
📌 Key Points
- ఇరాన్ సైనిక శక్తిని పూర్తిగా నిర్వీర్యం చేశామన్న ట్రంప్
- ఇరాన్ రక్షణ వ్యవస్థలను కోల్పోయిందని ప్రకటన
- ఇరాన్ నౌకాదళం, వైమానిక దళం ధ్వంసం అయ్యాయని వెల్లడి
- ఇరాన్ నాయకత్వం మూడు స్థాయిలకు పడిపోయిందని డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్య
అమెరికా, ఇజ్రాయెల్ సైనిక చర్యల ఫలితంగా ఇరాన్ సైన్యాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశామని డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఇరాన్ నౌకాదళం, వైమానిక దళం ధ్వంసం అయ్యాయని ఆయన తెలిపారు.
ట్రంప్ ప్రకటనలో ఇరాన్ సైనిక పరిస్థితి
ఇరాన్పై అమెరికా (America), ఇజ్రాయెల్ (Israel) జరుపుతున్న సైనిక దాడుల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇరాన్ సైనిక శక్తిని తాము పూర్తిగా నిర్వీర్యం చేశామని ప్రకటించారు. తాజాగా అందిన సమాచారం ప్రకారం ఇరాన్ తన రక్షణ వ్యవస్థలను కోల్పోయిందని పేర్కొన్నారు. ఇరాన్ సైన్యం అంతమైపోయిందని.. వారి నౌకాదళం (Navy) కనుమరుగైైందని, కమ్యూనికేషన్ వ్యవస్థలు పూర్తిగా ధ్వంసమయ్యాయని తెలిపారు.
ఇరాన్ నాయకులు ఒకరి తర్వాత ఒకరు తుడిచిపెట్టుకుపోతున్నారని అన్నారు. ఇప్పటికే రెండు స్థాయిల నాయకత్వం అంతమైందని, ఇప్పుడు వారు మూడో స్థాయి నాయకత్వంతో నెట్టుకొస్తున్నారని క్లారిటీ ఇచ్చారు. ఇరాన్ వద్ద ఉన్న 32 నౌకలు ఇప్పుడు సముద్ర గర్భంలో ఉన్నాయని.. అసలు ఆ దేశానికి నౌకాదళం అనేదే ఇప్పుడు లేదన్నారు. ఇక వైమానిక దళం (Air Force) విషయానికి వస్తే పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందని వారికి ఇప్పుడు గగనతల రక్షణే లేదని డొనాల్డ్ ట్రంప్ స్టేట్మెంట్ ఇచ్చారు.
ఇరాన్ రక్షణ వ్యవస్థలపై ట్రంప్ వ్యాఖ్యలు
అమెరికా, ఇజ్రాయెల్ దాడుల ప్రభావం
ట్రంప్ ప్రకటనతో ఇరాన్ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ఇరాన్ ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్తుందో చూడాలి.


