన్నా చెబితే కొంటారా : రమ్య

మైసూరు శాండల్ సబ్బుల బ్రాండ్ అంబాసిడర్ గా తమన్నాను నియమించడంపై వివాదం చెలరేగింది. కన్నడ నేతలు, నటీమణులు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. ప్రముఖ నటి రమ్య కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

Key Points

1

తమన్నా మైసూరు శాండల్ సబ్బుల బ్రాండ్ అంబాసిడర్ గా నియామకంపై వివాదం.

2

కన్నడ నేతలు, నటీమణులు తమన్నా నియామకాన్ని వ్యతిరేకిస్తున్నారు.

4

రమ్య, ఒక ఉత్పత్తి నాణ్యతను బట్టి అమ్ముకుంటుందని, సెలబ్రిటీ ప్రచారం అవసరం లేదని అభిప్రాయపడ్డారు.

తమన్నా నియామకంపై వివాదం

శివాజీనగర: మైసూరు శాండల్‌ సబ్బుల ప్రచారకర్తగా నటి తమన్నాను నియమించడంపై కన్నడ నేతలు, తారల ఆగ్రహం కొనసాగుతోంది. నటి, మాజీ ఎంపీ రమ్య కూడా అసమ్మతిని వ్యక్తం చేశారు. ప్రతి కన్నడిగుడు మైసూరు శాండల్‌ సోపు రాయబారి అని అన్నారు. ఈ పాత్ర కోసం తమన్నాకు కోట్లాది రూపాయాలను చెల్లింపు వెనుక తర్కాన్ని ప్రశ్నించారు.

సెలిబ్రిటీల ప్రచారం కోసం సర్కారు ప్రజల సొమ్మును ఖర్చు చేయడం తగదన్నారు. సోపు రుద్దితే తెల్లగా కారు, సెలిబ్రిటీలు చెబితే ప్రజలు ఆ ఉత్పత్తులను కొనుగోలు చేసే రోజులు చాలా ఏళ్ల క్రితమే గతించాయని శనివారం సోషల్‌ మీడియాలో చెప్పారు. ఒక ఉత్పత్తి నిజంగా విలువైనదైతే అందరూ కొంటారన్నారు. మైసూరు శాండల్‌పై ఇప్పటికే ప్రజల్లో ఎంతో నమ్మకం ఉందని, తమన్నా ప్రచారం అవసరం లేదని పరోక్షంగా తేల్చిచెప్పారు.

కన్నడ నేతలు, నటీమణుల ఆగ్రహం

రమ్య విమర్శలు

మైసూరు శాండల్ సబ్బులకు తమన్నా ప్రచారం అవసరమా లేదా అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ప్రజల నమ్మకంపైనే ఉత్పత్తుల విజయం ఆధారపడి ఉంటుందని రమ్య వంటి వారు అభిప్రాయపడుతున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.