
📌 Key Points
- TTD ఆలయాల్లో ఖాళీ గోనె సంచుల సేకరణకు టెండర్ ఆహ్వానం.
- ఏప్రిల్ 22 సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తులు సమర్పించాలి.
- జూలై నెలకు సంబంధించిన దర్శనం, గదుల కోటాను TTD విడుదల చేయనుంది.
- www.tirumala.org, www.konugolu.ap.gov.in వెబ్సైట్లలో పూర్తి వివరాలు అందుబాటులో ఉన్నాయి.
తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) మరో కీలక ప్రకటన చేసింది. ఆలయాల్లో వినియోగించిన ఖాళీ గోనె సంచుల సేకరణకు టెండర్లను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. అలాగే జూలై నెల దర్శనం కోటాను కూడా విడుదల చేయనుంది.
ఖాళీ గోనె సంచుల సేకరణకు టెండర్ ప్రకటన
తిరుమల తిరుపతి దేవస్థాన నుంచి మరో టెండర్ ప్రక్రియకు సంబంధించిన అప్డేట్ వచ్చింది. ఆసక్తిగలవారు ఈ టెండర్ల ప్రక్రియలో పాల్గొనవచ్చు. ఈ మేరకు టీటీడీ ప్రకటన విడుదల చేసింది. టీటీడీ ఆలయాల్లో వినియోగించిన ఖాళీ గోనె సంచుల సేకరణకు సంబంధించి ఆసక్తి గల వ్యక్తులు, సంస్థల నుంచి ఈ టెండర్లు ఆహ్వానిస్తున్నట్టుగా అధికారులు తెలిపారు. వ్యాపార అవకాశాల కోసం ఎదురుచూస్తున్న చాలా మందికి ఇది ఎంతగానో ఉపయోగపడనుంది.
టీటీడీ ఆధ్వర్యంలో శ్రీవారి ఆలయం, ఇతర అనుబంధ ఆలయాలలో 2026 ఏప్రిల్ 1 నుండి 2027 మార్చి 31వ తేదీ వరకు వినియోగించిన ఖాళీ గోనె సంచుల సేకరణకు ఆసక్తి గల వ్యక్తులు, సంస్థల నుండి ఈ-టెండర్లు ఆహ్వానిస్తుంది. టెండర్లో పాల్గొనదలచిన వారు ఈ-కొనుగోలు పోర్టల్ ద్వారా రూ.75,000/- (EMD) చెల్లించి తమ దరఖాస్తులను ఏప్రిల్ 22వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు సమర్పించాలి.
టెండర్ దాఖలుకు ముఖ్యమైన తేదీలు
పూర్తి వివరాలకు www.tirumala.org, www.konugolu.ap.gov.inవెబ్సైట్లలో గానీ, కార్యాలయ సమయాల్లో తిరుపతి లోని మార్కెటింగ్ విభాగం జనరల్ మేనేజర్(వేలం) ఫోన్ నెంబర్ 0877- 2264429లో గానీ సంప్రదించాలి.
2026 జూలై నెలకు సంబంధించి టీటీడీ దర్శన కోటా గురించి అప్డేట్ వచ్చింది. విడుదల చేసే వివిధ దర్శనాల, గదుల కోటా వివరాలు ఈ విధంగా ఉన్నాయి : తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల(సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవ)కు సంబంధించిన కోటాను ఏప్రిల్ 18న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది.
జూలై దర్శనం, గదుల కోటా విడుదల
తిరుమల , తిరుపతిలలో గదుల కోటాను 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు. https://ttdevasthanams.ap.gov.in వెబ్సైట్ ద్వారా శ్రీవారి ఆర్జితసేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ తెలిపింది.
ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు.
హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్సైట్స్ లాంచ్ టీమ్లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు. Read More
TTD విడుదల చేసిన ఈ ప్రకటన భక్తులకు, వ్యాపారస్తులకు ఉపయోగకరంగా ఉంటుంది. టెండర్ ప్రక్రియలో పాల్గొనేందుకు ఆసక్తి గలవారు త్వరగా దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు.


